Guntur Kaaram: జనవరి 9వ తారీకు గుంటూరులో “గుంటూరు కారం” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడం జరిగింది. మహేష్ బాబు సొంత ఊరు కావటంతో భారీ ఎత్తున అభిమానులు రావడం జరిగింది. పైగా సూపర్ స్టార్ కృష్ణ తల్లి ఇందిరా మరణించిన తర్వాత ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ తండ్రిని తలచుకుని అభిమానులు ఉద్దేశించి ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. మహేష్ ముందుగా మాట్లాడుతూ గుంటూరులో ఈ కార్యక్రమం జరగటానికి కారణం దర్శకుడు త్రివిక్రమ్ అని అన్నారు. ఆ తర్వాత హీరోయిన్ల పనితీరు గురించి పొగుడుతూ శ్రీలీల, మీనాక్షి చౌదరి లపై పొగడ్తల వర్షం కురిపించారు.
సంక్రాంతి పండుగ మా ఫ్యామిలీకి ఎంతో కలిసొచ్చింది. నా సినిమా లేదా నాన్నగారు సినిమా సంక్రాంతికి విడుదల అయిందంటే కచ్చితంగా విజయం సాధిస్తది. “గుంటూరు కారం” కూడా గట్టిగానే కొడుతది. అయితే ప్రతి సంక్రాంతి పండుగకి నా సినిమా విడుదలయ్యాక నాన్నగారు నుండి ఫోన్ వచ్చేది. ఆయన సినిమా గురించి వివరిస్తూ కలెక్షన్స్ మరియు రికార్డుల గురించి చెప్పేవాళ్ళు. కానీ ఈసారి మన మధ్యలో నాన్నగారు లేరు అంటూ మహేష్ కొద్దిగా ఎమోషనల్ అయ్యారు. అనంతరం అభిమానులను ఉద్దేశించి ఇకనుండి మీరే నా సినిమా గురించి అన్ని చెప్పాలి. ఎందుకంటే ఇక నుండి మీరే నా అమ్మ, నాన్న… అన్నీ మీరే అని చాలా భావోద్వేగంగా మహేష్ స్పీచ్ ఇవ్వడం జరిగింది.
మహేష్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2022వ సంవత్సరంలో మహేష్ తన ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయాడు. జనవరిలో అన్నయ్య సెప్టెంబర్ నెలలో తల్లి డిసెంబర్ నెలలో తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. ఆ సమయంలోనే ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. దీంతో మానసికంగా మహేష్ ఎంతగానో డామేజ్ అయ్యాడు. ఆ తర్వాత గుంటూరు కారం సినిమా షూటింగ్ కూడా అనేక మార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో వెంటనే తేరుకుని.. శరవేగంగా సినిమా కంప్లీట్ చేయడం జరిగింది. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12వ తారీకు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఎన్నడూ చెయ్యని మాస్ పాత్ర ఈ సినిమాలో మహేష్ చేసినట్లు ట్రైలర్ ఫోటోలు బట్టి తెలుస్తోంది.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!