Pallavi Prasanth: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ నీ పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేయడం జరిగింది. అతడు పరారీలో ఉన్నారని వార్తలు రాగా బుధవారం అతని ఇంటిలోనే పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో 6 గంటల పాటు పోలీస్ స్టేషన్ లో విచారించారు. డిసెంబర్ 17వ తారీకు అన్నపూర్ణ స్టూడియో బయట గొడవలు జరగడం తెలిసిందే. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అనంతరం స్టూడియో బయట పలువురి కంటెస్టెంట్స్ మద్దతుదారులు ఉన్నారు.
ఈ క్రమంలో కంటెస్టెంట్స్ వాహనాలపై ఎవరికి వారు దాడులు చేయడం జరిగింది. ఇదే సమయంలో ఆర్టిసి బస్సులపై కూడా దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ నీ ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో మొత్తం ఐదుగురి నిందితులుగా చేర్చగా.. ఆల్రెడీ ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కాక బుధవారం రాత్రి గజ్వేల్ మండలం కొలుగూరులో ప్రశాంత్.. మరియు అతని తమ్ముడు రాజును అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అతనిపై తొమ్మిది కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి జడ్జి ఇంట్లో పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుడిని పోలీసులు ప్రవేశపెట్టడం జరిగింది.
ఈ కేసు పై విచారణ జరిపిన న్యాయవాది ప్రశాంత్ మరియు అతని సోదరుడికి 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ మరియు అతని తమ్ముడు రాజు అని చంచల్ గూడా జైలుకు తరలించారు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేతగా నిలిచిన గాని విజయాన్ని ఆస్వాదించలేని పరిస్థితిలో పల్లవి ప్రశాంత్ నిలిచాడు. దీంతో అతనికి ఓటు వేసిన చాలామంది మద్దతు దారులు.. ప్రశాంత్ అరెస్టు పట్ల బాధపడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులపై దాడుల నేపథ్యంలో ప్రశాంత్ పై నాన్ బెయిల్ బుల్ కేసు నమోదు అయినట్లు సమాచారం.