Sukumar: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకులలో ఒకరు డైరెక్టర్ సుకుమార్. ప్రస్తుతం “పుష్ప” సెకండ్ పార్ట్ తెరకెక్కించటానికి రెడీ అవుతున్నారు. ఆగస్టు నుండి “పుష్ప” సెకండ్ పార్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. కెరీర్ పరంగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మొదటి పాన్ ఇండియా సినిమా “పుష్ప”. మొదటి భాగం పుష్ప దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో అదిరిపోయే విజయాన్ని సాధించింది. ఐకాన్ స్టార్ బన్నీకి హీరోయిన్ రష్మిక మందన కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. దీంతో ఇప్పుడు “పుష్ప” సెకండ్ పార్ట్ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీనిలో భాగంగా మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగానికి సంబంధించి స్టోరీ విషయంలో సుకుమార్ అనేక మార్పులు చేర్పులు చేశారు అని టాక్. పరిస్థితి ఇలా ఉంటే “కేజిఎఫ్” తరహాలో డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ వేసినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది. మేటర్ లోకి వెళ్తే కన్నడ ఇండస్ట్రీ లో తెరకెక్కిన “కేజిఎఫ్” మొదటి భాగం అనేక భాషల్లో డబ్ అయి సూపర్ డూపర్ హిట్ కావడం తెలిసిందే. దీంతో రెండో భాగం చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించి ఇటీవల విడుదల చేయగా మొదటి దాని కంటే రెండో భాగం భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ క్రమంలో రెండో భాగం చివరిలో “కేజిఎఫ్ 3” ఉండనున్నట్లు తెలియజేయడం జరిగింది.
ఇప్పుడు ఇదే తరహాలో “పుష్ప” సెకండ్ పార్ట్ మాత్రమే కాదు మూడో భాగం కూడా ఉండే రీతిలో సుకుమార్ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. “పుష్ప” రెండో భాగం బాగా విజయం సాధిస్తే మూడో పార్ట్ ఉండే రీతిలో సుకుమార్ స్టోరీ సిద్ధం చేసినట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే సెకండ్ పార్ట్ షూటింగ్ ఆగస్టు నెలలో ప్రారంభించి చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేసి.. ఈసారి పుష్ప ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున దేశవ్యాప్తంగా చేయాలని.. సినిమా యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.