SRK+ : మహమ్మారి కరోనా వైరస్ కారణంగా బయట పరిస్థితులు మొత్తం మారిపోయిన్న సంగతి తెలిసిందే. వైరస్ కారణంగా… అనేక రంగాలు తీవ్ర నష్టం లోకి వెళ్లిపోయాయి. వీటిలో సినిమారంగం కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కరోనా కారణం ప్రభుత్వాలు ఆంక్షలు విధించే క్రమంలో సినిమా ధియేటర్ లని.. మూసివేయడం మనం చూశాం. మనదేశంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇటువంటి తరుణంలో ఓటిటి రంగం బాగా పుంజుకుంది. చాలా సినిమాలు ధియేటర్ లో కంటే ఓటిటి లోనే విడుదల కావటం మనం చూసాం. పెద్ద పెద్ద హీరోల సినిమాలు కూడా ఇప్పుడు ఓటిటి లోనే రీలిజ్ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు.
ఇటువంటి తరుణంలో ఎప్పుడు ఏ క్షణాన కరోనా వైరస్ వస్తుంది అనేది అర్థం కాని పరిస్థితి. దీంతో ఇప్పుడు దేశంలో ఏ స్టార్ హీరో ఆలోచించని విధంగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నడు. విషయంలోకి వెళితే షారుక్ ఖాన్ సొంతంగా ఓటిటి పెట్టడానికి రెడీ అయిపోయారు. SRK + టైటిల్ తో… కొత్త ఓటిటి సంస్థని తీసుకొస్తున్నట్లు లోగో కూడా విడుదల చేసి సోషల్ మీడియాలో అందరికీ షాక్ ఇచ్చారు. ఈ ఓటిటీ ప్లాట్ ఫాం గురించి మరింతగా త్వరలో అన్ని విషయాలు షారుక్ చెప్పనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే చైనాలో ఇప్పుడు మళ్ళీ కరోనా వైరస్ విజృంభిస్తుంది. చైనాలో కొన్ని ప్రాంతాలలో వైరస్ కేసులు భారీగా పెరగటంతో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయ్యి ప్రజలను ఇళ్లకే పరిమితం చేయడంతో పాటు లాక్ డౌన్ విధించడం జరిగింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లో అయినా వైరస్ మళ్లీ తిరగబడే అవకాశం ఉండటంతో… ప్రభుత్వాలు మళ్లీ ఆంక్షలు పెట్టే పరిస్థితులు భవిష్యత్తులో ఉండటంతో షారుక్ తాజాగా ఓటీటీ ప్లాట్ ఫామ్ సొంతంగా తెచ్చుకోవటం.. నిజంగా గ్రేట్ ఐడియా అని తాజా వార్త పై చాలా మంది స్పందిస్తున్నారు.