Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఆదివారంతో ముగిసింది. టైటిల్ కోసం 20 మంది పోటీ పడగా.. యూట్యూబర్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గెలవడం జరిగింది. రన్నరాప్ గా అమర్ దీప్ నిలిచాడు. ఈ క్రమంలో గ్రాండ్ ఫినాలే రోజు బిగ్ బాస్ సెట్ బయట అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రశాంత్ మరియు అమర్ దీప్ అభిమానులు రావడం జరిగింది. ప్రశాంత్ విజేత అని తెలవగానే అన్నపూర్ణ స్టూడియో బయట.. భారీ హడావిడి చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. దీంతో ఇరువురి ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం స్టార్ట్ కాగా.. అతి చినిగి చినిగి గాలివాన మాదిరిగా గొడవ అయిపోయింది.
ఒకరిపై మరొకరు బూతులు తిట్టుకుని తోసుకొని పిడి గుద్దులు గుదుకున్నరు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు పై దాడి చేసి అద్దాన్ని కూడా పగలగొట్టడం జరిగింది. సరిగ్గా గొడవ జరుగుతున్న సమయంలో అమర్ దీప్ కారు రావటంతో.. దానిపై కూడా దాడి చేయడం జరిగింది. అమర్ కారు అద్దాలు పగిలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అన్నపూర్ణ స్టూడియో వద్దకు వచ్చి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరిని చదరగొట్టారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీజన్ సెవెన్ లో మొదటి నుండి పల్లవి ప్రశాంత్ వర్సెస్ అమర్ దీప్ మధ్య గట్టి పోటీ ఉండేది.
ఈ క్రమంలో సెలబ్రిటీ మరియు సీరియల్స్ లో నటించిన అనుభవం ఉండటంతో అమర్.. గేమ్ లో భాగంగా కొన్నిసార్లు ప్రశాంత్ నీ గట్టిగా టార్గెట్ కూడా చేయడం జరిగింది. ఆ సమయంలో కొన్ని దుర్భాషలు కూడా ఆడాడు.గేమ్ చివరకు వచ్చేసరికి ఒకానొక సమయంలో ప్రశాంత్ మీద దాడికి కూడా పాల్పడే విధంగా అమర్ వ్యవహరించాడు. గ్రూపుకి గేమ్ ఆడటంతో ప్రశాంత్ కామన్ మ్యాన్ కావడంతో బయట భయంకరమైన సానుభూతి పెరిగింది. దీంతో టైటిల్ గెలవడంతో.. ప్రశాంత్ మద్దతుదారులు.. బిగ్ బాస్ హౌస్ బయట అమర్ వచ్చాక.. వాళ్ల వాహనంపై గట్టిగా దాడి చేయడం జరిగింది.