సినీ నటుడు సీనియర్ రచయిత పోసాని కృష్ణమురళి ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. రాజకీయరంగంలో, సినిమా రంగంలో రాణిస్తున్న పోసాని కృష్ణ మురళి ఉన్నది ఉన్నట్టు ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి అని అందరికీ తెలిసిందే. అటువంటి చిరంజీవి గురించి షాకింగ్ కామెంట్ చేశారు.
పూర్తి మేటర్ లోకి వెళ్తే “ప్రజారాజ్యం” పార్టీ పెట్టిన సందర్భంలో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి జరిగిన ఘటన అడ్డంపెట్టుకుని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహారం గుర్తుచేసుకుని ఫైర్ అయ్యారు. ఆ సందర్భంలో దాదాపు రెండు నెలలపాటు చిరంజీవి ఏడవటం నేను దగ్గరుండి చూశాను అని పోసాని తెలిపారు. కావాలని చంద్రబాబు అప్పట్లో మహిళా నేతలతో చిరంజీవిని మానసికంగా కృంగదీసేలా మాట్లాడించారు అని స్పష్టం చేశారు. ఆ సందర్భం చిరంజీవికి ఎంతో మనస్తాపాన్ని కలిగించింది అని పోసాని చెప్పుకొచ్చారు.
రెండు నెలలపాటు పార్టీ పెట్టిన సమయంలో మానసికంగా చిరంజీవి ఆ సందర్భం విషయంలో నిరుత్సాహం చెందారని…. కొన్ని సందర్భాలలో ఏడవటం కూడా జరిగిందని పోసాని తెలిపారు. అటువంటి సందర్భంలో తాను నేరుగా నే చంద్రబాబుని విమర్శించడం జరిగిందని పోసాని ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా విమర్శలు చేసే టిడిపి పార్టీ నేతలనూ బహిరంగంగానే విమర్శలు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. పార్టీ టికెట్లు చిరంజీవి అమ్ముకున్నట్లు అప్పట్లో దుష్ప్రచారం చేశారని, కానీ చిరంజీవికి అలాంటివి ఏమీ తెలియదని పోసాని చేప్పుకొచ్చారు. వాస్తవానికి చిరంజీవికి అసలు రాజకీయాలు తెలియవని కల్మషం లేని రాజకీయ నేత అని పోసాని కొనియాడారు.