Bheemla Naayak: “బీమ్లా నాయక్” ఈనెల 25 వ తారీఖున విడుదలయ్యి ప్రేక్షకాదరణ పొందిన సంగతి తెలిసిందే. పవన్ సినిమా కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఓపెనింగ్స్ భారీ ఎత్తున రావడం జరిగింది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పవన్ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో… పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా థియేటర్ల వద్ద సందడి చేస్తూ.. హడావుడి సృష్టించడం జరిగింది. ఏకంగా సినిమా ధియేటర్లో పాటలకు… స్క్రీన్ మీద కేకేసి రచ్చ రచ్చ చేయడంతోపాటు… మరికొన్ని చోట్ల థియేటర్ బయట కటౌట్ లకు పాలాభిషేకాలు… హారతులు పట్టడం.. కొబ్బరికాయలు కొట్టడం… దిష్టి తీయడం మాత్రమే కాక కొంత మంది చెయి కోసుకుని రక్తంతో… పవన్ కటౌట్ లకు బొట్టు పెట్టడం జరిగింది.
ఇదిలా ఉంటే చిత్తూరులో ఏకంగా “బీమ్లా నాయక్” సినిమా ఆడుతున్న థియేటర్ బయట పవన్ అభిమానులు అతిగా… అభిమానం చూపించి ఏకంగా జంతు బలి ఇవ్వటంతో వారిపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పక్షుల బలి నిరోధక చట్టం-1950లోని సెక్షన్-6 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాదు ఐపీసీ 34, 429, ఆయుధాల చట్టం సెక్షన్ 25(1)(A), పీసీఏ 11(1)(a) కూడా నిందితులపై మోపారు. ఒక మేకను తీసుకు వచ్చి చాలా దారుణంగా సినిమా ధియేటర్ వద్ద బలి ఇవ్వటంతో… వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో రావడంతో… ఈ ఘటనకు పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది.
అభిమానం చూపించవచ్చు కానీ… మరీ ఇంత దారుణంగా మూగజీవాలను.. చంపేసి .. అత్యుత్సాహం చూపించడం దారుణం అని తాజా వార్త పై జనాలు రియాక్ట్ అవుతున్నారు. “బీమ్లా నాయక్” సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం సినిమాకి సంబంధించి వస్తున్న కలెక్షన్లు పూర్తి రన్ టైం బట్టి చూస్తే 200 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని.. సరికొత్త రికార్డు సృష్టించడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాల అంచనా.