Sukumar: పుష్ప: ది రైజ్ పార్ట్ 1 రిలీజైయ్యాక ఒకవైపు రాం చరణ్ ఫ్యాన్స్, ఒకవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మా హీరో సినిమా గొప్ప అంటే మా హీరో సినిమా గొప్ప అని చెప్పుకుంటున్నారు. ఈ రెండు తీసిన దర్శకుడు సుకుమార్ మాత్రం ఇద్దరి అభిమానుల కామెంట్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల వచ్చిన పుష్ప పార్ట్ 1 తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. హిందీలో ఇప్పటి వరకు దాదాపు 80 కోట్లు రాబట్టినట్టు వార్తలు వచ్చాయి.
ఇక మిగతా నాలుగు సౌత్ భాషల్లో మాత్రమే పుష్ప పార్ట్-1 ను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. నెలలోపే ఈ సినిమా ఓటీటీకి రావడం ఆశ్చర్యకరం.
ఇక పుష్ప సినిమాకు అన్నీ భాషలలోని పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సోషల్ మీడియాలో రాం చరణ్ అభిమానులు ఆసక్తికరమైన చర్చలు జరుపుతున్నారు. సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ ఇప్పుడు అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాలను కంపేర్ చేస్తూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. సుకుమార్ కెరీర్ లో ది బెస్ట్ సినిమా ఇదే అని.. చరణ్ ఫ్యాన్స్ – అల్లు అర్ అర్జున్ ఫ్యాన్స్ వాదించుకుంటున్నారట. చెవిటి వాడు చిట్టిబాబు పాత్రలో చాలా కష్టమైన పాత్రలో చరణ్ మెప్పించారని తన ఫ్యాన్స్.. రక రకాల వేరియేషన్స్ ఉన్న పుష్పరాజ్ లాంటి మాస్ పాత్రలో అల్లు అర్జున్ మెప్పించారని అంటున్నారు.
Sukumar: అది రంగస్థలం సీక్వెలా కాదా ఇప్పుడే చెప్పను.
అయితే ఎవరి పాత్రల్లో వారు అద్భుతంగా నటించారని దర్శకుడు సుకుమార్ చెప్పారు. అంతేకాదు ఇద్దరికిద్దరూ బెస్ట్ పర్ఫార్మెన్సర్స్ అని ఇందులో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని ఎవరి అభిమానులు అభిప్రాయపడటం సరికాదని చెప్పుకొచ్చారు. అంతేకాదు అల్లు అర్జున్తో పుష్ప చిత్రాన్ని రెండు భాగాలుగా తీస్తున్నాను. ఆ తర్వాత చరణ్తో మరోసారి సినిమా చేస్తాను. అది రంగస్థలం సీక్వెలా కాదా ఇప్పుడే చెప్పను. కానీ అంతకు మించి ఉంటుంది అని మాత్రం చెప్పగలను అంటూ అభిమానుల కోల్డ్ వార్కు చెక్
పెట్టారు సుకుమార్. కాగా, పుష్ప పార్ట్ 2 వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు రాబోతోంది.