RRR: “ఆర్ఆర్ఆర్” రిలీజ్ ఉన్న కొద్ది దగ్గరపడుతుండటంతో అభిమానులు ఉత్కంఠభరితంగా ఉన్నారు. పైగా “బాహుబలి” తర్వాత రాజమౌళి దర్శకత్వంలో “ఆర్ఆర్ఆర్” వస్తూ ఉండటంతో దేశ విదేశాలలో ఈ సినిమా కోసం సినీ ప్రేమికులు ఎంతగానో ఇంట్రెస్ట్ గా చూడటానికి రెడీగా ఉన్నారు. అయితే ఈ సినిమా జనవరి 7వ తారీకు రిలీజ్ చేయాలని అప్పట్లో అంతా రెడీ అవగా.. మహమ్మారి కరోనా వైరస్ కేసులు పెరగటంతో .. సినిమా ఈనెల 25 కి వాయిదా పడటం తెలిసిందే.
కానీ జనవరిలో రిలీజ్ అవుతుందని అప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు భారీ ఎత్తున నిర్మాతలు ఖర్చు పెట్టారు. కాగా ఇప్పుడు “ఆర్ఆర్ఆర్” మరికొద్ది రోజుల్లో విడుదల అవుతున్న తరుణంలో ప్రస్తుతం సినిమా యూనిట్… భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. పాన్ ఇండియా మూవీ కావటంతో దేశంలో చాలా రాష్ట్రాల్లో విడుదల అవుతున్న తరుణంలో.. రాజమౌళి మరియు హీరోలు చరణ్, తారక్ లతో పాటు హీరోయిన్ అలియా భట్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పాల్గొనడం జరిగింది. అదేవిధంగా నిర్మాత డి.వి.వి.దానయ్య కూడా పాల్గొంటూ వస్తున్నారు.
ఇటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలలో సినిమా స్టోరీ రచయిత విజయేంద్రప్రసాద్ కనబడకపోవడం చర్చనీయాంశంగా మారింది. సినిమాకి సంబంధించి ఇప్పటివరకు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లలో ఎక్కడా కూడా విజయేంద్రప్రసాద్ కనపడక పోవటం పట్ల సోషల్ మీడియాలో భారీ ఎత్తున డిస్కషన్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన బ్యాక్ టు బ్యాక్ స్క్రిప్ట్ లు రాసే రైటర్ కావడంతో.. బిజీగా ఉంటారని కొంతమంది అంటున్నారు. మరి కొంతమంది వయసు పరంగా పెద్ద వారు కావడంతో… కరోనా దృష్టిలో పెట్టుకుని … భారీ కార్యక్రమల వేడుకలకు… ఆయన దూరం అయి ఉండొచ్చని మరి కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా “ఆర్ఆర్ఆర్” స్టోరీ రైటర్ విజయేంద్రప్రసాద్ ప్రమోషన్ కార్యక్రమాల్లో కనబడకపోవడం చర్చనీయాంశంగా మారింది.