Madhuranagarilo March 20 2024 Episode 317: మధుర ఎప్పుడైనా ఎవరికైనా ఏదో ఒక రోజు ఇలాంటిది వస్తుంది బాధపడకు అని ధనంజయ్ అంటాడు. రశ్యామ్ మీ దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఈ డబ్బులు ఇచ్చారా అని కిరణ్ శ్యామ్ కి డబ్బులు ఇస్తాడు. కిరణ్ ఫ్రెండ్స్ దగ్గర చుట్టాల దగ్గర డబ్బు తీసుకోకూడదు రా మాట సహాయం చేయొచ్చు అంతేకానీ డబ్బు పుచ్చుకోకూడదు పర్వాలేదు రా నా దగ్గర డబ్బులు ఉన్నాయి నువ్వు ఇల్లు చూసి పెట్టినందుకే చాలా థాంక్స్ ఇంకా డబ్బేందుకు రా అని శ్యామ్ అంటాడు. ఓకే రా ఏ అవసరం ఉన్న నాకు వెంటనే ఫోన్ చెయ్ అని కిరణ్ వెళ్ళిపోతాడు.పండు ఆకలి వేస్తుంది అని అంటాడు. నేను ఇప్పుడే వెళ్లి టిఫిన్ తెస్తాను అంటూ శ్యామ్ వెళ్లిపోతాడు. కట్ చేస్తే,శ్యామ్ ఒక హోటల్ కి వెళ్లి టిఫిన్ అప్పుగా ఇవ్వమని అడుగుతాడు.
ఏంటయ్యా నీ దగ్గర డబ్బులు లేవా లేదంటే పర్సు మరిచిపోయి వచ్చావా అని హోటల్ అతను అంటాడు. సార్ మేము ఈ ఊరికి కొత్తగా వచ్చాం మా దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవు మా అమ్మానాన్న నా కొడుకు ఆకలితో ఉన్నారు టిఫిన్ అరువుగా ఇస్తే మళ్లీ మీ డబ్బులు మీకు తిరిగి ఇస్తాను అని శ్యామ్ అంటాడు. ఏంటయ్యా అందరికీ నా షాప్ దొరికిందా? ఇడాని నుంచి వెళ్ళు వెళ్ళు అని అతను శ్యామ్ ని బయటికి నెట్టేస్తాడు. అక్కడికి వచ్చిన రాదా అది చూసి ఏంటండీ మీ దగ్గర డబ్బులు లేవు అని చెప్పొచ్చు కదా నన్ను డబ్బులు ఉన్నాయని అడగొచ్చు కదా మ్యారేజ్ బీరో ద్వారా వచ్చిన డబ్బులు ఉన్నాయి మీరు డబ్బుల కోసం అంతగా ఇబ్బంది పడాల్సిన పనిలేదు అని రాదా డబ్బులు ఇస్తుంది.
శ్యామ్ ఆ డబ్బులు తీసుకొని వెళ్లి టిఫిన్ పట్టుకొని ఇద్దరు వెళ్లిపోతారు. కట్ చేస్తే, టిఫిన్ తెస్తానని వెళ్లిన డాడీ ఇంకా రాలేదు డాడీ కోసం వెళ్లిన మమ్మీ ఇంకా రాలేదు నాకు ఆకలి బాగా వేస్తుంది అని పండు అంటాడు. ఇంతలో రాదా శ్యామ్ వచ్చి వాళ్ళకి టిఫిన్ పెడతారు. మీరు కూడా తినండి రాధా అని మధుర అంటుంది. మేము అక్కడ తినొచ్చాంలే అత్తయ్య మీరు తినండి నేను ఇంకా సామాను తీసుకువచ్చి వంట చేయాలి చాలా పనులు ఉన్నాయి అని రాదా అంటుంది. అవునమ్మా మేమిద్దరం అక్కడే తినొచ్చాం కడుపు నిండిపోయింది అంటూ శ్యామ్ వెళ్ళిపోతాడు. రాధ వెళ్లి కుండలో మంచినీళ్లు ముంచుకుని తాగుతుంది. నాకు కూడా కొన్నివ్వు రాదా అని మంచినీళ్లు తాగుతాడు శ్యామ్ . ఇద్దరూ నీళ్లతో కడుపు నింపుకుంటున్నారా అని మధుర అడుగుతుంది. ఏంటి రాధా ఇది నాకు చెబితే అందరం కలిసే తినే వాళ్ళం కదా అని మధుర అంటుంది. అదేమీ లేదు అత్తయ్య అని రాధా మధుర కి నచ్చ చెప్తుంది. కట్ చేస్తే, రుక్మిణి ఫ్రెండ్స్ తో ఇంట్లో పార్టీ చేసుకుంటుంది. ఏదైతేనేం రుక్మిణి ఆస్తినంతా రాయించుకున్నావ్ అని దాక్షాయని అంటుంది.
రాసి ఇవ్వక ఏం చేస్తారే పుణ్యానికి వచ్చిన ఆస్తిగా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి కదా అని చలపతి అంటాడు. ఏంటి ఈ ఆస్తి వారసత్వంగా వస్తుందా అని వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది. అయితే మనకేంటి రాశి ఇచ్చి పండుని తీసుకువెళ్లారు కదా అని రుక్మిణి అంటుంది. రుక్మిణి ఎందుకు చెప్తున్నాను విను ఒక లాయర్ కూతురుగా నాకు తెలిసింది చెబుతున్నాను వారసత్వంగా వస్తున్న ఆస్తి పండుకు తప్ప ఇంకెవరికి దక్కదు అది తెలిసే మీ వాళ్ళు నిన్ను మోసం చేసి డూప్లికేట్ పేపర్స్ ఇచ్చి పండుని తీసుకొని వెళ్ళిపోయారు అని వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. ఎంత తెలివి ఉపయోగించారమ్మ రుక్మిణి అని దాక్షాయిని అంటుంది. డూప్లికేట్ పేపర్లు నాకిచ్చి వాళ్లు పండుని తీసుకువెళ్తారా వాళ్ళ సంగతి చెప్తా అని కోపంతో రగిలిపోతుంది రుక్మిణి. కట్ చేస్తే, రాధా నాకు చాలా బాధగా ఉంది
మహారాణి లాగా ఉండాల్సిన మా అమ్మానాన్నలు ఇక్కడ చాప మీద పడుకున్నారు ఇదంతా మీ అక్క రుక్మిణి వల్లనే అని శ్యామ్ అంటాడు. పర్వాలేదు లేండి మీకు మంచి ఉద్యోగం వచ్చేదాకా మ్యారేజ్ బిరో నుండి వచ్చిన డబ్బులు పెట్టి కుటుంబాన్ని పోషించుకోవచ్చు మీరు అంతగా ఇబ్బంది పడాల్సిన పనిలేదు అని రాదా శ్యామ్ కి సర్ది చెబుతుంది.నీ సంపాదన మీద బతకాల్సి వచ్చిందని నాకు బాధగా ఉంది రాధ అని శ్యామ్ ఫీల్అవుతాడు. అదేంటండి నీ డబ్బు నా డబ్బు అంటారు మనమంతా ఒకటే కుటుంబం నీది నాది అనేదేమీ లేదు అని రాదా అంటుంది. రేపే నేను మంచి ఉద్యోగం వెతుక్కోవాలి అని శ్యామ్ అంటాడు.
కట్ చేస్తే, రాధా పొద్దున్నే లేచి శ్యామ్ కి గ్రీన్ టీ తెచ్చి ఇస్తుంది. రాధా ఇలాంటి కాస్ట్లీ టీలు తాగడం మానేశాను అని శ్యామ్ అంటాడు. మీ అలవాటుని మార్చుకోవాల్సిన పని లేదండి ఇంట్లో ఉన్న దాల్చిన చెక్క తులసాకులు లవంగాలు యాలకుల తోటే మీకు గ్రీన్ టీ తయారు చేశాను హెల్దీ కి హెల్దీ డబ్బులు సేవ్ అని రాధా శ్యామ్ కి గ్రీన్ టీ ఇస్తుంది. శ్యామ్ ఆ గ్రీన్ టీ తీసుకుంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!