ప్రభాస్ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించే న్యూస్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్లో `సలార్` ఒకటి. `కేజీఎఫ్` మూవీతో నేషనల్ వైడ్గా గుర్తింపు పొందిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంటే.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై హై బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో విజయ కిరాగందుర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా అప్డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులు ఎప్పటినుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
సలార్ అప్డేట్స్ కోసం ఇప్పటికే ఎన్నో సార్లు ప్రశాంత్ నీల్కు సోషల్ మీడియా వేదికగా రిక్వస్ట్లు కూడా పంపారు. అయితే ఎట్టకేలకు అభిమానుల రిక్వస్ట్లకు రిప్లై రాబోతోంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. మరో 2 రోజుల్లో అంటే స్వాతంత్ర దినోత్సవం నాడు `సలార్` నుండి బిగ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారట.
ఈ సినిమా టీజర్ను మే నెలలో రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ గతంలో వెల్లడించినా, కొన్ని కారణాల వల్ల అది కుదర్లేదు. అయితే ఇప్పుడు రాబోయే అప్డేట్ సలార్ టీజర్ గురించే అని కొందరు భావిస్తుంటే.. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరి సలార్ టీమ్ నుండి వచ్చే ఆ సర్ప్రైజ్ ఏంటో తెలియాలంటే ఇంకొంత సమయం వెయిట్ చేయాల్సిందే.