Pushpa 2: గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన “పుష్ప” ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సృష్టించిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా వచ్చిన ఈ సినిమా విడుదలైన ప్రతి చోటా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి రికార్డ్ ల మీద రికార్డ్ లు క్రియేట్ చేసింది. కనీసం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ఇంటర్వ్యూ ప్రమోషన్ కార్యక్రమం చేయకపోయినా గాని “పుష్ప” వంద కోట్లకు పైగా కలెక్షన్ లు సాధించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీలలో ఎంత క్రికెటర్ లు చాలామంది అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు. అల్లు అర్జున్ మేనరిజం అదేవిధంగా డైలాగులు ఇప్పటికీ కూడా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. దీంతో “పుష్ప 2” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే నెల నుండి ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇటువంటి తరుణంలో హీరోయిన్ రష్మిక మందన పై ఓ సరికొత్త వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
“పుష్ప 2″లో రష్మిక మందన ఫస్టాఫ్ లో చనిపోతుందని ఆమె క్యారెక్టర్ పెద్దగా ఉండదని ఓ న్యూస్ గత కొన్ని రోజుల నుండి వినిపిస్తోంది. ఈ క్రమంలో వస్తున్న వార్తపై నిర్మాత రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు. “పుష్ప 2″లో రష్మిక మందన డైరెక్టర్ పెద్దగా ఉండదని ఆమె చనిపోతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలియజేశారు. దీంతో రష్మిక మందన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఫస్ట్ పార్ట్ భారీ ఎత్తున హిట్ కావడంతో… సెకండ్ పార్ట్ ఈ విషయంలో డైరెక్టర్ సుకుమార్ చాలా శ్రద్ధ తీసుకున్నట్లు టాక్. చాలా త్వరగా కంప్లీట్ చేసి ఈసారి ఎక్కువ టైం ప్రమోషన్ కార్యక్రమాలకు కేటాయించాలని అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం
Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!