Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ నేడే ఫినాలే ఎపిసోడ్. మరి కొద్ది గంటలలో సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్ ఎవరో తెలియనుంది. మొత్తం 19 మంది ఈ సీజన్ లో పోటీపడ్డారు. చివర ఆఖరికి ఫైనల్ వారానికి ఆరుగురు మాత్రమే మిగిలారు. వాళ్ల లిస్టు చూస్తే అమర్, అర్జున్, ప్రియాంక, శివాజీ, యావర్ ప్రశాంత్. ఈ క్రమంలో ఎపిసోడ్ జరుగుతూ ఉండగానే.. కొంతమందికి మనీ ఆఫర్ చేయడం జరిగిందట. ఈ రకంగా ఆఫర్ చేస్తూ ఉండగా ఆరవ స్థానంలో అర్జున్ ఐదవ స్థానంలో ప్రియాంక హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్లు వార్తలు వచ్చాయి.
అయితే నాలుగో స్థానంలో యావర్ కి బిగ్ బాస్ 15 లక్షల ఆఫర్ ఇవ్వటంతో… దానికి ఒప్పుకుని హౌస్ నుండి బయటకు వచ్చినట్లు టాక్. సీజన్ సెవెన్ లో యావర్ చాలా అద్భుతమైన గేమ్ ఆడటం జరిగింది. భాష రాకపోయినా గానీ నామినేషన్ సమయంలో కీలకమైన పాయింట్స్ లేవనెత్తి నామినేట్ చేశాడు. టాస్క్ లలో కూడా సత్తా చాటడం జరిగింది. సీజన్ సెవెన్ లో అందరిలో కల్లా జెన్యూన్ గేమ్ ఆడాడు. మనసులో ఏది దాచుకోకుండా ఏదైనా బయటికి చెప్పేసేవాడు. వీకెండ్ ఎపిసోడ్ లలో నాగార్జున తప్పులు లేవనెత్తినప్పుడు కరెక్ట్ గా వివరణ ఇస్తూ మరోపక్క.. తప్పు చేసి ఉంటే అంగీకరించేవాడు. తన గేమ్ మీద పక్క అవగాహన కలిగినవాడు.
ఈ క్రమంలో సరిగ్గా గేమ్ ఆడలేదని ఎవిక్షన్ పాస్ లో.. గెలిచిన విధానం బాగోలేదని.. రూల్స్ బ్రేక్ చేశావని నాగార్జున అనగా వెంటనే ఎవిక్షన్ పాస్… వదిలేసుకోవడం జరిగింది. యావర్ చాలామందికి నచ్చేసాడు. దీంతో సీజన్ సిక్స్ కాంటేస్తంట్స్ రాజ్, ఫైమ చివరి వారంలో సపోర్ట్ చేయడం జరిగింది. అయితే నాలుగో స్థానంలో హౌస్ నుండి యావర్ ₹15 లక్షల క్యాష్ ప్రైస్ గెలిచి బయటకు రావడం జరిగిందంట. దీంతో యావర్ ₹15 లక్షల ప్రైజ్ మనీ ఆఫర్ చేసి అతని కష్టాన్ని గుర్తించావు అంటూ బిగ్ బాస్ పై యావర్ మద్దతుదారులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక చివరి ఆఖరికి ప్రశాంత్ ఇంకా అమర్ మిగిలి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరిలో ఒకరు టైటిల్ గెలవనున్నారని అంటున్నారు. అంతేకాదు సూపర్ స్టార్ మహేష్ బాబు టైటిల్ ఇవ్వడానికి రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.