Hit Films: గత ఏడాది సంక్రాంతికి విడుదలైన “అలా వైకుంఠపురం”,”సరిలేరు నీకెవ్వరు”వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబట్టాయి. ఈ సినిమాల తర్వాత కరోనా మహమ్మారి విజృంభించడంతో అన్ని రంగాలతో పాటు సినిమారంగం పై కూడా కోలుకోలేని దెబ్బ కొట్టింది అని చెప్పవచ్చు. అప్పటి నుంచి సినిమాల చిత్రీకరణ జరగక థియేటర్లు మూత పడటంతో చిత్ర పరిశ్రమ మొత్తం అతలాకుతలం అయింది. ఎట్టకేలకు లాక్ డౌన్ అనంతరం షూటింగ్ తీసుకున్నప్పటికీ కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల కాకుండా ఓటీటీ లో విడుదలయ్యాయి.
లాక్ డౌన్ అనంతరం థియేటర్లు ఓపెన్ చేయగా సినిమా చూడటానికి జనాలు థియేటర్లకు వస్తారా అనే అనుమానం ఉండటంతో పలు సినిమాలు థియేటర్లో విడుదలకు నోచుకోలేదు. అయితే డిసెంబర్ లో సాయి ధరమ్ తేజ్ నటించిన “సోలో బ్రతుకే సో బెటర్”సినిమా ఏ థియేటర్లో విడుదలైంది.ఈ సినిమాకు వచ్చిన ఆదరణ చూసి మరి కొంతమంది దర్శక నిర్మాతలు సినిమాలు థియేటర్లో విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే 2021 జనవరిలో పలు సినిమాలు థియేటర్లలో విడుదల అయి ప్రేక్షకులను సందడి చేశాయి. ఈ విధంగా జనవరి నుంచి మార్చి వరకు దాదాపు 60 సినిమాలకి పైగా విడుదల అయ్యాయి. వాటిలో బాక్సాఫీస్ దగ్గర సందడి చేసిన సినిమా లిఫ్ట్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
హిట్స్ అండ్ బ్లాక్ బాస్టర్:
1) క్రాక్: రవితేజ శృతి హాసన్ జంటగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీసు వద్ద 40 కోట్ల వసూళ్లు రాబట్టింది.
2) మాస్టర్: తమిళ్ హీరో విజయ్ తళపతి హీరోగా, విజయ్ సేతుపతి విలన్ గా నటించిన ఈ సినిమా తమిళ రీమేక్ సినిమా అయినప్పటికీ తెలుగులో మంచి విజయం సాధించింది. ఈ సినిమా 14 కోట్ల షేర్ ను రాబట్టింది.
3) రెడ్: రామ్ – కిషోర్ తిరుమల కాంబినేషన్లో తెరకెక్కిన రెడ్ సినిమా కూడా థియేటర్లలో మంచి స్పందన లభించింది. ఈ సినిమా 19 కోట్ల షేర్ ను రాబట్టింది.
4) 30 రోజుల్లో ప్రేమించడం ఎలా:
యాంకర్ ప్రదీప్ మొదటిసారిగా హీరోగా నటించిన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొంది ఫుల్ రన్లో ఈ చిత్రం 7 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది.
5) జాంబీ రెడ్డి:
ప్రశాంత్ వర్మ రూపొందించిన ‘జాంబీ రెడ్డి’ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఫుల్ రన్లో ఈ చిత్రం 6కోట్ల పైనే షేర్ ను రాబట్టింది.
6) నాంది:
ఎన్నో సంవత్సరాలుగా ఒక్క విజయం కూడా లేకుండా సతమతమవుతున్న అల్లరి నరేష్ కి నాంది సినిమా మంచి విజయాన్ని అందించినదని చెప్పవచ్చు.ఫుల్ రన్లో ఈ చిత్రం 5కోట్ల పైనే షేర్ ను కలెక్ట్ చేసింది.
7) ఉప్పెన:
మెగా మేనల్లుడు హీరోగా నటించిన ఉప్పెన సినిమా ఫిబ్రవరి 12న విడుదలై బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది.ఫుల్ రన్లో ఏకంగా 51 కోట్ల షేర్ ను రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
8) జాతి రత్నాలు:
నవీన్ పోలిశెట్టి,రాహుల్ రామకృష్ణ,ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అనుదీప్ దర్శకత్వం వహించారు.ఇప్పటి వరకూ ఈ చిత్రం 37కోట్ల పైనే షేర్ ను రాబట్టి.. ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.