Manamey Teaser: 2022లో ఒకే ఒక జీవితం మూవీతో డీసెంట్ హిట్ అందుకున్న శర్వానంద్.. 2023 లో వెండితెరపై అస్సలు కనిపించలేదు. సినిమాలకు స్మాల్ బ్రేక్ ఇచ్చి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. 2023 జూన్ 3న రక్షిత రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. పెళ్లై ఏడాది తిరక్క ముందే ఈ దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అలా పర్సనల్ లైఫ్ లో బిజీగా ఉన్న శర్వానంద్.. ఏడాది గ్యాప్ తర్వాత మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయ్యాడు. ప్రస్తుతం `మనమే` అంటూ డిఫరెంట్ టైటిల్ తో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీలో నటిస్తున్నాడు.
శర్వానంద్ కు 35వ చిత్రమిది. టాలెంటెడ్ యంగ్ ఫిల్మ్ మేకర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. విక్రమ్ ఆదిత్య అనే చైల్ట్ ఆర్టిస్ట్ కథలో కీలక పాత్రను పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ మనమే సినిమాను నిర్మిస్తుండగా.. మెలోడీ మెజీషియన్ హేశం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
మనమే షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అయితే తాజాగా చిత్రటీమ్ ఈ సినిమా టీజర్ ను బయటకు వచ్చారు. చాలా కలర్ ఫుల్గా మరియు ప్లజెంట్ గా ఉన్న మనమే టీజర్ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. లండన్ బ్యాక్డ్రాప్ లో టీజర్ మొదలవుతుంది. శర్వానంద్, కృతి శెట్టి, విక్రమ్ ఆదిత్య.. ఈ ముగ్గురి పాత్రలనే టీజర్ లో ప్రధానంగా చూపించారు. సినిమాలో హీరో చాలా మంచోడిగా కనిపిస్తాడు. కానీ మంచోడు కాదు. ఈ డైలాగ్ ను శర్వాతోనే టీజర్ లో చెప్పించారు.
హీరోయిన్ గా విషయానికి వస్తే.. ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి. తనకంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది. అటువంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ కలిగి హీరో, హీరోయిన్ల లైఫ్లో ఒక బిజ్జిబాబు వస్తాడు. ఈ బిజ్జిబాబు ఎవరు..? అసలు హీరో-హీరోయిన్లతో ఆ బాబుకు సంబంధం ఏంటి..? వారి జీవితాల్లోకి ఆ బాబు ఎలా వచ్చాడు..? ఎందుకు వచ్చాడు..? వంటి అనేక ప్రశ్నలకు తెర లేపుతూ టీజర్ ను కట్ చేశారు. ఫైనల్ గా టీజర్ అదిరిపోయింది. సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. సినిమాలో కృతి శెట్టి గ్లామరస్ గా కనిపించబోతోందని టీజర్ ద్వారా స్పష్టమైంది. అబ్దుల్ వాహబ్ ఇచ్చిన బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ సూపర్ కూల్గా ఉంది. విజువల్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి.
ప్రస్తుతం మనమే టీజర్ కు యూట్యూబ్ లో భారీ రెస్పాన్స్ వస్తోంది. టీజర్ చూసిన అభిమానులు, సినీ ప్రియులు శర్వానంద్ కు మరో హిట్ ఖాయమంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే విక్రమ్ ఆదిత్య పాత్ర మనమే మూవీలో కీలకంగా ఉండబోతోంది. కథ మొత్తం ఈ బుజ్జిబాబు చుట్టూనే తిరుగుతుందని అంటున్నారు. ఇంతకీ ఆ బాబు మరెవరో కాదు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తనయుడు. మనమే మూవీ ద్వారా విక్రమ్ ఆదిత్య చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!