Love Story: ఫిదా సినిమా తర్వాత శేఖర్ కమ్ముల “లవ్ స్టోరీ” సినిమాను తెరకెక్కించారు. మూడేళ్ల క్రితం ఫిదా సినిమా ఎంతటి విజయాన్ని అందించినదో అందరికీ తెలిసినదే. ఆ సినిమా తర్వాత లవ్ స్టోరీ ద్వారా శేఖర్ కమ్ముల మరోసారి ప్రేక్షకులను సందడి చేయనున్నారు. సాధారణంగా శేఖర్ కమ్ముల సినిమాలంటే అందరికీ మంచి అవగాహన ఉంటుంది.ఎలాంటి కథనైనా ఎంతో సున్నితంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించడం ఒక్క శేఖర్ కమ్ములకు మాత్రమే సాధ్యమవుతుంది. ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమా కూడా ఇదే తరహాలోనే ఉండబోతోందని తెలుస్తోంది.
నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా విడుదల కాకుండానే దాదాపు 40 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఈ సినిమా నుంచి విడుదలైన సారంగదరియా పాట ప్రస్తుతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఫిదా సినిమా తర్వాత శేఖర్ కమ్ముల సినిమాల బిజినెస్ రేంజ్ కూడా పెరిగిపోయింది.తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎక్కువ భాగం నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంది. అదే విధంగా ఈ సినిమాకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.
నాగచైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ:
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా లో రాజీవ్ కనకాల, దేవయాని, ఈశ్వరీ రావు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో ముఖ్యంగా అమ్మాయిలు యవ్వనదశలో ఎదుర్కొనే సమస్యల గురించి దర్శకుడు తెలియజేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఏ దర్శకుడు కూడా చూపించని విధంగా శేఖర్ కమ్ముల అమ్మాయిల సమస్యలను ఈ సినిమా ద్వారా తెలియజేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఇలాంటి సమస్యలను కేవలం యాడ్స్ రూపంలో చూపించడమే కానీ ఎవరూ కూడా అడ్రస్ చేయలేదు. కానీ శేఖర్ కమ్ముల మాత్రం ఇదే కథాంశంతోనే సినిమాను తెరకెక్కించారని తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా శేఖర్ కమ్ముల మరొక విజయాన్ని అందుకుంటారని టాలీవుడ్ భావిస్తోంది.అయితే ఈ సినిమా ద్వారా శేఖర్ కమ్ముల విజయాన్ని అందుకుంటారో లేదో తెలియాలంటే ఏప్రిల్ 16 వరకు వేచి చూడాల్సిందే.