Radhe shyam: ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్తో ప్రభాస్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7న 14 భాషలలో రిలీజ్ కావాల్సిన ఆర్ఆర్ఆర్ ఒమిక్రాన్ వైరల్ వ్యాప్తి వల్ల తప్పని పరిస్థితుల్లో వాయిదా వేస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించి షాకిచ్చారు. ఇది అటు మెగా అభిమానులకు, ఇటు నందమూరి అభిమానులను తీవ్రంగా నిరాశపరచింది. మళ్ళీ ఎప్పుడు ఆర్ఆర్ఆర్ రిలీజ్ అనే విషయంలో ఇప్పటికే ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. కానీ, ఇప్పట్లో మళ్ళీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకశాలు కనిపించడం లేదు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ కోసం చాలా సినిమాలు పదే పదే రీ షెడ్యూల్ చేసుకున్నాయి.
ఇక ఆ అవకాశం మరోసారి ఎవరు ఇచ్చేలా కూడా కనిపించడం లేదు. అందుకే ఆ రిస్క్ రాధే శ్యామ్ నిర్మాతలు తీసుకోవడం లేదు. అందుకే ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రాధే శ్యామ్ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్ట్ పోన్ చేసే అవకాశాలు లేవని కుండబద్దలు కొట్టినట్టు అధికారికంగా ప్రకటించి తేల్చి చెప్పారు. ఈ సినిమా కూడా కరోనా వేవ్స్ వల్ల చాలా ఆలస్యంగా రిలీజవుతోంది. ఇప్పటికే మూడుసార్లు రిలీజ్ తేదీని రీ షెడ్యూల్ చేయాల్సి వచ్చింది. అందుకే ఈ సారి అధికారికంగా ప్రకటించిన జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ క్లన్ఫర్మ్ చేశారు.
Radhe shyam: పదేళ్ళ తర్వాత పీరియాడికల్ రొమాంటిక్ సినిమా
పాన్ ఇండియన్ సినిమాగా రాధే శ్యామ్ తెరకెక్కించాడు దర్శకుడు రాధాకృష్ణ. పూజా హెగ్డేకు ఇది ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా. రెబల్ స్టార్ కృష్ణం రాజు, బాలీవుడ్ నటి భాగ్యశ్రీ ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్నారు. బాలీవుడ్, కోలీవుడ్ సంగీత దర్శకులు ఈ సినిమాకు పాటలు అందిస్తున్నారు. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక పదేళ్ళ తర్వాత పీరియాడికల్ రొమాంటిక్ సినిమాలో నటించాడు ప్రభాస్. ఇందులో పామిస్ట్గా కనిపించబోతుండటం విశేషం. సాహో సినిమా ఒక్క బాలీవుడ్లో తప్ప మిగతా అన్నీ భాషలలో నిరాశపరచింది. మరి రాధే శ్యామ్ ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.