హీరో విశాల్ అందరికీ సుపరిచితుడే. తమిళ నడిగర్ సంఘం అధ్యక్షుడిగా విశాల్ చేసే పనులు సమాజంలో ఎంతో మందికి స్ఫూర్తినిచ్చాయి. వైవిధ్యమైన నటనతో పాటు.. అదరగొట్టే ఫిజిక్ తో… ఎన్నో విజయవంతమైన సినిమాలు చేయడం జరిగింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ఉన్న విశాల్ తాజాగా తన కొత్త సినిమా “లాఠీ” టీజర్ వేడుకలో గొప్ప పని చేశారు. ఐదు ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన పిల్లలకు.. వారి విద్యకు సంబంధించి ఖర్చులు తానే భరిస్తూ… చెక్కులు అందజేశారు. సినిమా టీజర్ కార్యక్రమంలో వినూత్నంగా విశాల్ చేసిన ఈ మంచి పని తమిళ సినిమా రంగంలో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పుడే కాదు చాలా సందర్భాలలో విశాల్ తన మంచి మనసు చాటుకుంటూ.. చాలామందికి సహాయం చేయడం జరిగింది. గతంలో కన్నడ స్టార్ హీరో పునీత్ చనిపోయిన సమయంలో కూడా అతడు అనాధలకు అందజేసే సహాయానికి సంబంధించి… బాధ్యతను విశాల్ తీసుకోవడం జరిగింది. అంతేకాదు తన కొత్త ఇంటిని నిర్మించుకోవడం కోసం దాచుకున్న డబ్బులు సైతం అప్పట్లో.. విశాల్ దానం చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు తన కొత్త సినిమా “లాఠీ” టీజర్ కార్యక్రమం సందర్భంగా పాఠశాలల విద్యార్థులకు సంబంధించి ఫీజు తానే కట్టడం సంచలనంగా మారింది.
విశాల్ చేసిన ఈ మంచి పనికి అభిమానులు ఫుల్ సంతోషంగా ఉన్నారు. “లాఠీ” సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. “లాఠీ” సినిమాలో విశాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో.. విశాల్ కాలికి బలమైన గాయం తగిలింది. అయినా గాని.. ఎక్కడ గ్యాప్ తీసుకోకుండా.. షూటింగ్ లో జాయిన్ అయ్యారు. “సెల్యూట్” సినిమా తర్వాత విశాల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో “లాఠీ” లో నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.