Brahmamudi March 26 2024 Episode 367: రాజ్ బిడ్డతో ఇంటికి రావడంతో అపర్ణ ఆ బిడ్డకు ఎవరు హెల్ప్ చేయడానికి వీలు లేదని, అలాగే రాజ్ కి కూడా ఎవరు హెల్ప్ చేయకూడదని, ఈ ఇంట్లో రాజ్ ఒక అతిధి రానే ఉంటాడని వారసుడిగా ఉండడని, ఇదే తన మాటగా ఇది ఇంట్లో అందరూ పాటించాలని చెప్తుంది. కానీ బాబు ఏడుస్తుంటే కావ్య పాలు తీసుకొని వెళుతుంది అందుకు అపర్ణ అడ్డుపడడంతో కావ్య క్లారిటీ ఇచ్చి నేను బాబు బాధపడుతుంటే చూడలేనని మీ అబ్బాయి చేసిన తప్పుకి చిన్న పిల్లాడికి శిక్ష వేయడం తప్పని మీరు తీసుకున్న నిర్ణయం మార్చుకోవాలని కావ్య అపర్ణ ఇంట్లో రుద్రాణి వాళ్ళకి చెప్పేసి వెళుతుందిఅందుకు కావ్యకి సపోర్ట్ గా ఇందిరా దేవి ఉంటుంది. ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. రాజ్ ఇంతవరకు కిందకి రాలేదు తను చేసినా తప్పు తెలిసినట్టుంది ఎప్పుడు పులిలాగా వచ్చి అందరి ముందు కూర్చునేవాడు ఇప్పుడు తప్పు చేశానన్న భావనతో ఉన్నట్టున్నాడు అని రుద్రాణి అంటుంది అక్కడే ఉన్న ప్రకాశం నీ కొడుకు లాగా తప్పు చేస్తే దులుపుకునే రకం కాదు రాజ్ అని అంటాడు.
ఇక అప్పుడే రాజ్ మెట్లు దిగి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ ఉంటాడు. రాజ్ ని చూసి రుద్రాణి నా కొడుకు లాగా దులుపుకోవడం అదిగో తప్పు చేసి దులుపుకొని వస్తున్నాడు అని అంటుంది వెంటనే ప్రకాశం వాడు ఆకలితో వస్తున్నాడు నువ్వు పుల్లేరు మాటలు అని బాధ పెట్టొద్దు అని అంటాడు. ఇక రాజు వచ్చి కూర్చోగానే కావ్య వైపు అపర్ణ వైపు చూస్తూ ఉంటాడు. ఎవరు భోజనం పెట్టరు రాజ్ తనంతట తానే భోజనం పెట్టుకుంటాడు. ఇక రుద్రాణి రాజుతో గబగబా తినేయాలి రాజీ టైంలో లేదంటే బాబు లేస్తాడు ఇప్పుడు బాబు లేస్తే ఆడించడానికి వాళ్ళ అమ్మ కూడా లేదు కదా ఇంక సవతి తల్లి కావ్య ఆ బాబుని ఎలా చూసుకుంటుంది చెప్పు అని అంటుంది. ఆ మాటలకు అపర్ణకి కోపం వచ్చి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతుంటే రాజ్ అపర్ణ చేయి పట్టుకొని ఆపుతాడు నీకు కోపం ఉంటే అది భోజనం మీద చూపించొద్దు తినేసి వెళ్ళు అని అంటాడు మీరు రుద్రాణి అన్న మాటలకు నా కడుపు నిండిపోయింది. అని అంటే వెంటనే రా నువ్వే చెప్పావు కదా ఎవరి మీద కోపం అన్న మీద చూపించకూడదని అని అంటాడు రాజ్ అవును రాజ్ నేను చాలానే చెప్పాను నువ్వు అవన్నీ పాటించకుండా ఇదొక్కటే గుర్తుపెట్టుకున్నావా? వంశాన్ని నిలబెట్టాలని చెప్పాను తప్పు పనులు చేయకూడదు అని చెప్పాను నువ్వు అయినా అవన్నీ చేసేసావు ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకున్నావు అయినా నువ్వు చేసిన పనికి నాకు ఎప్పుడు కడుపు నిండిపోయింది నా ఆకలి చచ్చిపోయింది అని అక్కడి నుంచి అపర్ణ వెళ్ళబోతూ చేయి విదిలించుకుంటుంది.
మీ అందరికీ నేను రావడం వల్ల ఇబ్బంది కలిగితే నేనే ఇకనుంచి వెళ్ళిపోతాను మీరు తినండి అని అక్కడి నుంచి రాజ్ వెళ్లిపోతాడు.ఇక రాజ్ వెళ్లిన తరువాత రుద్రాణి పాపం కొడుకు తినలేదని తల్లి మనసు కరిగిపోయి తను కూడా తినకుండా ఉంటుందేమో మా వదిన అని అంటుంది అపర్ణ ఆ మాటలకు కావాలనే రుద్రాణిముందు అన్నం తినాలని కూర్చుని కలుపుకొని తినబోతూ ఉండగా రాజు గుర్తుకు వచ్చి అన్నం తినకుండా లేచి వెళ్ళిపోతుంది తన వెంటే సుభాష్ కూడా వెళ్ళిపోతాడు. ఇక ఇందిరాదేవి కూడా వెళ్ళిపోతుంది. అందరూ వెళ్లిపోయిన తర్వాత ధాన్యం రుద్రా నీతో నాకు బాగా ఆకలిగా ఉంది మనం తినేద్దాం అని అంటుంది. అక్కడే ఉన్న ప్రకాశం సిగ్గు ఉన్న వాళ్ళు అయితే భోజనం చేయరు అని అంటాడు. ఆ మాటలకు ధాన్యం లేచి నిలబడుతుంది. ఇక వెంటనే రుద్రాణి కూడా అఇష్టంగానే లేచి నిలబడుతుంది. వెంటనే ప్రకాశం అయ్యో రుద్రాణి నిన్ను అనలేదు అమ్మ నువ్వు కూర్చుని భోజనం చెయ్యి అని అంటాడు నాకు కూడా సిగ్గు ఉంది అన్నయ్య అని అంటుంది. కానీ రాహుల్ మాత్రం ఇదంతా ఏం పట్టించుకోకుండా అన్నం కలుపుకుంటూ ఉంటాడు. నీ కొడుక్కి మాత్రం సిగ్గు లేనట్టు ఉందమ్మా అని ప్రకాశం రుద్రాణి తో అంటాడు ఇక రుద్రాణి లే అని రాహుల్ ని లేపుతుంది. ఇక ధాన్యం రుద్రాణి రాహుల్ అనామిక నలుగురు లేచి నిలబడతారు. ఇంట్లో ఎవరూ తినకుండా మీరు మాత్రమే తినాలని చూస్తున్నారా వాళ్ళకున్న బాధ మనకు లేదా అయినా సిగ్గు లేకపోతేనే ఇంట్లో జరిగిన తర్వాత ఎవరైనా భోంచేస్తారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రకాశం ఇక అందరూ కూడా వెళ్ళిపోతారు.
ఇక మరోవైపు కావ్య రాజ్ కోసం భోజనం రెడీ చేసుకుని వెళుతూ ఉంటుంది అప్పుడే అపర్ణ ఆపుతుంది. నువ్వేం చేస్తున్నావ్ అని అడుగుతుంది భోజనం తీసుకు వెళుతున్నాను అని అంటుంది కావ్య ఎవరికీ అని అంటుంది ఎవరికో మీకు తెలుసు కదా అని అంటుంది. నిన్న నువ్వు బాబుకి పాలు ఇస్తుంటేనే నేను అడ్డుపడ్డాను ఇప్పుడు నా కొడుక్కి భోజనం పెట్టి నువ్వు ఏంటో నిరూపించుకోవాలనుకుంటున్నావా మమ్మల్ని అందరినీ చెడ్డవాళ్లం చేయాలనుకుంటున్నావా అంటే ఇంట్లో వాళ్ళందరూ రాజుని వెలివేస్తే నువ్వు మాత్రం తనకి భోజనం తీసుకెళ్లి దగ్గర అవ్వాలని చూస్తున్నావా నీ మనసులో ఏ ఉద్దేశం పెట్టుకుని ఇదంతా చేస్తున్నావు అని అపర్ణ కావ్య మీద ఫైర్ అవుతుంది. మమ్మల్ని చెడ్డవాళ్లం చేసి నువ్వు మంచి దానివి అవ్వాలనుకుంటున్నావా రాజ్ మనసులో నీ మీద ఆ ఉద్దేశం కలగాలని కదా ఇలా చేస్తున్నావు అని అంటే వెంటనే కావ్య కూడా కోపంగా అత్తకు సమాధానం చెబుతుంది. మీరు అన్నదాంట్లో ఒకటి నిజం లేదు అసలు మీరు చేస్తున్నది తప్పు అలాంటిది నేను చేస్తున్న తప్పన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయినా రాజ్ నుండి నిజం రాబట్టాలంటే ఆయనకి భోజనం పెట్టకుండా ఉంటే ఆ నిజం మీకు చెప్తాడా అందరూ కుటుంబ సభ్యులు వెలివేస్తే ఎవరితో తన మనసులో మాటని పంచుకుంటాడు అందుకే నేను ఈ భోజనం తీసుకెళ్లాలనుకుంటున్నాను అయినా ఇంట్లో అందరూ మీ పరువు పోయిందని బాధపడుతున్నారు. మీ అబ్బాయి మీ వారసత్వాన్ని తక్కువ చేశాడని నలుగురు నాలుగు మాటలు అంటున్నారని మీరు బాధపడుతున్నారు మీ బాధ కన్నా ఇక్కడ ఎక్కువ బాధ పడాల్సింది నేను, ఎక్కువ నష్టం జరిగింది నాకు, అలాంటప్పుడు ఆయన నుంచి నిజం రాబెట్టుకోవాల్సిన అవసరం నాకు మాత్రమే ఉంది అందుకే ఇలా భోజనం తీసుకెళ్లయినా తన మనసు మార్చాలని తన చేత నిజం చెప్పించాలని అనుకుంటున్నాను ఇందులో మిమ్మల్ని నేనేమీ ఎదిరించాలని కాదు మీరు తీసుకుని నిర్ణయం నేను తప్పు పడుతున్నట్టు కాదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య.
ఇక రాజు దగ్గరికి తీసుకువెళ్లి భోజనం ప్లేట్ ఇస్తుంది నాకు ఆకలిగా లేదు అని అంటాడు ఇది ఎప్పుడో పాత సినిమా డైలాగు అని అంటుంది కావ్య నీకు నా జీవితం సినిమా లాగా ఉందా అని అంటే, మీరు నాకు భోజనం ఆకలి లేదు అని చెప్పడం నేను చాలా సార్లు విన్నాను లేండి తీసుకోండి అని అంటుంది. నాకేం అవసరం లేదు అని అంటాడు మీ ఆకలేంటో నాకు తెలుసు తీసుకోండి అని అంటుంది నామీద సానుభూతి చూపిస్తున్నావా అని అంటాడు. సానుభూతి చూపించాల్సిన టైం ఆ ఇది అయినా నేను మీకు సానుభూతి ఇప్పుడు చూపిస్తాను ఒక బిడ్డను తీసుకొచ్చి వాడి తల్లి ఎవరో సమాధానం చెప్పకుండా ఉంటే ఈ టైంలో ఒక భార్యగా నేను మీ మీద సానుభూతి చూపిస్తానని ఎలా అనుకున్నారు మీ ఆకలి గురించి నాకు తెలుసు కాబట్టి అన్నం తీసుకొచ్చాను తినండి మీ మగాహంకారాన్ని ఇప్పుడు చూపించదు అని కావ్య బలవంతంగా రాజ్ చేతిలో భోజనం పెడుతుంది. రాజి భోజనం తీసుకొని గబగబా తినేస్తాడు. ఎందుకు అలా చూస్తున్నావు సిగ్గు లేకుండా ఎలా తింటున్నాడో చూడు అని అనుకుంటున్నావు కదా అని అంటే మీకు నా మనసు ఎప్పటికీ అర్థం కాదు అలా అనుకునే దాన్ని అయితే అసలు భోజనమే తీసుకొచ్చేదాని కాదు అని అంటుంది కావ్య. భోజనం అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పండి అని అంటుంది ఏం చెప్పాలి అని అంటాడు మీరు చెప్పాల్సిన నిజం అని అంటుంది ఆ నిజం ఎప్పుడో చెప్పేశాను అని అంటాడు.కానీ నాకు తెలియాలి నిజం ఇంకా ఉంది అని అంటుంది. ఏంటా నిజం అని అడుగుతాడు ఈ బిడ్డకు తల్లి ఎవరో చెప్పాలి అని అంటుంది అది అప్పటికి నా నుంచి రావట్లేదు ఆ నిజం నిద్రపోతుంది అని అంటాడు ఆ నిజం ఎప్పుడు బయటికి వస్తుంది ఇంట్లో వాళ్ళందరినీ ఇలా బాధ పెట్టడం మీకు కరెక్టేనా ఈ రోజు మీ వల్ల ఇంట్లో ఎవరూ భోజనం చెయ్యలేదు ఆ విషయం మీకు అర్థం అవుతుందా అని అంటుంది. నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటున్నాను అని రాజ్ నిద్రపోతాడు.
ఇక మరోవైపు హాల్లో రుద్రాణి, రాహుల్, ధాన్యం అనామిక నలుగురు అటు ఇటు తిరుగుతూ ఆకలితో అలమటి ఇచ్చి పోతూ ఉంటారు నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్న అత్తయ్య ఏదో ఒకటి చేయండి అని నేనింకా ఆగలేను, సైలెంట్ గా వెళ్లి అన్నం తినేద్దాం అని అంటుంది అనామిక. వెంటనే రుద్రాణి ఇప్పుడు మనం వెళ్లి భోజనం చేస్తే రేపు ఉదయం అయినా మనమే తిన్నామని తెలిసిపోతుంది అని అంటుంది మరి ఇప్పుడు ఏం చేయాలి నాకు బాగా ఆకలిగా ఉంది అని అనుకుంటూ ఉండగా రాహుల్ మీ అందరికీ ఫుడ్ ఆర్డర్ పెట్టాను అని అంటాడు అవునా ఏం ఆర్డర్ పెట్టావు అని అడిగితే చికెన్ బిర్యాని మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను అని అంటాడు. ఆహా పేర్లు వింటుంటేనే కడుపు నిండిపోతుంది కాస్త ఆలస్యమైన పర్వాలేదు మనకి భోజనం వచ్చేస్తుంది అని అనుకుంటారు ఇక అంతలో డెలివరీ బాయ్ కాల్ చేస్తాడు రాహుల్ ఫోన్ లిఫ్ట్ చేసి ఎక్కడున్నావని అడిగితే లొకేషన్కి వచ్చేసాను సార్ అని అంటాడు సరే అని రాహుల్ రుద్రా నీతో చెప్పి ఫుడ్ వచ్చేసింది తీసుకుందాం పదండి అని అంటాడు ఇక నలుగురు చాలా ఆశగా, డెలివరీ బాయ్ దగ్గరికి వెళుతుండగా ప్రకాశం మధ్యలో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక ప్రకాశాన్ని చూసి నలుగురు షాక్ అవుతారు ఇప్పుడు ఏం చేయాలి ధాన్యం నీ మతిమరుపు మొగుడు ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు మళ్లీ మనల్ని చూస్తే సిగ్గులేదా అని తిడతాడు ఏదో ఒకటి చేయాలి అని నలుగురు ఆలోచిస్తూ ఉండగా డెలివరీ బాయ్ వచ్చేస్తాడు ప్రకాశం డెలివరీ బాయ్ ని చూసి ఎవరి కోసం వచ్చావు అని అడిగితే ఫుడ్ ఆర్డర్ పెట్టాడండి అని అంటారు ఇంత సిగ్గులేని వాళ్ళు ఇంట్లో ఎవరూ లేరే ఈరోజు ఇంట్లో ఎవరూ భోజనం చేయట్లేదు అని అంటాడు ఇక రుద్రాణి రాహుల్ అయితే అయ్యో నోటిదాకా వచ్చిన ఫుడ్డు వెనక్కి వెళ్ళిపోతుంది అని అనుకుంటారు. డెలివరీ బాయ్ ఈ లొకేషన్ అని చెప్పారండి అని అంటే అంత సిగ్గులేని వాళ్ళు ఎవరు అని అడుగుతాడు ప్రకాశం రాహుల్ అని చెప్తాడు రాహుల్ అనే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరే అని అంటాడు. వెంటనే రాహుల్ ఆ మాట విని పోనీలే ఈ మతిమరుపు వల్ల మనకు నా పేరు మర్చిపోయాడు లేదంటే రేపు నలుగురం తిన్నా కూడా నా ఒక్కడి పేరు గుర్తుండేది అని అనుకుంటాడు. ఇక ప్రకాశం డెలివరీ బాయ్ తో ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరూ లేరు ఆ ఫుడ్ అంతా నువ్వే తినేసేయ్యి ఒక్క నిమిషం ఇక్కడే ఉండు అని లోపలికి వెళ్లి వంట గదిలో నుంచి క్యారేజీ తీసుకొని బయటికి వెళుతూ ఉండగా ధాన్యం చూసి నా మతిమరుపు మొగుడు చూడు రుద్రాణి ఇంట్లో నుంచి క్యారేజీ తీసుకెళుతున్నాడు ఇప్పటి పరిస్థితి ఏంటో ఆలోచించు కనీసం ఇంట్లో ఫుడ్ అయినా ఉంటే ఏదైనా తిందాం అనుకున్నాము అని అంటుంది. ఇక ప్రకాశం క్యారేజీ తీసుకెళ్లడం చూసి నలుగురు షాక్ అవుతారు ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
రేపటి ఎపిసోడ్ లో బాబు లేచి ఏడుస్తూ ఉంటాడు రాజ్ బాబుని ఏడవద్దు అని అంటూ పాలు తాగుతావా బాబు అని అడుగుతూ ఉంటాడు కావ్య వాడికి ఆకలేస్తే పాలు మాత్రమే కాదు ఇలాంటి టైంలో వాడికి ఉగ్గు పట్టాలి అని అంటుంది ఉగ్ అంటే ఏంటి అని అడుగుతాడు రాజ్ కాసేపు ఇక్కడే ఉండండి అని బయటికి వెళ్లి కళ్యాణ్తో కలిసి బాబుకి కావాల్సినవి తీసుకొని వస్తుంది. హాల్లో కళ్యాణి కావ్య నీ కుటుంబ సభ్యులందరూ అడ్డుకుంటారు ఇక రాజ్ పైన బాబుని ఏడవకుండా సముదాయిస్తూ ఉంటాడు. ఇంట్లో వాళ్లకి కావ్య ఏం సమాధానం చెప్పి బాబు దగ్గరికి వెళ్తుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!