Madhuranagarilo December 27 2023 Episode 246: ఇప్పుడు ఏం చేద్దాం అని దాక్షాయిని అంటుంది. అదే నాకు అర్థం కావట్లేదు దాక్షాయిని ఒక ప్లాన్ చేద్దాం మీ అన్నయ్య ఎలాగూ లక్ష రూపాయలు తెచ్చి బీరువాలో పెట్టాడు కదా వాటిని కొట్టేసి నా అప్పు తీర్చేద్దాం నీకు పటు చీర కూడా కొనొచ్చు అని చలపతి అంటాడు. చెయ్యొచ్చు కానీ దొరికిపోతే ఎలా అప్పుడు ఈ కాస్త నీడ కూడా ఉండదు మనం రోడ్డు మీద పడాల్సి ఉంటుంది అని దాక్షాయిని అంటుంది. ఎవ్వరు చూడకుండా వెళ్లి కొట్టేద్దాం దాక్షాయిని మీ అన్నయ్య మీ వదిన గాఢమైన నిద్రలో ఉన్నారు మనం డబ్బులు కొట్టేసే టైం అయింది పద వెళ్దాం అని చలపతి అంటాడు. కట్ చేస్తే, చలపతి దాక్షాయిని మధుర ధనుంజయ్ పండుకున్న రూమ్ లోకి వస్తారు వాళ్లు గాఢమైన నిద్రలో ఉన్నారని తెలుసుకొని మెత్త కింద తాళం ఉంటే తీయబోతాడు చలపతి అప్పుడు మధుర కొంచెం అటు ఇటు మెసులుతుంది. వెంటనే దాక్షాయిని చలపతి దాక్కుంటారు.
మళ్లీ మధుర నిద్రపోగానే చలపతి తన మెత్త కింద చేయి పెట్టి మెల్లగా తాళం తీస్తాడు. ఏమండీ తాళం దొరికింది కదా బీరువా తాళం ఓపెన్ చేయండి అని దాక్షాయిని అంటుంది. చలపతి బీరువా తాళం ఓపెన్ చేసి డబ్బులు తీసుకుంటాడు.అప్పుడు ధనుంజయ్ కొంచెం అటు ఇటు మెసులుతాడు. మధురకు దగ్గు వచ్చి టక్కన లేచి మంచినీళ్లు తాగుతుంది. ఏక్కడ మధుర చూస్తుందోనని మంచం చాటుకు వెళ్లి దాక్కుంటారు చలపతి దక్షయని. మధుర మంచినీళ్లు తాగి మళ్లీ వచ్చి నిద్రపోతుంది. చలపతి మళ్లీ మెత్త కింద తాళం పెట్టి బయటికి వెళ్లిపోతారు. కట్ చేస్తే, బయట ఎవరైనా ఉన్నారా అని అటు ఇటు చూస్తారు అప్పుడే మంచినీళ్ల కోసం మెట్లు దిగుతూ ఉండగా రాదా కనిపిస్తుంది రాదను చూసి మళ్లీ దాక్కుంటారు చలపతి దాక్షాయిని. రాధా కిచెన్ లోకి వెళ్లి మంచినీళ్లు పోసుకొని పైకి వెళ్ళిపోతుంది. మెల్లగా పిల్లుల్లాగా నడుచుకుంటూ వచ్చి అటు ఇటు చూసి ఎవరూ లేరని తన గదిలోకి వెళ్ళిపోతారు.
దాక్షాయిని ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినంత పని అయింది ఎక్కడ దొరికిపోతామో అనుకున్నాను అని చలపతి అంటాడు. నీకే కాదండి నాకైతే గుండె ఆగిపోయింది ఆ క్షణంలో ఏం చేయాలో అర్థం కాలేదు కొంచెం అయితే వదిన చూసేది మనల్ని దాక్షాయిని అని అంటుంది. ఏదైతేనేం దాక్షాయిని లక్ష రూపాయలు వచ్చేసాయి అప్పు తీరు చేయొచ్చు నీకు బట్టలు కొనవచ్చు అని చలపతి అంటాడు. ఇప్పుడైనా హాయిగా నిద్రపోండి అని దాక్షాయిని పడుకుంటుంది. కట్ చేస్తే, నిన్న పండు గురించి అడిగితే నేను వాడిని చూపెట్టనని అన్నాను పాపం సుందరం ఫీల్ అయినట్టున్నాడు పండు అడ్రస్సు చెప్పకుండా వాడి ఫోటో చూపెడితే కాస్తంత సంతోషిస్తాడు అని రుక్మిణి అనుకుంటుంది. శ్యామ్ కి ఫోన్ చేసి చెప్పాలని ఫోన్ చేస్తుంది రుక్మిణి కానీ శ్యామ్ ఫోను ఎత్తకపోఎ సరికి సర్లే ఆఫీస్ కి వచ్చాక చెబుదాము అని అనుకుంటుంది రుక్మిణి. ఏవండీ ఈ టాబ్లెట్ వేసుకోండి అని నాగమణి అంటుంది. ఇంకా ఈ టాబ్లెట్లతో ఎన్నాళ్లు బ్రతకాలి నాగమణి చచ్చిపోయిన బాగుండు అని మురళి అంటాడు. అవేం మాటలు అండి పొద్దు పొద్దున్నే ఎలా మాట్లాడుతారు అని నాగమణి అంటుంది.
మీ మనోవేదన ఏంటో నాకు అర్థమైంది నాన్న త్వరలోనే నేను మీ అల్లుడు కలిసి ఉంటాము నీ బాధంతా నేను మీ అల్లుడికి దూరంగా ఉంటున్నాను అనే కదా త్వరలోనే రెండో భార్యకి విడాకులు ఇస్తాడు నేను ఆయన కలిసి ఉంటాం అప్పుడు మీరు సంతోషిద్దురు అని రుక్మిణి వెళ్లిపోతుంది. ఏంటండీ రాధకి అల్లుడు గారు విడాకులు ఇచ్చేసి రుక్మిణి తో కలిసి ఉంటాడా అని నాగమణి అంటుంది. పెద్ద కూతురికి విడాకులు ఇచ్చి చిన్న కూతురుతో ఉన్న చిన్న కూతురుకి విడాకులు ఇచ్చి పెద్ద కూతురుతో ఉన్న మన ఇద్దరు కూతుర్లు ఒక కూతురు బతుకు అన్యాయం అయిపోతుంది నాగమణి మనం ఇలాగే బాధపడుతూ ఉండాలి అని మురళి అంటాడు. ఇప్పుడు ఏం చేయాలండి అని నాగమణి అంటుంది. కట్ చేస్తే, రాధా పూజ కోసం పూలు తెంపుతూ ఉంటుంది. రాధా ఏంటమ్మా అలా నీరసంగా ఉన్నావు అని మధుర అడుగుతుంది. నిన్న శనివారం కదా అత్తయ్య అందుకే నీరసంగా ఉన్నాను పూజ చేసుకొని టిఫిన్ చేసి తింటాను అని రాధా అంటుంది.
ఏం పర్వాలేదు అమ్మ నువ్వు పూజ చేసుకో నేను టిఫిన్ రెడీ చేస్తాను అని మధుర అంటుంది. రాధ వెళ్లి దేవుడికి పూజ చేస్తుంది. మధుర టిఫిన్ రెడీ చేస్తుంది. రాధా నీ పూజ అయిపోయింది కదా వెళ్లి శ్యామ్ ని తీసుకురా నైట్ వాడు కూడా సరిగ్గా తినలేదు అని మధుర అంటుంది. అలాగే అని రాధా పైకి వెళ్లి శ్యామ్ ని లేపుతుంది. తను ఎంత పిలిచిన లేవకపోయేసరికి చేయి పెట్టి చూస్తే జ్వరం వచినట్టు అని పిస్తుంది. వెంటనే రాధా వాళ్ళ అత్తయ్యని మామయ్యని పిలుస్తుంది. ఏంటి రాధా అని గబగబా మధుర వచ్చి అడుగుతుంది. ఆయనకి హై టెంపరేజర్ వచ్చిందా అత్తయ్య మూసిన కళ్ళు తెరవట్లేదు అని రాదా కంగారు పడుతూ ఉంటుంది. మధుర శ్యామ్ వంటి మీద చేయి పెట్టి చూసి అయ్యో జ్వరం వచ్చింది ఏమండీ డాక్టర్ గారికి ఫోన్ చేయండి అని అంటుంది.
ధనంజయ డాక్టర్ కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాడు. డాక్టర్ గారు వచ్చి చూసి ఏం పర్వాలేదండి హై టెంపరేజర్ అవడంతో మూసిన కళ్ళు తెరవట్లేదు రేపటి లోపు నార్మల్ అయిపోతాడు అప్పటిదాకా నేను టాబ్లెట్లు ఇస్తాను అవి నాలుగు గంటలకు ఒకసారి వేయండి నర్సిని పంపిస్తాను ఇండిసన్ వేస్తుంది అని డాక్టర్ చెప్తుంది. మేడం మా వాడికి ప్రాబ్లం ఏమి అవ్వదు కదా అని మధుర అడుగుతుంది. ఏం భయపడాల్సిన పని లేదండి ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు వెంటనే ఫోన్ చేయండి హాస్పిటల్ కి వెళ్దాం అని డాక్టర్ అంటుంది. జ్వరం తగ్గేదాకా ఒళ్లంతా తడిబట్టతో తుడుస్తూ ఉండండి ఒకవేళ చలిగా అనిపిస్తే తుడవడం ఆపేయండి నేను వెళ్లి నర్స్ ని పంపిస్తాను అని డాక్టర్ వెళ్ళిపోతుంది. శ్యామ్ కి జ్వరం రావడంతో రాదా భయపడిపోతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!