బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయిన డార్లింగ్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. రాధే శ్యామ్ షూటింగ్తో బిజీగా ఉన్న ప్రభాస్ ఆదిపురుష్, ఆ తరువాత సలార్ మూవీలో నటించనున్నాడు. సలార్ మూవీకి KGF మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ అభిమానులకు ఈరోజు ఓ బంపర్ ఇచ్చాడు. తాను తీయబోయే సినిమాలో ప్రభాస్ చాల వైలెంట్గా కనిపిస్తాడని అతనితో పాటు సినిమాలో నటించే అవకాశం అతని అభినులకు కల్పిస్తున్నానని, ఇలాంటి మంచి సమయాన్ని ఉపయోగించుకోవాలని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.
KGF సినిమాతో ప్రముఖ హీరోల అందరి దృష్టి తన వైపు మళ్ళించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం KGF 2 చిత్రికరణలో బిజీగా ఉన్న డైరెక్టర్.. సలార్ మూవీలో నటించడానికి అన్ని కేటగిరీలకు సంబందించిన ఆడిషన్స్ ఈనెల 15వ తేదీన ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్లోని శేరిలింగంపల్లిలో చేస్తున్నామన్నారు. హైదరాబాద్ తోపాటు బెంగుళూరు చెన్నెలలో కూడా త్వరలోనే ఆడిషన్స్ చేస్తమని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు.
రాధే శ్యామ్ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. KGF 2 చిత్ర షూటింగ్ కూడా చివరి దశకు చేరుకోవడంతో, తదుపరి సాలార్ చిత్రం 2021 జనవరిలో పట్టాలెక్కనుందని ఫిలిం నగర్ టాక్. తన సినిమాలో హీరోలను అద్భుతంగా చూపించడం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నైజం అలాంటిది ప్రభాస్ చాల వైలెంట్గా కనిపిస్తాడనే డైరెక్టర్ మాటలతో సినిమాపై ఫాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. సాహో సినిమాలో శ్రద్దా కపూర్ తెలుగు తెరకు పరిచయమైనా ఆ సినిమాను ఆంతగా అభిమానులు ఆదరించకపోవడంతో ఆమెకు ఆశించినంత పేరు రాలేదు. ఈ సినిమాలో ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకొని అవకాశం ఎవరికి వస్తుందనో ఉత్తరాది దక్షిణాది తారలు ఆతురతగా ఎదురుచూస్తున్నారు.