ఇటీవల బాలీవుడ్ నటుడు సుశాంత్ సూసైడ్ కేసు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం పై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూనే మరోపక్క బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ వస్తుంది కంగనారనౌత్. ఇదిలా ఉండగా మరో పక్క తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో కూడా జయలలిత పాత్రలో కంగనా రనౌత్ పోషిస్తుంది. “తలైవి” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎంజీఆర్ పాత్రలో అరవిందస్వామి నటిస్తున్నారు.
గత ఏడాది నవంబర్ సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి సినిమా పై ఇంట్రెస్ట్ పెంచారు సినిమా యూనిట్. కాగా మధ్యలో కరోనా వైరస్ రావడంతో సినిమా షూటింగ్ లు ఆగిపోవటంతో ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటీవల వాయిదా పడిన షూటింగ్ మళ్లీ ప్రారంభం కావడం జరిగింది. రనౌత్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
“విప్లవాత్మకమైన నాయకురాలి సినిమా మరో షెడ్యూల్ పూర్తి చేశాం. కరోనా తర్వాత చాలా విషయాల్లో మార్పులు వచ్చాయి కానీ యాక్షన్కు, కట్ కు మధ్య చేసే నటన మాత్రం మారలేదు. తలైవి చిత్ర బృందానికి కృతజ్ఞతలు” అని పేర్కొంది. ఈ తరుణంలో జయలలిత అసెంబ్లీ సమావేశాలకి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు సినిమా యూనిట్ . ఈ తరుణంలో షూటింగ్ స్పాట్ లో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది కంగనారనౌత్