Madhuranagarilo December 16 2023 Episode 237: రాధా బాధపడుతూ రోడ్డు మీద నడుచుకుంటూ శివాలయం దగ్గరికి వెళుతుంది. ఏంటి స్వామి నాకు ఈ శిక్ష ఏ అమ్మాయికి వేయని శిక్ష వేశారు ఎందుకు నేనేం పాపం చేశాను అని రాధా అంటుంది. నన్ను ఎంతగానో ప్రేమించే ఆయన నాకు అబద్ధం చెప్పి మరొక అమ్మాయితో తిరుగుతున్నాడు ఆ అమ్మాయి ఎవరో కాదు నాకు తోడబుట్టిన అక్క మా అక్కే మా ఆయన మొదటి భార్య తిరిగి వచ్చిందని నాకు ఎందుకు చెప్పలేదు చెప్పకుండా నా దగ్గర ఎందుకు దాచి పెట్టాడు ఒకవేళ తనని మళ్లీ కావాలనుకుంటున్నాడా ఆమెని ఎంతగానో ద్వేషించే ఆయన ఆమె వెంట ఎందుకు తిరుగుతున్నాడు స్వామి అని రాదా అంటుంది. అందుకేనా నా మనసులో ఉన్న ప్రేమని ఆయనకు చెప్పడానికి ప్రయత్నిస్తే వినకుండానే వెళ్ళిపోయాడు పెళ్లి కూడా నాకు ఇష్టం లేకుండానే జరిగిపోయింది
నేను పండు కోసం పెళ్లి జీవితంలో చేసుకోకూడదు అనుకున్నాను కానీ పండు వాళ్ళ నాన్న నా మెడలో తాళి కట్టిన భర్త పండు ఆరోగ్యం మా అక్క భర్తతో మాట్లాడి బాగు చేయాలని నేను అనుకుంటే ఆయన తోటే నాకు బంధాన్ని ముడిపెట్టి నన్ను ఇలా బాధ పెడుతున్నావు ఎందుకు ఆయన మొదటి భార్య గురించి నాకు ఎందుకు చెప్పడం లేదు ఒకవేళ మా అక్కే తన మొదటి భార్యని సార్ కు తెలియదు కదా మరి నాకెందుకు చెప్పలేదు స్వామి నన్ను ఎందుకు ఇంత దారుణంగా మోసం చేశాడు చెప్పు అని ఏడుస్తుంది రాదా. నేను లంచ్ తీసుకు వస్తున్నాను అంటే నేను ఆఫీసులో లేను రాదా వేరే పని మీద బయటకు వెళ్లాను అని నాకు అబద్ధం చెప్పి తన భార్యతో బయటికి వెళ్లాడు అసలు ఆయన ఏమనుకుంటున్నాడు తన మొదటి భార్య నే తన జీవితంలోకి ఆహ్వానించాలి అనుకుంటున్నాడా ఒకవేళ తన భార్య గురించి నాకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడా అసలు నేను ఎలా రియాక్ట్ అవ్వాలి స్వామి నాకు ఏమీ అర్థం కావట్లేదు మా అక్కే నా భర్త మొదటి భార్య అని తెలిసిన నేను ఇప్పుడు ఏం చేయాలి ఎలా అర్థం చేసుకోవాలి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది రాదా.
ఇంతలో పూజారి గారు వచ్చి ఏంటమ్మా ఇంత పెద్దలడి గుడికి వచ్చావు కార్తీక మాసం కదా సాయంత్రం అయితే అందరూ దీపాలు పెట్టడానికి వస్తారు రష్ ఉంటుందని ఇప్పుడే వచ్చావా ధ్వజెస్తంభ0 దగ్గర దీపాలు వత్తులు ఉంటాయి వెళ్లి దీపాలు వెలిగించమ్మా అని పంతులుగారు అంటాడు. పంతులుగారు పూజ చేస్తారు సాయంత్రం అవుతుంది అందరూ వచ్చి దీపాలు వెలిగించి వెళ్ళిపోతారు. అమ్మ గుడి కూడా మూసేశాము ఇక మీరు బయలుదేరితే మంచిది అని పంతులుగారు కూడా వెళ్ళిపోతారు. కానీ రాధ మాత్రం ఏడుస్తూ బాధపడుతూ అక్కడే కూర్చుండిపోతుంది. కట్ చేస్తే, ఏంటి వదిన నువ్వు వంట చేస్తున్నావ్ మీ కోడలు ఇంట్లో లేదా అని దాక్షాయిని అంటుంది.
తను శ్యామ్ కి లంచ్ తీసుకెళ్ళింది ఇంకా రాలేదు అని మధుర చెప్తుంది.ఏంటి మధ్యాహ్నం లంచ్ తీసుకువెళ్లిన రాదా ఇంతవరకు ఇంటికి రాలేదా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని దాక్షాయిని అంటుంది. ఎవరికి చెప్పకుండా ఎటు వెళ్ళింది ఇది అనుమానించాల్సిన విషయమే అని చలపతి అంటాడు. ఏంటి అనుమానించాలి అంటున్నారు రాధా ఆఫీస్ కి వెళ్ళింది శ్యామ్ కి టైం దొరికిందేమో వాళ్ళిద్దరూ కలిసి బయటికి వెళ్లి ఉంటారు దానికి మీరు ఎందుకు పెద్ద గొడవ చేస్తున్నారు అని ధనంజయ్ అంటాడు. ఇంతలో శ్యామ్ వచ్చేస్తాడు. కట్ చేస్తే, రాదేది అని అడుగుతుంది మధుర. రాధా లంచ్ అక్కడ పెట్టేసి ఇంటికి వచ్చేసింది కదా అమ్మ అని శ్యామ్ అంటాడు.
మధ్యాహ్నం అనగా వెళ్లిన అమ్మాయి ఇంటికి ఇంకా రాలేదు నువ్వు రాదా బయటికి వెళ్లారేమో అనుకుంటున్నాము అని ధనంజయ్ అంటాడు. లేదు నాన్న నేను రావడానికి లేట్ అవుతుంది బాక్స్ అక్కడ పెట్టేసి వెళ్ళు రాదా అని చెప్పాను తను అప్పుడే బయలుదేరింది అని చక్రి చెప్పాడు అని శ్యామ్ అంటాడు. ఏంటి ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిందా ఇదేనా శ్యామ్ నీ భార్య పద్ధతులు దాక్షాయిని అంటుంది. అత్తయ్య రాధ గురించి ఏం తెలుసు అని నువ్వు అలా మాట్లాడుతున్నావ్ తనంత బాధ్యతగా ఉంటుందో నీకు తెలుసా అని శ్యామ్ కోపంగా అంటాడు. నేను కూడా అప్పుడప్పుడు అమ్మకు చెప్పకుండా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను అలాగే అమ్మ కూడా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందేమో అని పండు అంటాడు.
శ్యామ్ రాధ కి ఫోన్ చేస్తాడు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందమ్మా అని శ్యామ్ అంటాడు. చార్జింగ్ అయిపోయింది ఏమోరా టెన్షన్ పడకు అని మధుర అంటుంది. రాధ వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్ అందరి నా దగ్గర ఉన్నాయి నేను వాళ్లకి ఫోన్ చేస్తాను అని శ్యామ్ అంటాడు. కట్ చేస్తే,ఏంటి రుక్మి అలా ఉన్నావ్ అని మురళి అంటాడు. ఏమీ లేదు నాన్న మీ అల్లుడు గారితో గొడవ అయింది అని రుక్మిణి అంటుంది.ఏ గొడవ అయింది అమ్మ అల్లుడికి నీకు అని నాగమణి అడుగుతుంది. ఇంకేముంటుంది అమ్మ తన రెండో భార్య విషయంలో నాకు ఆయనకి గొడవ అయింది అని రుక్మిణి అంటుంది.. దీనితో ఈరోజుఎపిసోడ్ ముగుస్తుంది
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!