Madhuranagarilo January 10 2024 Episode 258: రాధా ఎంటో నా బ్రతుకు ఇలా తగలడింది అని రుక్మిణి అంటుంది. ఎందుకక్కా అలా అంటున్నావ్ అని రాధా అడుగుతుంది. మికు ఎవరికీ చెప్పకుండా ఏడేళ్ల క్రితం వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నాను మళ్లీ ఈ నాలకు తిరిగి వచ్చి నా భర్త నాకు కావాలని ఆరాటపడుతున్నాను కానీ ఆయన మనసులో ఏముందో ఈ రోజే నాకు అర్థం అయింది అని రుక్మిణి అంటుంది. ఏముంది అక్క బావ మనసులో అని రాదా అడుగుతుంది. పండు కి దగ్గర కావాలని చూస్తున్నాడే కానీ నన్ను వదిలేస్తాడంట నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు అంత ఇచ్చేస్తాను నా కొడుకును నాకు ఇచ్చేయ్ అంటున్నాడు అంతేకానీ రెండో భార్యకు విడాకులు ఇవ్వడంట నా కొడుకుని తీసుకువెళ్లి ఆ రెండో భార్య చేతిలో పెడతాడు అంట అలా చేస్తే వాడిని ఊరికే వదిలిపెట్టను అని రుక్మిణి అంటుంది. ఊరుకోక ఏం చేస్తావ్ అక్క అని రాదా అడుగుతుంది.
ఏముంది పండుని తీసుకుని వాళ్ళ ఇంటి ముందు కూర్చొని నిరాహార దీక్ష చేస్తాను అప్పుడు మిడియా వాళ్ళకి తెలుస్తుంది వాడి పరువు అంతా పోతుంది అని రుక్మిణి అంటుంది. అక్క ఇలాంటి విషయాలు తొందరపడి అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు బాగా ఆలోచించి ఏం చేయాలో నేను చెప్తాను అప్పటిదాకా నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు అని రాధా అంటుంది. అలాగే రాధా నువ్వు చెప్పినట్టే చేద్దాం ఏం చేయాలో చెప్పు ఆ తర్వాత ఆలోచిద్దాం అని రుక్మిణి అంటుంది. ఆయన అక్కతో అలా ఎందుకు గొడవ పడుతున్నాడు అక్క ఇంకా కోపం తెచ్చుకొని ఇలాంటిదే ఏదైనా చేస్తే ప్రాబ్లం అయిపోతుంది ఆయనతో మాట్లాడాలి అని రాదా అనుకుంటుంది. కట్ చేస్తే, ఈయన బయటికి వెళ్లాడు ఇంకా రాలేదేంటి అప్పుల వాళ్ళు ఎవరైనా పట్టేశారా అని దాక్షాయిని అనుకుంటుంది. ఇంతలో చలపతి వస్తాడు నా కోసమే ఎదురు చూస్తున్నావా దాక్షాయిని నీకు మంచి న్యూస్ తెచ్చాను అని చలపతి అంటాడు. ఏంటండీ అది అని దాక్షాయని అంటుంది. మీ అన్నయ్య ఒక అనాధ పిల్లను దత్తత తీసుకొని డబ్బులు పోసి చదివిస్తున్నాడంట అని చలపతి అంటాడు. మా అన్నయ్య డబ్బులు తో వేరే పిల్లను చదివిస్తే మీకేంటంటే ప్రాబ్లం అని దాక్షాయిని అంటుంది.
అది కాదే పిచ్చి మొహం దాన మీ అన్నయ్య చదివించే అమ్మాయి పేరు శిరీష మన ఇంట్లో ఉండే అమ్మాయి పేరు శిరీష ఒకవేళ ఇద్దరు ఒకటేనేమో అని చలపతి అంటాడు. మనం ముందే అనుకొని అన్నయ్య ని అడిగితే కోప్పడతాడు అని దాక్షాయని శిరీష ని పిలిచి నువ్వు ఏ పని చేసి ఇక్కడ దాకా చదువుకున్నావ్ అమ్మ నీకు ఎవరూ లేరని చెప్పావు కదా అని అడుగుతుంది. లేదండి నన్ను ఒక మహానుభావుడు చదివించాడు ఆయన పేరు కూడా నాకు తెలియదు అని శిరీష చెప్తుంది. ఆ మాట వినగానే దాక్షాయిని చలపతి అంటే ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఒకటే అయి ఉంటారు అని అనుకుంటారు. ఏవండీ ఈ అమ్మాయిని చదివించిన మేడ ని పట్టుకొని శిరీష ఫోటో చూపించి అడిగితే నిజం తెలుస్తుంది అని దాక్షాయిని అంటుంది. ఆ పని నేను కూడా చేశాను కానీ ఆవిడను పట్టుకుందామనుకునే లోపు మాయమైపోయింది అని చలపతి అంటాడు. కట్ చేస్తే, ఏంట్రా ఇలా తాగి వచ్చి రోజు ఇంటికి వెళ్తే రాదా ఎంత బాధ పడుతుందో తెలుసా అని కిరణ్ అంటాడు. ఏం చేయమంటావురా మరి రుక్మిణిని వదిలించుకోలేక రాధకి దగ్గర కాలేక ఎంత బాధ పడుతున్నానో నీకేం తెలుసు రుక్మిణి నాకు పెట్టే టార్చర్ తట్టుకోలేక తాగుతున్నాను రా అని శ్యామ్ అంటాడు.
అలాగని నువ్వు ఇష్టపడే రాదని బాధ పెడతావా రా నువ్వు ఇలా చేస్తే రాదా నిజంగానే దూరమైపోతుంది అందుకని ఈరోజు నుంచి తాగుడు మానేయ్ అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. అలాగే రా ఈ ఒక్క రోజే తాగుతాను ఇకమీదట తాగి వెళ్లి రాదని ఎప్పుడు బాధ పెట్టను తనను దూరం చేసుకోను అని శ్యామ్ అంటాడు. కట్ చేస్తే, మమ్మీ డాడీ ఇంకా రాలేదేంటి ఎక్కడికి వెళ్ళాడు ఎప్పుడు నాతో ఆడుకోవట్లేదు ఈమధ్య మొన్న కూడా సినిమాకు తీసుకు వెళ్తానని తీసుకు వెళ్లలేదు అని పండు అంటాడు. ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల డాడీ నీకు సమయాన్ని కేటాయించలేకపోతున్నాడు పండు కొన్ని రోజుల తర్వాత మళ్లీ నీతో హ్యాపీగా ఆడుకుంటాడు లే అని రాదా అంటుంది.
అవును డాడీ వర్క్ లో పడి నేను పట్టించుకోవట్లేదు నీకన్నా డాడీకి ఎక్కువేముందిరా అని మధుర ఉంటుంది. అయితే నేను వెంటనే డాడీ తో మాట్లాడాలి ఫోన్ చెయ్ అమ్మ అని పండు అంటాడు. లేదు పండు ఇప్పుడు ఫోన్ చేస్తే మీ డాడీ బిజీలో ఉంటాడు తర్వాత చేస్తాను లే అని రాధా అంటుంది. డాడీ ఎంత బిజీగా ఉన్నా పండు ఫోన్ చేశాడని చెప్పు మాట్లాడుతాడు అని పండు అంటాడు. ఏంటమ్మా రాదా పండు అంతలా అంటుంటే ఫోన్ చేయవేంటి మి మధ్య ఏమన్నా గొడవలు ఉన్నాయా అని దాక్షాయిని అంటుంది.
అలాంటిదేమీ లేదు పిన్ని అని రాదా శ్యామ్ కి ఫోన్ చేస్తుంది కాని ఫోన్ ఎత్తడు ఏమైంది ఆయన ఫోన్ ఎత్తట్లేదు అని రాధా అనుకుంటుంది. పండు మీ డాడీ తో ఆడుకోకపోతే ఏంట్రా మేమున్నాంగా మతో ఆడుకుందువు రా అని మధుర అంటుంది. ఏమండీ మనం రాధకి శ్యామ్ కి మధ్య ఉన్న గొడవలు క్యాష్ చేసుకోవాలి అని దాక్షాయిని అంటుంది. అసలేంటి సార్ ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు అక్కతో ఏమైనా గొడవపడ్డాడా అని రాధా రుక్మిణికి ఫోన్ చేయాలి అనుకుంటుంది. అక్కకి ఫోన్ చేస్తే అక్కతో గొడవపడ్డాడో లేదో తెలుస్తుంది అని రాదా అనుకుంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!