Ram Charan Tej: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో “గేమ్ చేంజర్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపిస్తూ ఉన్నారు. రాజకీయ నేతగా ఫస్ట్ టైం నటిస్తున్నారు. చరణ్ కెరియర్ లో ఇది 15వ సినిమా. దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో భారీ బడ్జెట్ తో షూటింగ్ జరుపుకుంటుంది. కీయరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ మొన్నటిదాకా శరవేగంగా సాగింది. అయితే “ఇండియన్ 2” షూటింగ్ సడన్ గా స్టార్ట్ కావడంతో దాన్ని కంప్లీట్ చేసే పనిలో ప్రస్తుతం శంకర్ నిమగ్నమయ్యారు.
దీంతో ఇప్పుడు “గేమ్ చేంజర్” సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఈ బ్రేక్ లో ఇప్పుడు.. గర్భవతిగా ఉన్న భార్య ఉపాసనతో వెకేషన్ కార్యక్రమాలలో చరణ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. మొన్నటిదాకా “RRR” సినిమాకి సంబంధించి అంతర్జాతీయ అవార్డుల కార్యక్రమాలలో ముఖ్యంగా అమెరికాలో ఆస్కార్ అవార్డుల వేడుకల ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే శంకర్ సినిమా తర్వాత బుచ్చిబాబుతో చరణ్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా… జాన్వి కపూర్ నీ కన్ఫామ్ చేసినట్లు లేటెస్ట్ వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.
దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం జాన్వి కపూర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. దక్షిణాదిలో ఇదే ఫస్ట్ సినిమా. ఇదిలా ఉంటే గతంలో చిరంజీవి శ్రీదేవి నటించిన “జగదేకవీరుడు అతిలోకసుందరి” సినిమానీ రీమిక్ చేయాలని దానిలో చరణ్.. జాన్వి కపూర్ హీరోయిన్ గా పెట్టీ తీయాలని అభిమానుల నుండి ఒత్తిడి వచ్చింది. కానీ నిర్మాత అశ్విని దత్ అటువంటి ప్రయోగాలు చేయడం లేదు అని స్పష్టం చేశారు. ఈ క్రమంలో బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ చేయబోయే సినిమాలో.. జాన్వి కపూర్ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయినట్లు ఇప్పుడు వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.