Guntur Kaaram: “గుంటూరు కారం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అంతా ముస్తాబయింది. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నంబూరు గ్రౌండ్స్ లో ఈ వేడుక నిర్వహిస్తున్నారు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది. జనవరి 12వ తారీకు ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో జనవరి ఆరవ తారీఖు నాడే హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో హైదరాబాద్ పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. దీంతో హైదరాబాద్ చుట్టుప్రక్కల పలు ప్రాంతాలలో కార్యక్రమం నిర్వహించాలని సినిమా యూనిట్ ప్రయత్నాలు చేసింది. కానీ ఆ ప్రయత్నాలు ఏవి కూడా సఫలీకృతం కాలేదు.
చివరఖరికి ఏపీలో జనవరి 9వ తారీకు గుంటూరు నందు.. నంబూరు గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రకటన చేయడం జరిగింది. ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ లేటెస్ట్ గా తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ ఫోటో పోస్ట్ చేయడం జరిగింది. స్పెషల్ ఫ్లైట్ లో గుంటూరు కారం సినిమా యూనిట్ గన్నవరంలో ల్యాండ్ అయినట్లు తెలియజేశారు. ఈ ఫోటోలో డైరెక్టర్ త్రివిక్రమ్ తో పాటు హీరో మహేష్ బాబు హీరోయిన్స్ శ్రీలీల, మీనాక్షి చౌదరితో పాటు నిర్మాతలు చిన్న బాబు, నాగ వంశీ అదేవిధంగా దిల్ రాజు ఉన్నారు.
గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే సినిమా యూనిట్ కి అభిమానులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ ఫుల్ మాస్ పాత్రలో కనిపిస్తున్నారు. దీంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగాయి. విడుదలైన మూడు పాటలలో “కూర్చి మడతపెట్టి” సాంగ్ కి భారీ ఎత్తున వ్యూస్ రావడం జరిగింది. కొద్దిరోజుల క్రితం ఆదివారం విడుదల చేసిన ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో.. కచ్చితంగా సంక్రాంతికి “గుంటూరు కారం” సూపర్ డూపర్ హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!