Madhuranagarilo: తనని ఎంత అడిగినా మా బాబు గురించి చెప్పడం లేదు రుక్మిణి ఆఫీస్ అయిపోయాక ఇంటికి వెళ్తుంది కదా తనను ఫాలో అయ్యి బాబును చూడాలి తన అడ్రస్ ఎక్కడో తెలుసుకోవాలి అని శ్యామ్ ఆలోచిస్తాడు. ఇంతలో సాయంత్రం అయితుంది రుక్మిణి వచ్చి సార్ నన్ను బస్టాప్ దగ్గర డ్రాప్ చేయండి అని అడుగుతుంది. నాకు వేరే వర్క్ ఉంది నువ్వు వెళ్ళు అని శ్యామ్ అంటాడు. నాకన్నా ఎక్కువ ఏం వర్క్ ఉంది అని రుక్మిణి అంటుంది. ప్లీజ్ అర్థం చేసుకో ఈరోజు ఆఫీస్ వరకు చాలా ఉంది నువ్వు వెళ్ళు అని శ్యామ్ అంటాడు. సరే ఆటో బుక్ చేసుకుని వెళ్తాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అని వెళ్ళిపోతుంది రుక్మిణి. శ్యామ్ తన వెనుక అలా ఫాలో అవుతాడు. రుక్మిణి ఆటో తీసుకొని బస్ స్టాప్ దగ్గరికి వెళుతుంది. శ్యామ్ ఆ బస్టాప్ దగ్గరే కార్ ఆపుకొని ఏ బస్సు ఎక్కుతుంది అని ఎదురు చూస్తూ ఉంటాడు.
కొద్దిసేపు నిలబడగానే తనకి ఫోన్ వస్తుంది శ్యామ్ ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంతలో రుక్మిణి ఎటో వెళ్లిపోతుంది ఫోన్ మాట్లాడి బస్టాప్ వ0కా చూస్తే శ్యామ్ కి అనిపించదు ఎటు వెళ్ళింది అని బస్టాప్ అంతా వెతుకుతాడు కానీ ఎక్కడ కనిపించదు రుక్మిణి మిస్ అయిపోయింది అని ఇంటికి వెళ్ళిపోతాడు శ్యామ్. కట్ చేస్తే, పండు సిరి హోమ్ వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇంతలో ధనంజయ్ ఇంటికి డబ్బులు తీసుకొని వస్తాడు. మా డాడీ వచ్చాడు అని పండు అంటాడు. మా డాడీ వస్తాడు అనుకుంటే మా డాడీ వాళ్ళ డాడీ వచ్చాడు అని పండు నీరసపడిపోతాడు. మధుర మనల్ని ఒక అతను లక్ష రూపాయలు హెల్ప్ అడిగాడు కదా బ్యాంక్ నుంచి డ్రా చేసుకోవచ్చు లోపల పెట్టు అని ధనంజయ్ అంటాడు.
పండుకు మందు ఇచ్చే పనిలో ఉన్నానండి మీరు వెళ్లి పెట్టుకోండి అని మధుర అంటుంది.సరే అని ధనంజయ వెళ్లి తన రూమ్లో డబ్బులు పెట్టి బీరువాకు తాళం వేసి మెత్త కింద తాళం చేతులు పెడతాడు. ఆ లక్ష రూపాయలు దాచడం చలపతి దాక్షాయిని చూస్తారు. పండు దగ్గరికి వెళ్లి మందు తాగు నాన్న అని అంటుంది మధుర. సరే ఇవ్వు నాని అని మందు తీసుకొని పండు పక్కన పెడతాడు. మంచినీళ్లు తెచ్చావా నాని అని పండు అడుగుతాడు.
తెలేదు నాన్న తెస్తాను ఉండు అని మధుర వెళుతుంది. అక్క నాకు టాయిలెట్ వస్తుంది అని పండు వెళ్లి మందు పారబోసి వచ్చి మల్లి సైలెంట్ గా కూర్చుంటాడు. అది చూసిన రాదా వచ్చి పండు మందు తాగావా అని అడుగుతుంది రాదా. తాగేసానమ్మ అని పండు అంటాడు. నిజంగానే మందు తాగాడు వదిన అని సిరి అంటుంది. ఏమో పారబోసి ఏమైనా అబద్ధం చెప్తున్నాడేమో అని రాదా అంటుంది. కట్ చేస్తే,ఇంతలో శ్యామ్ వస్తాడు. మా డాడీ వచ్చాడు అంటూ పండు శ్యామ్ దగ్గరికి వెళ్తాడు. శ్యామ్ ని చూసిన రాధా కోపంతో పండుని ఏంట్రా పండు మందు తాగమంటే నాకే అబద్ధం చెప్తున్నావా అని అంటుంది. లేదమ్మా నేను నిజంగానే తాగాను అని పండు అంటాడు. వాడు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది రాదా అని శ్యామ్ అంటాడు. వాడు మందు పారపడం నా కళ్ళతో నేను చూశాను వెళ్లడంత లేడు వీడు ఇప్పుడే అబద్ధాలు చెప్తే పెద్దయ్యాక ఎన్ని అబద్ధాలు చెప్తాడు పెళ్లి చేసుకున్నాక భార్యని అన్ని అబద్ధాలతో మోసం చేస్తాడు మనం అంటే ఇష్టపడే వాళ్ళు మనల్ని మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించే వాళ్లకే తెలుస్తుంది అని రాదా అంటుంది.
సారీ అమ్మా ఇంకెప్పుడు అబద్ధం చెప్పను అని పండు అంటాడు. రాధా కోపంతో పైకి వెళ్ళిపోతుంది. రాధకి నేను అబద్ధం చెప్పానని తెలిసిపోయిందా నిజం తెలిస్తే తను ఏమనుకుంటుంది అని శ్యామ్ ఆలోచిస్తాడు. సిరి గురించి మధుర కి తెలిస్తే మధుర ఏమైపోతుంది అని ధనంజయ్ ఆలోచిస్తాడు. నాని నేను ఇంకెప్పుడు అమ్మకు అబద్దం చెప్పను నాని అని పండు ఏడుస్తాడు.ఊరుకో నాన్న అని మధుర ఊరుకోపెడుతుంది. కట్ చేస్తే, ఇంతలో నైట్ అయిపోయింది అందరూ నిద్రపోతారు. ఇంతలో చలపతికి అప్పిచ్చిన అతను ఫోన్ చేస్తాడు చలపతికి. ఆ నెంబర్ చూసి రెండు మూడు సార్లు ఫోన్ కట్ చేసి పడుకుంటాడు చలపతి.
మళ్లీ ఫోన్ రింగ్ అవ్వడంతో ఏంటండీ ఫోన్ ఎత్తడానికి భయపడుతున్నారు రెండో సెటప్ ని ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా ఏంటి అని దాక్షాయిని అంటుంది. కాదే నా మొగుడు వింటావా అని చలపతి ఫోన్ ఎత్తి స్పీకర్ పెడతాడు. ఏమయ్యా చలపతి నాకు ఇచ్చే 50,000 రేపు ఇవ్వకపోతే పోలీస్ కేసు పెడతాను గుర్తుంది కదా అని అతను అంటాడు. గుర్తుండండి ఇస్తాను రేపు కచ్చితంగా అని చలపతి ఫోన్ కట్ చేస్తా. చూసావా నేను అబద్ధం చెప్పలేదే వాడు నా మొగుడు అని చలపతి అంటాడు. మరి నా మొగుడు పరిస్థితి ఏంటి రేపు కేసు పెడతాను డబ్బులు కట్టకపోతే అంటున్నాడు అని దాక్షాయిని అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!