Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 17 వ తారీకు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అనంతరం స్టూడియో బయట దారుణంగా గొడవలు జరిగాయి. పోలీసుల వాహనాలు ఆర్టీసీ బస్సులు అద్దాలు ధ్వంసం అయ్యాయి. కొంతమంది కంటెస్టెంట్స్ వాహనాలు కూడా అల్లరి ముకలు ధ్వంసం చేయడం జరిగింది. దీంతో ఆ సమయంలో ఎవరు ర్యాలీలు చేయొద్దని కంటెస్టెంట్స్ అందరికీ పోలీసులు హెచ్చరించారు. అయితే ప్రశాంత్ మొదట ర్యాలీ చేయకుండా సైలెంట్ గా వెళ్లిపోయి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చే ర్యాలీ చేయడంతో.. పోలీస్ ఆదేశాలు పాటించకపోవడంతో అతనిపై కేసు నమోదు అయింది.
ఆ తర్వాత బుధవారం ఇంటి వద్ద అతనిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే తాను పరారీలో ఉన్నట్లు అనేకమైన వార్తలు సోషల్ మీడియాలో భయంకరంగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆ సమయంలో ఇంటి వద్దనే కొంతమందికి ప్రశాంత్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ తాను పారిపోయినట్లు వస్తున్నా వార్తలపై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. పోలీసులు నన్ను ముందుగానే వెనక గేటు నుంచి వెళ్లాలని చెప్పారు. కానీ నేను ట్రోఫీ అందుకొని ముందుకు గేటు వద్దకు వచ్చాను. అక్కడ నా కోసం చాలామంది వచ్చారు. వారందరిని చూసి షాక్ అయ్యాను. ఇంత మంది నాకు సపోర్ట్ చేసినను కల్పించిన వారిని కలవకుండా వెనుక గేటు నుంచి దొంగల వెళ్ళటం సరైనది కాదని చెప్పి నేను వచ్చాను.
అంతేకాదు నేను కప్పు గెలిచిన తర్వాత చాలామంది నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. కానీ ఆ సమయానికే నేను తిండి నిద్ర లేదు చాలా నీరసపడిపోయాను. కొంచెం టైం ఇచ్చిన తర్వాత మళ్లీ ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పాను. దీంతో నేను ఇంటర్వ్యూ ఇవ్వకపోవడంతో నా గురించి కావాలని నెగిటివ్ గా ప్రచారం చేయటం స్టార్ట్ చేశారు. ఐదుగురు వీడియోలు మరియు ఫోటోలు మా వాళ్ల దగ్గర ఉన్నాయి. నేను అరెస్టు అయిన తర్వాత నాకు ఏదైనా జరిగితే ఆ ఐదుగురిదే బాధ్యత అంటూ అరెస్టు ముందు పల్లవి ప్రశాంత్… వీడియో విడుదల చేయడం జరిగింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.