Devatha Serial: స్కూల్ నుంచి పిల్లలు వస్తుండగా రాధా ఏంటమ్మా ఇంత లేట్ అయిందని పలకరిస్తుంది.. పిల్లలు ఏం మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోతారు.. ఇక స్కూల్ లో క్యారేజ్ కూడా తినలేదని వాళ్ళ నానమ్మ చెబుతుంది.. మేము తినకపోతే మీకు ఏమైంది..!? మీకు నచ్చిన పని చేస్తున్నాము కదా..! అంటూ కోపంగా పిల్లలు వాళ్ల రూమ్ లోకి వెళ్లి పోతారు.. మరి ఏం చేసి రాధా పిల్లలకు అన్నం తినిపించిందంటే..!
వాళ్ల తాతయ్య రాధా, మాధవ్ లను ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా పిల్లలు అన్నం తినలేదు అని అంటాడు. ఇప్పుడు అన్నం తినకపోతే ఏం చేస్తారు అని అంటారు. అలాగే పిల్లల్ని వదిలేస్తారా అని అడిగితే రాదా వాళ్ల చేత అన్నం ఎలా తినిపించాలో నాకు తెలుసు అని చెబుతుంది. ఇక పిల్లలను అన్నానికి రమ్మని పిలుస్తుంది. వాళ్ళు రాకుండా మెట్ల మీద నుంచుని ఉంటారు భోజనానికి కూర్చున్న వాళ్ల నాన్న వాళ్లు రాకపోయేసరికి బయట కిడ్స్ తిన్నాను నాకు ఆకలిగా లేదంటూ లేగుస్తాడు.. వాళ్ల తాతయ్య ఇందాక మీ నానమ్మ జ్యూస్ ఇచ్చింది అది తాకగా నాకు ఆకలిగా లేదు అంటూ లెగుస్తారు. వాళ్ళ నానమ్మ కూడా మీరు తాగిన జ్యూసే నేను తాగాను నాకు ఆకలి లేదు అని చెబుతుంది. ఇక మీకు ఎవరికీ లేని ఆకలి నాకు ఎక్కడి నుంచి వస్తుంది. నేను కూడా తినను వాళ్ల అమ్మ అని చెబుతుంది. దాంతో పిల్లలు మనం వేసిన ప్లాన్ మనకు అప్ప చెబుతున్నారు. అమ్మ అన్నం తినకపోతే ఎలాగా పొద్దున్నుంచి పని చేసి అలసిపోయి ఉంటుందని అమ్మ కోసం భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. దాంతో ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తారు..
సత్య ఆదిత్య పిల్లల్ని నువ్వు అంత బాగా ఎలా చూసుకుంటానాని చెప్పావు అంటుంది. వాళ్ళ పిల్లలు మన పిల్లలు కాదు కదా.. అయినా నువ్వు అంత బాగా చూసుకుంటాను అని ఎలా చెప్పగలుగుతున్నావు అని ప్రశ్నిస్తుంది సత్య. ఆదిత్య చెప్పిన ఈ సమాధానంతో సత్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..