Ramesh babu death: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు అన్న, ప్రముఖ నటుడు ఘట్టమనేని రమేష్ బాబు కన్నుమూసిన సంగతి తెలిసిందే. లివర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హఠాహుఠిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే రమేష్ బాబు మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు.
రమేష్ బాబు మరణం వార్త కుటుంబ సభ్యులనే కాదు టాలీవుడ్ సినీ ప్రముఖులనూ విషాదంలోకి నెట్టేసింది. మరోవైపు మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ సైతం బావగారు చనిపోయారని తెలిసి తీవ్ర దుఃఖంలో మునిగిపోయిందట. పైగా మహేష్ బాబుకు కరోనా సోకి ఐసోలేషన్లో ఉన్నాడు. దీంతో రమేష్ బాబు కడసారి చూపుకు కూడా మహేష్ బాబు నోచుకోకపోవడంతో.. నమ్రతా మరింత అవేదనకు గురైందట.
ఇక నేటి సాయంత్రం జూబ్లీ హిల్స్లోని మహాప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అంత్యక్రియల్లో మహేష్ లేని లోటును తీర్చేందుకు ప్రయత్నించిన నమ్రత.. రమేష్ బాబు భార్య, పిల్లల్ని ఓదార్చుతూనే మరోవైపు మహేష్కి వీడియో కాల్ చేస్తూ ఆయన బాధను తగ్గించాలని చూసిందట. కాగా, మహేష్ బాబు అత్యంత ఇష్టపడే వ్యక్తుల్లో రమేష్ బాబు ముందు వరసలో ఉంటారు. అలాగే మహేష్, రమేష్ ఫ్యామిలీలు ఎంతో సన్నిహిత్యంగా ఉంటాయి. దీంతో ఇప్పుడు రమేష్ మరణం ఇరువురి కుటుంబాల్లోనూ విషాద ఛాయలను నింపాయి.