Madhuranagarilo December 29 2023 Episode 248: ఎవరో అన్నారని నువ్వు హాస్టల్ కి వెళ్లవలసిన అవసరం ఏముందమ్మ ఇది నీ ఇళ్లు అనుకో నువ్వు ఇక్కడే ఉండాలి అని ధనంజయ్ అంటాడు. అవునమ్మా వాలేదొ అన్నారని నువ్వు బాధపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు ఇక్కడే ఉండు అని మధుర అంటుంది. చూడు సిరి నువ్వు ఇప్పుడు నిజంగానే హాస్టల్ కి వెళ్తే నువ్వే దొంగతనం చేసావని నేరం మోపుతారు అలా జరగకూడదు అంటే నువ్వు ఇక్కడే ఉండాలి దొంగతనం చేసింది ఎవరో తెలుసుకుంటాను ఇంతవరకు ఎన్నడు ఈ ఇంట్లో దొంగతనాలు జరగలేదు ఇకమీదట దొంగతనం జరగకుండా చూసుకుంటాను దొంగలు ఎవరో పట్టుకుంటాను అని రాదా అంటుంది. అవునవును దొంగలు ఎవరో తెలియాలి పట్టుకోవాలి అని చలపతి దాక్షాయిని అంటారు.
మామయ్య గారు నేను కొంచెం బయటికి వెళ్లి వస్తాను ఆయనని చూస్తూ ఉండండి అని రాధా వాళ్ళ అక్క చెప్పిన గుడి దగ్గరికి వెళుతుంది. కట్ చేస్తే ఇంతలో రుక్మిణి గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటక్కా రమ్మన్నావ్ ఏంటి అని అడుగుతుంది రాదా. అది సరే రాధా నేను చెప్తాను కానీ నువ్వు ఎందుకు అంత డల్ గా ఉన్నావ్ ఏమైంది ఒంట్లో బాగోలేదా అని రుక్మిణి అడుగుతుంది. ఏమీ లేదు అక్క మా ఆయనకి జ్వరం వచ్చింది అని రాధా అంటుంది. అవునా మీ ఆయనకు జ్వరం వచ్చిందని నువ్వు డల్ గా ఉన్నావా అని రుక్మిణి అంటుంది. అవును కానీ నువ్వు ఎందుకు రమ్మన్నావో చెప్పు అని రాదా అడుగుతుంది.
ఏమీ లేదు రాదా మా ఆయన పండు కి దగ్గర అవ్వాలనుకుంటున్నాడే కానీ నాకు దగ్గర అవ్వాలనుకోవట్లేదు నన్ను అవాయిడ్ చేస్తున్నాడు ఆఫీస్ కి రాలేదు నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఆయన అడ్రస్ తెలుసుకొని ఇంటికి వెళ్లి గల పట్టుకుని నన్నెందుకు మోసం చేసావని నడివీధిలోకి ఏడుస్తాను అని రుక్మిణి అంటుంది.
ఆ పక్క ఏం మాట్లాడుతున్నావ్ అయినా ఫోన్ ఎత్తనంత మాత్రాన ఆఫీస్ కి రానంత మాత్రాన ఆయనని తప్పుగా అర్థం చేసుకుంటావా ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయని అర్థం చేసుకోవచ్చు కదా మీరు పెళ్లయిన నెల రోజులకే నువ్వు దూరం అయిపోయావు ఆ తర్వాత నువ్వు నెల తప్పవని నీకు మాత్రమే తెలుసు మీ ఆయనకు తెలియదు కదా మేము నువ్వు చనిపోయామని ఎలా అనుకున్నామో ఆయన కూడా అలాగే అనుకోని ఉండొచ్చు కదా అందుకే రెండో పెళ్లి చేసుకోవచ్చు కదా దానికి నువ్వు ఎందుకు ఆయనని అపార్థం చేసుకుంటావు ఇలాగే ఆవేశపడి అప్పుడు ఆయనను దూరం చేసుకున్నాం ఇప్పుడు కూడా ఆవేశ పడి దూరం చేసుకోకు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్ ఫోన్ ఎత్తకుండా ఆఫీసుకు రాకుండా ఉన్నంత మాత్రాన మోసం చేస్తున్నాడు అని అనుకోకు అని రాదా అంటుంది. అలాగే రాధా నువ్వు ఇంత క్లాస్ పీకిన తర్వాత నేనెందుకు అపార్థం చేసుకుంటాను అని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, రుక్మిణి టిఫిన్ పెట్టమంటావా అని నాగమణి అడుగుతుంది.
ఏం ఆలోచిస్తున్నారు అని నాగమణి అడుగుతుంది. ఏమీ లేదమ్మా మా ఆయన గురించి ఆలోచిస్తున్నాను ఈరోజు ఆఫీస్ కి రాలేదు ఫోన్ ఎత్తలేదు అందుకని నేను రాధకు ఫోన్ చేసి రమ్మంటే వచ్చింది నాకే గ్లాస్ పీకి వెళ్ళింది బహుశా వాళ్ళ ఆయనకి ఒంట్లో బాగోలేదు అంట అందుకే అంత కోపంగా ఉండి ఉంటుంది అని రుక్మిణి అంటుంది. ఏమైందంట అమ్మ అల్లుడు గారికి అని నాగమణి అడుగుతుంది. జ్వరం వచ్చిందంటమ్మా డాక్టర్ గారు వచ్చి టాబ్లెట్ ఇచ్చారంట ఇప్పుడు నార్మల్ ఉందంట అని రుక్మిణి చెప్తుంది. సర్లే టిఫిన్ పెట్టు అని రుక్మిణి అంటుంది. ఏంటండీ రాధ వాళ్ళ ఆయన ఎలా ఉన్నాడో ఏమో అని నాగమణి అంటుంది. ఏమీ కాదులే నాగమణి హాస్పిటల్ తీసుకువెళ్తారు అంతకైతే అని మురళి అంటాడు.కట్ చేస్తే,శ్యామ్ కి ఇంకా జ్వరం తగ్గలేదు మధురా ధనంజయ్ అక్కడే కూర్చుని బాధపడుతూ ఉంటారు. పండు ఇప్పటికే లేట్ అయిపోయింది నువ్వు వెళ్లి అన్నం తిని పడుకో నాన్న అని రాదా అంటుంది.
అమ్మ నాకు అన్నం వద్దు డాడీ కి జ్వరం ఎప్పుడు తక్కువ అవుతుంది నన్ను రేపు స్కూల్ కి తీసుకువెళ్తాడా అని పండు. పండు జ్వరం తగ్గిన సరే నీరసంగా ఉంటుంది నాన్న రెండు రోజుల దాకా డాడీ ఎక్కడికి రాడు మీ తాతయ్య స్కూల్ తీసుకెళ్తాడు లే అని మధుర అంటుంది. అత్తయ్య మీరు వెళ్లి అన్నం తినండి నేను ఆయనను చూసుకుంటాను అని రాదా అంటుంది. మరి నువ్వు అన్నం తినవా అమ్మ అని ధనంజయ్ అంటాడు. ఆయనకు మజ్జిగ తాపించిన తర్వాత తింటాను మామయ్య గారు మీరు వెళ్ళండి అని రాదా అంటుంది. శ్యామ్ కి మజ్జిగ తాపిచ్చి పడుకోబెట్టి పక్కనే కూర్చుంటుంది రాదా. అర్థం చేసుకునే భార్య దొరకడం శ్యామ్ అదృష్టం మధుర అని ధనంజయ్ అంటాడు. శ్యామ్ కి తడి బట్ట వేస్తూ ఒళ్లంతా తుడిచి టవల్ తల మీద పెడుతుంది రాదా. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!