Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. విషయంలోకి వెళ్తే సీజన్ సెవెన్ ట్రోఫీ ఆదివారం ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో అన్నపూర్ణ స్టూడియో నుండి కంటెస్టెంట్స్ ఇంటికి వెళ్తున్న క్రమంలో.. పలువురు హౌస్ మేట్స్ మద్దతుదారులు ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం జరిగింది. ఈ సమయంలో పలువురి కార్లు కూడా ధ్వంసం కావడం జరిగింది. అయితే ఎక్కువగా పల్లవి ప్రశాంత్ మద్దతుదారులే దాడులకు పాల్పడ్డారని ప్రచారం జరిగింది. అయితే ఈ దాడులలో ఆర్టీసీ బస్సులు కూడా ధ్వంసం అయ్యాయి.
పరిస్థితి ఇలా ఉంటే జూబ్లీహిల్స్ పోలీసులు సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై సుమోటో గా కేసు బుక్ చేయడం జరిగింది. 147, 148, 290, 353, 427 రెడ్ విత్ ..149 సెక్షన్ల కింద కేసు FIR నమోదు చేయడం జరిగింది. అలాగే పలువురు అభిమానుల పైన కేసులు కూడా నమోదు చేసినట్లు సమాచారం. బిగ్ బాస్ షో తర్వాత ర్యాలీలో చాలా ఘటనలు జరిగాయి. గత సీజన్లలో ఎప్పుడు కూడా ఇలాంటి దాడులు జరగలేదు. సీజన్ సెవెన్ షో పరంగా అందరిని ఆకట్టుకున్న గాని.. బయట జరిగిన గొడవలు చెడ్డ పేరును తీసుకురావడం జరిగాయి. ఏకంగా టిఎస్ఆర్టిసి చైర్మన్ సజ్జనర్.. కూడా సీరియస్ అయ్యారు. ప్రజా రవాణా బస్సులపై దాడి అంటే ప్రజాస్వామ్యం పై దాడి చేసినట్టే అని మండిపడ్డారు. ఈ దాడిలో అమర్, గీతు రాయల్, అశ్విని కార్లు ధ్వంసం అయ్యాయి. బిగ్ బాస్ గేమ్ అందరూ గెలవడానికి ఆడినది.
ఇదే సమయంలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకోవడానికి అందరూ ఆసక్తిగా ఉంటారు. గేమ్ నీ గేమ్ లాగే చూడాలి.. కానీ ఈ రకంగా కార్లు పై దాడులు చేయటం అన్యాయం అంటూ అశ్విని.. తన కారు అద్దాలు పగలగొట్టిన వీడియోలో తెలియజేసింది. బిగ్ బాస్ హౌస్ లో రైతు బిడ్డగా కామన్ మ్యాన్ గా పల్లవి ప్రశాంత్ అడుగుపెట్టి అన్ని రకాలుగా అద్భుతమైన గేమ్ ఆడాడు. ఈ క్రమంలో సెలబ్రిటీ హోదా ఉన్న కంటెస్టెంట్స్.. చాలా చులకన చేసి చీప్ గా బిహేవ్ చేయడంతో.. నెగిటివిటీ వాళ్లపై బయట భయంకరంగా పెరిగింది. ఒక కామన్ మ్యాన్ ని ఆడుకునే విధంగా వ్యవహరించిన తీరుకు.. షో అయిన వెంటనే చాలామంది సెలబ్రిటీలపై బయట జనాలు.. దాడులకు పాల్పడటం జరిగింది. ఇదే సమయంలో సీజన్ సెవెన్ లోనే అత్యధికమైన ఓటింగ్ రాబట్టిన కంటెస్టెంట్ గా పల్లవి ప్రశాంత్ నీ విజేతను చేయడం జరిగింది.