Madhuranagarilo January 12 2024 Episode 260: ఓకే తన అడ్రస్ నాకు తెచ్చి ఇవ్వవా అని రుక్మిణి అడుగుతుంది. సరే ఉండు తెస్తాను అని జ్యోతి వెళ్లి ఫైల్ వెతుకుతూ ఉండగా ఎస్సై గారు వచ్చి ఏం వెతుకుతున్నావు జ్యోతి అని అడుగుతాడు. ఇందాక ఒక అమ్మాయి వచ్చి తన భర్తని తీసుకు వెళ్ళింది కదా ఆ అడ్రస్సు ఒక ఆవిడ అడిగింది ఇద్దామని వెతుకుతున్నాను అని జ్యోతి అంటుంది. అలా ఒకరి అడ్రస్ ఒకరికి ఇవ్వడం కుదరదు వెళ్లి చెప్పు అని ఎస్ఐ అంటాడు. జ్యోతి వెళ్లి ఎస్ఐ గారు వద్దన్నారు అని చెప్తుంది. సరే మీ సార్ లేనప్పుడు అడ్రస్ వెతికి నాకు మెసేజ్ చెయ్ అని రుక్మిణి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, ఏంటండీ ఇంకా అమ్మాయి ఇంటికి రాలేదు ఇంత లేట్ అయింది అని నాగమణి అంటుంది. ఏమో నాకేం తెలుసు ఏమైనా మళ్లీ అల్లుడుతో గొడవ పడుతుందేమో అని మురళి అంటాడు.
ఇంతలో రుక్మిణి రాని వస్తుంది ఏంటమ్మా రుక్మిణి ఇ0తసేపు ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది. మీ అల్లుడుగారు తాగి యాక్సిడెంట్ చేస్తే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళానమ్మ అని రుక్మిణి చెబుతుంది. అవునా అల్లుడుగారు యాక్సిడెంట్ చేశారా ఎవరికి ఏమన్నా అయిందా అల్లుడికి ఏమైనా అయిందా అని నాగమణి టెన్షన్ పడుతూ అడుగుతుంది. ఏమీ కాలేదు అమ్మ అని రుక్మిణి చిరాకుగా అంటుంది. సరే అల్లుడు గారిని ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చావా అమ్మ అని మురళి అంటాడు. లేదు నాన్న నేను స్టేషన్ కి వెళ్లేసరికి తన రెండో భార్య వచ్చి తీసుకు వెళ్ళింది అని రుక్మిణి చెప్తుంది. అవునా అయితే అల్లుడి రెండో భార్య నువ్వు చూసావా అని మురళి అంటాడు. లేదు నాన్న నేను వెళ్లేసరికి వెళ్లిపోయింది అక్కడే దాన్ని నిలబెట్టి అడిగేసేదాన్ని అని రుక్మిణి అంటుంది. రాదని చూడలేదన్నమాట అని నాగమణి మురళి అనుకుంటారు. కట్ చేస్తే, ఇంతసేపు అయింది పది నిమిషాల్లో వస్తాను అని నీ కోడలు వెళ్ళింది అన్నయ్య ఇంకా రాలేదు నీ కొడుకు కూడా రాలేదు ఏమై ఉంటుంది అని దాక్షాయిని అంటుంది.
దాక్షాయిని నువ్వు టెన్షన్ పడుతూ మమ్మల్ని టెన్షన్ పెట్టకు అని ధనంజయ్ అంటాడు. ఏంటి అన్నయ్య అంతలా కోప్పడతావ్ నేనేమన్నానని ఇంతవరకు ఆఫీస్ నుంచి అల్లుడు ఇంటికి రాలేదు అల్లుడు కోసం వెళ్ళినా రాధా ఇంటికి రాలేదు వాళ్ళకి ఏం జరిగిందని నేను బాధపడుతున్నాను అని దాక్షాయిని అంటుంది.ఇంతలో రాధ శ్యామ్ ని తీసుకొని వస్తుంది. అబ్బో అల్లుడు నా అలాగే తాగుబోతు అన్నమాట అందుకే ఇంత లేట్ అయింది అని చలపతి అంటాడు. ఏంటి రాధా శ్యామ్ ని తీసుకురావడానికి ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు అని మధుర అడుగుతుంది. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లాను అత్తయ్య అని రాదా చెప్తుంది. పోలీస్ స్టేషన్ కా ఏమైందమ్మా అని ధనంజయ్ అంటాడు. ఏమీ లేదు మామయ్య మీ అబ్బాయి తాగి డ్రైవింగ్ చేసి ఇచ్చిన యాక్సిడెంట్ చేశాడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి తీసుకు వస్తున్నాను అని రాదా చెప్తుంది. అవును చిన్న యాక్సిడెంట్ ఎవరికీ ఏమీ కాలేదు నాకు ఏమీ కాలేదు అని శ్యామ్ తాగిన మైకంలో అంటాడు. ఏంటండీ వీడు రోజురోజుకి ఇలా దిగజారి పోతున్నాడు అని మధుర బాధపడుతుంది. అత్తయ్య మీరేం టెన్షన్ పడకండి నేను సార్ను చూసుకుంటాను అని రాధా శ్యామ్ ని పైకి తీసుకు వెళుతుంది. కొడుకు తాగి యాక్సిడెంట్ చేసినా కానీ ఏమీ అనని తండ్రి ఉన్నాడు చూసావా అని దాక్షాయిని వెటకారంగా అంటుంది.
కట్ చేస్తే, రాధా శ్యామ్ ని పైకి తీసుకువెళ్లి ప్లేట్లు అన్నం వేసుకోవచ్చు తినిపించి పడుకోబెడుతుంది.రాధా నాకు నువ్వే కావాలి ఆ రాక్షసి అసలు వద్దు అని శ్యామ్ కలవరిస్తూ నిద్రపోతాడు. కట్ చేస్తే ఇంతలో తెల్లవారింది. శ్యామ్ లేసి చూసేసరికి ఇంట్లో ఉంటాడు. రాధా మజ్జిగ తీసుకువచ్చి శ్యామ్ ఇస్తుంది. నేను పాలు తాగను రాదా అని శ్యామ్ అంటాడు. ఇవి పాలు కాదండి మజ్జిగ నిన్న మీరు తాగి నిద్రపోయారు కదా దిగుతుంది అని రాదా అంటుంది. దానితో శ్యామ్ నైట్ జరిగిందంతా గుర్తుకు వచ్చి ఐ యాం వెరీ వెరీ సారీ రాధా ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను ఏదో టెన్షన్ లో తాగేసాను అని శ్యామ్ అంటాడు. తాగేస్తే టెన్షన్ పోయిందా సార్ నిన్న ఉన్న పరిస్థితి ఈరోజు ఉన్న పరిస్థితి అలాగే ఉంది కదా ఏమైనా మారిందా అని రాదా అడుగుతుంది. సారీ రాధా ఇంకెప్పుడూ తాగను అని శ్యామ్ కిందికి వెళ్తాడు.
కట్ చేస్తే, ఏంట్రా అంతలా తాగి వచ్చి అమ్మాయిని బాధ పెడుతున్నావ్ ని మొదటి భార్యను వదిలించుకోలేక రాదని బాధ పెడతావ్ ఏంట్రా నీ మొదటి భార్య గురించి తెలిసి రాదా ఎక్కడ వెళ్ళిపోతుందో అని మేము టెన్షన్ పడుతుంటే నువ్వు తాగి వచ్చి ఇంకా రాదను బాధ పెట్టి నువ్వు బాధ పడతావా అసలేంటి రా నీ సమస్య ఆఫీసులో అమ్మాయి నిన్ను అంతగా ఇబ్బంది పెడుతుందా మేము వెళ్లి ఆ అమ్మాయితో మాట్లాడమా అని మధుర ఉంటుంది. వద్దమ్మా మీరు వెళ్తే మిమ్మల్ని కూడా రాదని వెళ్లగొడితేనే సరే సరే లేదంటే ఇంటికి వచ్చి మీ పరువు తీస్తానని బెదిరిస్తుంది ఆ రాక్షసి నేను ఏదో ఒకటి చేస్తాను అని శ్యామ్ అంటాడు.
కట్ చేస్తే, రాధా పండు నీ స్కూల్ కి తయారు చేస్తూ ఉంటుంది. ఏంటమ్మా డల్ గా ఉన్నావ్ డాడీ ఏమైనా అన్నాడా అని పండు అడుగుతాడు. లేదు నాన్న ఏమైంది అని రాదా అంటుంది. అవునమ్మా అందుకే నువ్వు డల్ గా ఉన్నావ్ డాడీ అసలు నాతో మాట్లాడట్లేదు చెప్పు నేను డాడీ ని అడుగుతాను అని పండు అంటాడు. ఏమీ లేదు నాన్న డాడీ ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్నాడు కదా మళ్లీ నువ్వు వెళ్లి అడిగితే విసిగించుకుంటాడు వెళ్లి అడగకు అని రాదా అంటుంది. పక్కనే మధుర ధనుంజయ్ వాళ్ళ మాటలు వింటారు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!