Pushpa 2: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమాగా “పుష్ప 2” ఉన్న సంగతి తెలిసిందే. 2021లో పుష్ప మొదటి పార్ట్ విడుదలయ్యింది. పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలైన “పుష్ప” దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు చేయకపోయినా గానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో వంద కోట్లు కలెక్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. సినిమాలో బన్నీ మేనరిజమ్స్… ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. తగ్గేదేలే డైలాగ్ ఇప్పటికీ కూడా అందరి నోటిలో ననుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇదిలా ఉంటే “పుష్ప” మొదటి భాగంలో ఐటమ్ సాంగ్ “ఊ అంటావా మావా” పాటలో సమంత వేసిన స్టెప్ లకి ఇండస్ట్రీస్ షేక్ అయిపోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పాటకు మంచి ఆదరణ లభించింది. ఈ క్రమంలో రెండో పార్ట్ లో కూడా అదిరిపోయే ఐటెం సాంగ్ దేవిశ్రీప్రసాద్ ఇవ్వటం జరిగిందట. అయితే ఈ ఐటెం సాంగ్ లో బాలీవుడ్ భామలు అల్లు అర్జున్ తో చిందులేస్తున్నారు. వాళ్లు మరెవరో కాదు దిశా పటానీ, కృతి సనన్. ఈ పాట షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నట్లు సమాచారం. మామూలుగానే సుకుమార్ దర్శకత్వంలో వచ్చే సినిమాలుకు దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే ఐటెం సాంగ్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పటిదాకా వీళ్ళ కలయికలో వచ్చిన అన్ని ఐటెం సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
“ఆర్య”లో “ఆ అంటే అమలాపురం”, “ఆర్య2″లో “రింగా రింగ” సాంగ్ అప్పట్లో సంగీత ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసయి. ఇప్పుడు అదే రకంగా “పుష్ప 2” ఐటెం సాంగ్ దేవిశ్రీప్రసాద్ ఇవ్వడం జరిగిందట. నార్త్ సౌత్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు..మాస్ మసాలా సాంగ్ ఇవ్వడం జరిగిందట. ఈ ఏడాది ఆగస్టు 15వ తారీకు “పుష్ప 2” సినిమా విడుదల చేయనున్నారు. ఆల్రెడీ అధికారిక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఆ దిశగానే ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటూ ఉంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!