ప్రస్తుతం బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. చిన్న హీరో మొదలుకొని పెద్ద హీరో వరకు మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవలే దేశంలో ₹1000 కోట్లకు పైగా కలెక్షన్ సాధించిన “RRR” కూడా మల్టీ స్టార్ సినిమా. దక్షిణాది సినిమా రంగంలోనే అతిపెద్ద మల్టీ స్టారర్ ప్రాజెక్టుగా.. చరణ్ మరియు తారక్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలామందిని ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళ సినిమా రంగంలో అతిపెద్ద మల్టీస్టారర్ సినిమా చేయడానికి ఇద్దరు బడా హీరోలు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. విక్రమ్ కొత్త సినిమా “కోబ్రా” ఇటీవల విడుదలయ్యింది. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియాలో అభిమానులతో ఇంట్రాక్ట్ అయిన విక్రమ్ పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తనకోసం ఒక మాస్ సబ్జెక్టు రెడీ చేసినట్లు తెలియజేశారట.
అంతేకాదు “కోబ్రా” దర్శకుడుతో మరో సినిమా చేయడానికి రెడీ అయినట్లు అది ఓ భారీ మల్టీ స్టార్ సినిమా అని విక్రమ్ చెప్పుకొచ్చారట. ఇదే సందర్భంలో హీరో విజయ్ అంటే కూడా ప్రత్యేకమైన అభిమానమని.. కచ్చితంగా అతనితో ఒక సినిమా ఉంటుందని చెప్పుకు రావటం జరిగింది. దీంతో “కోబ్ర” దర్శకుడు విక్రమ్ తో చేయబోయే రెండో సినిమా.. మల్టీస్టారర్ అన్న టాక్ నడుస్తుంది. తమిళ సినిమా రంగంలో మంచి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్.. ఈ ఇద్దరు హీరోలకు ఉంది. ఈ ప్రాజెక్టు ఓకే అయితే దక్షిణాదిలో ఇది సెన్సేషనల్ ప్రాజెక్ట్ అవుతుందని తాజా వార్త సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.