Madhuranagarilo March 26 2024 Episode 322: ఏంటి రాధ ఆ కన్నీళ్లు అని మధుర అడుగుతుంది.ఎంతో మందికి ఉద్యోగాలని ఇచ్చి దర్జాగా బ్రతికిన ఆయనని ఆటో డ్రైవర్ గా చూడలేకపోతున్నాను అత్తయ్య అnని రాధ బాధపడుతుంది.నేను మాత్రం శ్యామ్ ని ఆటో డ్రైవర్ గా చూసి సంతోషిస్తున్నానా?రాధ నాకు మాత్రం బాధగా లేదా?కానీ వాడు సంతోషంగా ఉండాలి అంటే మనం సంతోషంగా ఉన్నట్టు వాన్ని సంతోష పెట్టాలి అని మధుర చెబుతుంది.సరే అత్తయ్య అని రాధ అంటుంది.కట్ చేస్తే,ఏమండీ మీరు అన్నం తినేస్తే అన్ని సర్దేస్తాను అని రాధ అంటుంది.
అందరు తిన్నారా మరి నువ్వు తిన్నావా అని శ్యామ్ అంటాడు.ఏంటి రాధ నీ భర్తని ఆటో డ్రైవర్ గా చూసి తట్టుకోలేక కడుపు నిండిపోయిందా అని శ్యామ్ అంటాడు. చూడు రాధ నలుగురికి ఉద్యోగాలు ఇచ్చి నా కింద పని చేయించుకున్న నేను ఒకరి కింద పని చేయడం నాకు ఇష్టం లేక ఈ ఆటో డ్రైవర్ పని చేస్తున్నాను
అలా అని ఇదే పనిని కంటిన్యూ చేయను నాలుగు డబ్బులు సంపాదించాక మళ్ళీ నేనే ఏదైనా ఒక బిజినెస్ చేస్తాను అప్పటిదాకా ఈ ఆటో డ్రైవర్ ఉద్యోగం చేయాల్సిందే రాధ అని శ్యామ్ అంటాడు. సరే భోజనం చేయండి అని రాధ అంటుంది. రాధ తిందాం అని శ్యామ్ రాధకు అన్నం తినిపిస్తాడు. ఏవండీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పండుని ఇంత పెద్ద స్కూల్లో చదివించడం నాకు ఇష్టం లేదు అని రాధ చెబుతుంది. వాడిని అదే స్కూల్లో చదివిస్తాను రాధ అని శ్యామ్ అంటాడు.చదివిస్తారు కానీ ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు అందుకని అత్త మామలని దృష్టిలో పెట్టుకొని పండుని స్కూల్లో మారుద్దాం అంటున్నాను అని రాధ చెప్పడంతో సరే రాధ నీ ఇష్టం అని శ్యామ్ అంటాడు. కట్ చేస్తే,పండుని తీసుకువెళ్లి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారు. చలపతి వచ్చి శ్యామ్ కి ఉద్యోగం వచ్చింది అని రుక్మిణికి చెబుతాడు. శ్యామ్ ఏ కంపెనీలో ఉద్యోగం రావడానికి వీల్లేదు అని రుక్మిణి అంటుంది. శ్యామ్ కి ఆటో డ్రైవర్ గా ఉద్యోగం వచ్చింది అని చలపతి అంటాడు.
అలాగే పండుని కూడా వీధి స్కూల్లో జాయిన్ చేయించారు నీకు ఇన్ని కోట్లు ఆస్తి ఉన్న లాభం ఏంటి అని చలపతి అంటాడు. ఆ స్కూల్లో జాయిన్ చేసి నాకు మంచి హెల్ప్ చేశాడు చూడండి పండికి ఎలా దగ్గర అవుతాను వాడికి ఇష్టమైనవన్నీ వండి రెడీ చేయండి నేను తీసుకు వెళ్తాను స్కూల్ కి అని రుక్మిణి చెబుతుంది. చలపతి దాక్షాయని వెళ్లి వంట చేస్తారు. ఇప్పుడు చూడు పండుని నా సొంతం ఎలా చేసుకుంటానో అని రుక్మిణి బాక్స్ తీసుకొని స్కూల్ కి వెళుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఆ కూరలతో అన్నం తింటూ ఉంటారు కానీ పండు మాత్రం పెరుగన్నం తింటూ ఉంటాడు
ఇంతలో అక్కడికి రుక్మిణి వచ్చి పండు నీకు ఇష్టమని చాపల కూర చికెన్ ఫ్రై వండుకొచ్చాను ఒక్కసారి అమ్మ అని పిలువు ఇవన్నీ నీకు పెడతాను అని అంటుంది. నేను పిలవను అని పండు వెళ్ళిపోతూ ఉంటాడు. పండు ఎందుకు వెళ్ళిపోతున్నావ్ నా కళ్ళల్లో నీకు ప్రేమ కనిపించడం లేదా ఒక్కసారి అమ్మ అని పిలువు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతలో పండు మమ్మీ అని పిలువగానే సంతోషిస్తుంది కానీ తన వెనకాల రాధను చూసి పండు తన దగ్గరికి పరిగెత్తికు వెళ్తాడు. మళ్లీ నా కొడుకు దగ్గరికి ఎందుకు వచ్చావు అని రాధ అడుగుతుంది. నా కొడుకు ఎక్కడో చదవాల్సిన వాడు ఇలాంటి స్కూల్లో చదువుతున్నాడని చూడడానికి వచ్చాను నీ పరిస్థితిని గమనించి వాడికి అన్నం తినిపిద్దామని వచ్చాను అని అంటుంది.
కొడుకు మీద ప్రేమ లేదు కానీ కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావా చూడు ఇదే లాస్ట్ వార్నింగ్ ఇంకోసారి నా బిడ్డ జోలికి వచ్చిన వాడితో మాట్లాడాలని ప్రయత్నించిన చంపేస్తాను అని రాధ పండుని తీసుకొని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, మధుర ఇళ్లల్లో పని చేయడం కోసమని వెళ్తుంది ఒకచోట గుంపులు ఉండడం చూసి అక్కడికి వెళ్లి వాళ్ళని అడుగుతుంది. ఏమీ జరగలేదమ్మా ఇక్కడ పని కోసం నిలబడుతున్నాం అని వాళ్ళు చెబుతారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!