Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ చివరి వారానికి వచ్చేసింది. శనివారం జరిగిన ఎపిసోడ్ లో హౌస్ లో ఉన్న ఏడుగురు సభ్యుల ఆట తీరుపై నాగార్జున గట్టిగా క్లాస్ పీకారు. ఈ క్రమంలో శోభ ఆడిన ఆట తీరు ఏకిపారేశారు. యావర్ నీ తిట్టడంతో పాటు.. రూల్స్ కి వ్యతిరేకంగా గేమ్ ఆడటం ఖండించారు. సంచాలక్ గా ఉంటూ మరోపక్క ప్రియాంకని సపోర్ట్ చేయడంపై మందలించారు. ఇక ఆ తర్వాత హౌస్ లో.. శివాజీకి ప్రశాంత్ ఎక్కువ సేవలు చేయటంపై.. నాగార్జున వీడియోలు వేసి గట్టిగా క్లాస్ పీకారు. అనంతరం పీక మీద కాలేసి తొక్కుతా అంటూ.. శివాజీ చేసిన కామెంట్స్ పై నాగార్జున చాలా సీరియస్ కావడం జరిగింది.
ఇంకా మిగతా వీడియోలు కూడా ప్రదర్శించి.. మండి పడటం జరిగింది. ఈసారి చాలామందికి క్లాసులు పీకారు. సరిగ్గా ఫైనల్ వారానికి ముందు వారం కావడంతో… చేసిన తప్పులకు.. నాగార్జున ఫుల్ సీరియస్ అయ్యారు. ఇదిలా ఉంటే 14వ వారంలో మొత్తం ఏడుగురు సభ్యులు నామినేట్ కావటం తెలిసిందే. అయితే ఏడుగురిలో.. శోభ ఎలిమినేట్ కావటం జరిగిందట. ఈ వార్త పట్ల సోషల్ మీడియాలో ఆడియన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి దరిద్రం వదిలింది అని అంటున్నారు. శోభ చాలావరకు రెచ్చగొట్టే గేమ్ ఆడుతూ ఉండటంతో నెగిటివ్ ఆమెపై బాగా క్రియేట్ అయింది.
పల్లవి ప్రశాంత్ ఇంకా శివాజీ లపై లేనిపోని మాటలు మాట్లాడి.. చాలా నెగటివ్ కావడం జరిగింది. దీంతో శోభ నామినేషన్ లో ఉన్న టైం లో ఆమె ఎలిమినేట్ అవుతుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా తప్పించుకుంటూ చివరిదాకా వచ్చింది. అయితే ఫైనల్ వారానికి వెళ్ళకముందు.. శోభ ఎలిమినేట్ కావడం జరిగింది. ఇదిలా ఉంటే గేమ్ చివరికి రావడంతో.. ఎవరు టైటిల్ గెలుస్తారు అన్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చాలావరకు ప్రశాంత్ మరియు శివాజీ ఆ తర్వాత అమర్ పేర్లు ఎక్కువగా వినపడుతున్నాయి. నీ ముగ్గురిలో ఒకరు టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆడియన్స్ భావిస్తున్నారు.