Madhuranagarilo April 3 2024 Episode 329 : పసుపు తాడు కట్టుకొని మంగళ సూత్రాలు కూడా వేయాలా అని రుక్మిణి అంటుంది.చెప్పాను కదా అమ్మ తన కోరిక తీరాలంటే అన్ని వేయాల్సిందే అని దాక్షాయిని అంటుంది.ఆ అమ్మాయి అన్ని నగలు మూట కట్టి పంతులుగారు ఇవి హుండీలో వేయండి అని చెబుతుంది.నేను వెయ్యనమ్మ నీ స్వధష్టాలతో నువ్వే అని పంతులుగారు చెబుతారు. అక్కడికి రుక్మిణి దాక్షాయిని వస్తారు.ఇంతలో ఎవరు లబ్బర్ పామును వాళ్ళ ముందు విసిరేస్తారు.అది చూసిన దాక్షాయని పాము పాము అని భయపడిపోతుంది.అందరూ పరిగెత్తుకెళ్ళి దాచుకుంటారు.ఇంతసేపైనా పాము కదల్లేదు ఏంటీ అని రుక్మిణి చూస్తుంది.అక్కడికి వెళ్లి చూసేసరికి అది లబ్బర్ పామును చూసి అందరిని భయపెట్టావా పిన్ని అని రుక్మిణి అంటుంది.రబ్బరుపామని నాకేం తెలుసమ్మా అని దాక్షాయని అంటుంది.
అమ్మ ఆ నగలు తీసుకువెళ్లి హుండీలో వేయి అని పంతులుగారు చెబుతారు. ఆ అమ్మాయి మూట విప్పి చూసేసరికి అందులో నగలు ఉండవు ఇక్కడ నగలు పోయాయి అని అంటుంది ఆ అమ్మాయి.నగలు పోయాయా వెతకండి అని అంటాడు వాళ్ళ ఆయన.రుక్మిణి వాళ్లు వెళ్ళిపోతూ ఉండగా ఆగండి అందరిని వెతికాకే వెళ్ళండి అని పంతులుగారు అంటారు.అందరినీ వెతుకుతారు ఎవరి దగ్గర నగలు ఉండవు.నీ పూల బుట్ట ఒకసారి ఇవ్వండి అందులో వెతకాలి అని ఆ అమ్మాయి అంటుంది.నేనెవరో తెలుసా మధురానగర్ ఓనర్ నీ నగలు నేనెందుకు దొంగతనం చేస్తాను అని రుక్మిణి అంటుంది.అందర్నీ చూశాను మిమ్మల్ని చూడాల్సిందే అని అమ్మాయి చూడడంతో అందులో నగలు దొరుకుతాయి.వీటిని ఏమంటారు నగలు దొంగతనం చేసి పైగా మధురానగర్ ఓనర్ అని చెబుతావా వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి అని అంటుంది.నేను ఆ నగలు తీయలేదు అని రుక్మిణి అంటుంది.
బుద్ధిగా బతకక గుడిలోకి వచ్చి దొంగతనం చేస్తావా ఎక్కడ దొంగతనం చేసినా దొరకవేమో గాని సాక్షాత్తు దేవుడి దగ్గర దొంగతనం చేస్తే వెంటనే పట్టుబడిపోతారు ఇదేం బుద్ధమ్మ నీకు అని నలుగురు నాలుగు మాటలు అంటారు.ఇంకా చూస్తారు ఏంటండీ పోలీసులకు ఫోన్ చేయండి అని ఆ అమ్మాయి అంటుంది.ఆ నగలు నా దగ్గరే దొరికాయి కాబట్టి నేను దొంగనయ్యాను ఈసారి కి నన్ను క్షమించి వదిలేయండి మీ కాళ్లు పట్టుకుంటాను అని రుక్మిణి కాళ్లు పట్టుకుంటుంది.మమ్మల్ని క్షమించండి అని దాక్షాయని కూడా కాళ్లు పట్టుకుంటుంది.సరే మీరు ఇంతగా బ్రతిమిలాడుతున్నారు కాబట్టి వదిలేస్తున్నాను వెళ్లిపోండి ఇంకెప్పుడూ నీ మొహం నాకు కనిపించదు అని అమ్మాయి అంటుంది.కట్ చేస్తే,జీవితంలో ఇంతటి అవమానం నాకు ఎప్పుడూ జరగలేదు అని రుక్మిణి ఫీల్ అవుతుంది.ఇంతలో రాధ వచ్చి దొంగబుద్ధి ఉన్న నువ్వే దొంగని ముద్ర పడితే తట్టుకోలేకపోయావు మరి మా అత్తయ్య మహారాణి లాగా బతికింది తనమీద దొంగని మొదలుపడితే తను ఎలా తట్టుకుంటుంది
అందుకే నేనే నీకు బుద్ధి చెప్పాలని ఈ ప్లాన్ చేసి ఆ నగల్ని కొట్టేసి నిన్ను దొంగలు చేశాను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఇంకోసారి నా కుటుంబం జోలికి వస్తే వదిలిపెట్టను అని రాధా అంటుంది.నీ కుటుంబం జోలికి రాను కానీ పండు జోలికి వస్తాను వాని బర్త్డే ఉంది కదా వాని బర్త్డే నేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాను అని రుక్మిణి అంటుంది.పండు కి నీ గురించి అంతా తెలుసు వాడు ఎప్పటికీ నువ్వు బర్త్డే చేస్తే చేసుకోడు వాడి జోలికొస్తే నిన్నేం చేస్తాను నాకే తెలియదు అంటూ రాధా వెళ్ళిపోతుంది.కట్ చేస్తే,అమ్మ రాదెక్కడ అని శ్యామ్ అడుగుతాడు.బయటికి వెళ్ళింది రా అని మధుర చెబుతుంది.ఇంతలో రాదా వస్తుంది మీ ఆయన చూడమ్మా రాదా ఎక్కడ అని ఆరాటపడుతున్నాడు వాడి సంగతి ఏంటో చూడు అని మధుర అంటుంది. ఏంటండీ అని రాదా అడుగుతుంది.
అన్ని ఇక్కడ చెప్పాలా రా రాదా అంటూ శ్యామ్ రాదని తీసుకొని వెళ్తాడు.కట్ చేస్తే,ఆటో మెకానిక్ షెడ్ కి తీసుకెళ్ళినప్పుడు నా ఒంటికి గ్రీస్ అంటింది నా అదంతా పోయేలా రుదు రాదా అని శ్యామ్ అంటాడు.రాధా శ్యామ్ కి స్నానం చేపిస్తూ ఉంటుంది.ఆ నీళ్లు తీసి రాధ మీద పోసి గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టబోతాడు శ్యామ్.ఏంటండీ స్నానానికి అని పిలిచి ఇలా చేస్తున్నారు అని రాదా వదిలించుకొని వెళ్ళిపోతుంది.కట్ చేస్తే,సారీ రాధా ఇందాక అలా చేసినందుకు అనే శ్యామ్ అంటాడు.మీరు అలా చేసినందుకు నాకేమీ కోపం లేదండి నాకు కోపం అంత మా అక్క మీదనే అని రాదా అంటుంది.ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి తలుచుకుని ఎందుకు రాదా బాధపడడం అని శ్యామ్ అంటాడు.జరిగిపోయిన దానికి గురించి కాదండి నేను బాధపడుతుంది జరగాల్సిన దాని గురించి రేపు వాడి బర్త్ డే మా అక్క గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తానంటుంది అని రాధా అంటుంది.అలా ఎప్పటికీ జరగదు రాదా అని శ్యామ్ అంటాడు.
మా అక్క అసలే దుర్మార్గురాలు తనకి ఇప్పుడు డబ్బు కూడా తోడయ్యింది అది ఏం చేస్తుందోనని రాదా అంటుంది. తన ఏం చేసినా పండు బర్త్డే సెలబ్రేట్ చేయలేదు అని శ్యామ్ అంటాడు. అయితే పండుకి మంచి డ్రెస్ తీసుకొద్దాం పదండి అని రాదా అంటుంది. అవున్రా వెళ్లి పండు కి మంచి డ్రెస్ తీసుకురండి అని మధుర ధనంజయ్ అంటారు. అలాగే అంటూ పండుని తీసుకొని వెళ్తారు. ఎంతో గొప్పగా జరగాల్సిన పండు బర్త్డేఇలా ఉన్నంతలో చేయాల్సి వస్తుంది అని మధుర బాధపడుతుంది.బాధపడకు మధుర వచ్చే సంవత్సరం కల్లా మనల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్తారు మన కొడుకు కోడలు అని ధనంజయ్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!