God : ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితము వస్తుంది అనేది తెలుసుకుందాం.
1.ఇంట్లో ఎంత చేస్తే అంత ఫలితందక్కుతుంది. అదే నది ప్రాంతంలో జపం చేస్తే రెట్టింపు ఫలితం,
గోశాలలో చేస్తే వంద రెట్లు ఫలం , యాగశాలలో అంతకు మించిన ఫలితం కలుగుతుంది. పుణ్య ప్రదేశాల్లో లేదా దేవాతా సన్నిదిలో చేస్తే పదివేల రెట్లు ఫలితం కలుగుతుంది. శివసన్నిదిలో జపం చేస్తే మహోన్నతమైన ఫలం దక్కుతుంది. పులి తోలు మీద కుర్చుని జపిస్తే మోక్షం ప్రాప్తిస్తుంది. కానీ వెదురు తడక మీద కుర్చుని జపం చేస్తే మాత్రం దరిద్రం పట్టుకుంటుంది.
అదే విధం గా రాతి మీద కుర్చుని జపిస్తే రోగాలు, నేల మీద కూర్చొని చేస్తే దుఃఖము , గడ్డి మీద కూర్చుని చేస్తే కీర్తి నాశనం వంటివి జరుగుతాయి.
2.అసలు పూజగది తూర్పు ముఖంలో ఉండాలని అనడానికి గల కారణం తెలుసుకుందాం.
తూర్పు దిక్కుకి అధిపతి ఇంద్రుడు, ఉత్తర దిక్కుకి అధిపతి కుబేరుడు. కాబట్టి పూజగది తూర్పుముఖంగా కాని, ఉత్తరముఖం గా కాని ఉండాలని అంటారు. దక్షిణ దిక్కుకి అధిపతి యముడు కాబట్టి దక్షిణ ముఖం గా ఉండకూడదని మన పెద్దలు అంటుంటారు.
3. వినాయకుడి విగ్రము కు తొండం:ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రము కు తొండం ఎడమ వైపుకు తిరిగి ఉండాలి, స్కూల్స్ , ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లో ఉండే విగ్రహం కి మాత్రం తొండం కుడి వైపుకు తిరిగి ఉండాలి.. అదే విధం గా వ్యాపారం చేసే ప్రదేశం లో నిల్చున్న వినాయకుడ్ని పెట్టుకోవాలి.
4.అలాగే ఇంట్లో ఎక్కడా కూడా లక్ష్మీ దేవి నిల్చుని ఉన్నట్టుగా ఉండకూడదు. లక్ష్మీ దేవి పచ్చరంగు చీరతొ అటూఇటూ ఏనుగులు ఉన్న ఫొటో కి గృహస్థులు పూజ చేయడం అనేది చాలా మంచిది అని చెప్పాబడింది.
పూజ లో దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ పూర్తి అయిన వెంటనే ప్రసాదంగా తీసుకోవాలి. మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం అనేది ప్రసాదం రూపంలో మీకు దక్కుతుంది.