Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభమయ్యాక ఎక్కువగా ఈసారి వినబడిన పేరు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్. యూట్యూబర్ గా తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న పల్లవి ప్రశాంత్.. హౌస్ లో స్టార్టింగ్ గేమ్ కొద్దిగా ఓవర్ అనిపించింది. ఎంతవరకు సింపతి క్రియేట్ చేసుకోవడానికి మనవడు ఆడుతున్నట్లు కెమెరా ముందు అతడు ప్రవర్తించిన తీరు ప్రొజెక్ట్ అయింది. మొదటివారం అందరికంటే ఎక్కువ ఓట్లు రాబట్టగా రెండో వారం చాలామందికి టార్గెట్ అయ్యాడు. ఇంటిలో చాలామంది సభ్యులు పల్లవి ప్రశాంత్ ఆట తీరు పట్ల తక్కువ చేసి మాట్లాడటం తో పాటు చాలా చిన్నగా చూడటం జరిగింది. ఈ క్రమంలో కొంతమంది మాటలు కూడా వదిలేశారు.
దీంతో హౌస్ మేట్స్ అందరూ టార్గెట్ చేయడంతో పల్లవి ప్రశాంత్ కి బయట విపరీతంగా గ్రాఫ్ పెరిగింది. ఇదిలా ఉంటే హౌస్ లో పవర్ అస్త్ర పేరుతో ఇమ్యూనిటీ గెలుచుకునే అవకాశాన్ని బిగ్ బాస్ టాస్కుల రూపంలో ఇంటి సభ్యులకి ఇస్తున్న సంగతి తెలిసిందే. మొదటి వారి నుండి ఈ రకంగా హౌస్ లో ఉన్న సభ్యుల చేత గేమ్ ఆడిస్తున్నారు. మొదటి పవర్ అస్త్ర సందీప్ గెలవడం జరిగింది. రెండో పవర్ అస్త్ర నటుడు శివాజీ గెలుచుకున్నారు. మూడో పవర్ అస్త్ర ప్రియాంక గెలుచుకుంది. అయితే నాలుగో పవర్ అస్త్ర కోసం హౌస్ లో చాలామంది పోటీపడ్డారు.
ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ నీ తప్పుదావ పట్టించే విధంగా మిగతా ఇంటి సభ్యులందరూ వ్యవహరించారు. ఇలాంటి ఒడిదుడుకులు మధ్య వ్యతిరేక పరిస్థితుల మధ్య నాలుగో పవర్ అస్త్ర… పల్లవి ప్రశాంత్ గెలవడం జరిగింది. దీంతో హౌస్ లో ఉన్న సభ్యులకు ఊహించని షాక్ ఇచ్చినట్లయింది. ఈ పవర్ అస్త్రతో రెండు వారాల ఇమ్యూనిటీ పవర్ సొంతం చేసుకోవడం జరిగింది. ఈ నాలుగో పవర్ అస్త్ర కోసం యావర్, శుభ శ్రీ, ప్రశాంత్ పోటీ పడగా.. చివరికి ప్రశాంత్ గెలవడం జరిగింది. ఈ గెలుపుతో అమర్ దీప్, రతిక, ప్రియాంక మొహాలు మాడిపోయాయి.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!