మీడియా అనేది ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తుందన్నది గతంలో నానుడి. కానీ ఇప్పుడు…. ఏ సమాచారాన్ని అయినా తమకు తగ్గట్టుగా మార్చేసి ప్రజలకు వారికి నచ్చిన రీతిలో తెలియజేసే ఒక అబద్ధపు మాధ్యమం. ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో ఒక బిహారీ మౌల్వీ చిన్న పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వారిలో ఒక అమ్మాయి తన తల్లిదండ్రులకు విషయం చెబితే వారు నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అతనిని అరెస్టు చేశారు. అక్కడితో కథ అయిపోయింది అంతా అనుకుంటారు.
అయితే ఇదే విషయం పై మరింత క్లారిటీ కోసం తల్లిదండ్రుల వద్ద వివరాలు తెలుసుకోవడానికి వెళ్ళిన స్థానికుల పైన మరియు విలేకరులపైనా అక్కడివారు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో ఎక్కడలేని ద్వేషంతో ఒక వర్గం వారిని వార్తల్లో ఘోరంగా చూపిస్తున్నారు. రోగాన్ని మోసుకొచ్చిన తబ్లిగీలను వీళ్ళు మసీదులో దాచి పెడతారు. కావాలని అందరికీ రోగాన్ని అంటించి సమాజాన్ని రోగగ్రస్తం చేస్తారు. మీకు వ్యాధి నయం చేస్తాం టెస్ట్ చేయించుకోండి అంటే వాళ్ళ పైన రాళ్ళ దాడి చేస్తారా…? అంటూ వారందరినీ దోషులను వెనకేసుకుని వచ్చేవారిలా చూపిస్తున్నారు.
అసలు మీడియా వారు తెలుసుకోవాల్సిన అంశం చిన్న పిల్లలపై లైంగిక దాడి గురించి. అది ఎంత సున్నితమైనదో మన మీడియా ప్రతినిధులకు తెలియనిది కాదు. అసలు అలాంటి సంఘటనలు జరిగినప్పుడు స్థానికులే దేహశుద్ధి చేసి దోషులను అక్కడి నుండి తరిమేస్తారు. ఇక ఒక వేళ కేసు పెడితే కేసు వివరాలను పోలీసులు విలేకరులకు కూడా అందివ్వరు. వారు దర్యాప్తు చేసి ఏదైనా ముఖ్యమైన ఆధారాలు కోసమే బాధితుల తల్లిదండ్రులను సంప్రదిస్తారు. ఎందుకంటే సాక్ష్యం కోసం వెళ్లినప్పుడు స్థానికంగా…. కుటుంబాలకు సంబంధించిన పరువు విషయం అని పోలీసులు ఈ విషయాన్ని సున్నితంగా డీల్ చేస్తూ ఉంటే…. అసలు ఈ మీడియా వారు ఏం తెలుసుకోవడానికి అక్కడికి పరుగులు పెట్టినట్లు?
సున్నితమైన విషయాన్ని కూడా తమదైన శైలిలో ప్రసారం చేసి అంశాన్ని ప్రక్క దోవ పట్టించి రచ్చరచ్చ చేస్తారని మీడియాపై ప్రతిచోటా స్థానికులు సందేహిస్తున్నారు. కేవలం వివరాల కోసమే వెళ్తుంటే స్థానికులు వాళ్ళ పై రాళ్ల దాడికి పాల్పడుతున్నారు అంటే వారి అరాచకం ఏ లెవల్లో ఉందో మరియు వారు ఎలాంటి క్రెడిబిలిటీని ప్రజల వద్ద సంపాదించారో అర్థం చేసుకోవచ్చు. సున్నితమైన విషయం అయినా విపరీత ధోరణితో చెప్పడంలో మీడియాదే ప్రధాన పాత్ర. ఇక్కడ స్థానికులు సరిగ్గానే స్పందించారు అనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో సమాజం యొక్క శ్రేయోభిలాషులు మీడియా వారు అన్న పేరుని వారు పూర్తిగా కోల్పోయారు అనేందుకు ఈ ఘటనే నిదర్శనం.
Vijayawada TDP: కేశినేని నాని Vs టీడీపీ కోవర్టులు ..! కృష్ణాజిల్లాలో టీడీపీ బ్లాస్టింగ్..!