Madhuranagarilo March 28 2024 Episode 324: రాధా పండు కి బొమ్మ ఎలా కొనిచ్చావ్ వెయ్యి రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయి అని శ్యామ్ అంటాడు. మా ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకున్నానండి అని రాదా చెబుతుంది. ఎందుకు అబద్దం చెప్తున్నావ్ రాధా నువ్వు అప్పు తీసుకుంటావనే అబద్ధం చెప్తున్నావా అని శ్యామ్ అంటాడు. రాధా నీ చేతికి ఆ ప్లాస్టర్ ఏంటి ఏమైంది అని శ్యామ్ అడుగుతాడు. ఏమీ కాలేదండీ అని రాదా అంటూ ఉండగా అర్థమైంది రాదా? పండుకు నువ్వు బొమ్మ ఎలా కొనిచ్చావో నీ రక్తం అమ్మి పండు కి బొమ్మ కొనిచ్చావా అని శ్యామ్ అంటాడు. అవునండి అని రాధా అంటుంది. ఎందుకు రాదా రక్తం అమ్మి పండు కి బొమ్మ కొన్ని ఇచ్చే అంత అవసరం నీకు ఏమి వచ్చింది
అని శ్యామ్ అంటాడు. మా అక్క పండుని నాకు ఎక్కడ దూరం చేస్తున్నానని భయపడి కొనిచ్చానండి మా అక్క స్కూల్ కి వెళ్లి పండుకి ఇష్టమైన అన్ని వండుకొని తెచ్చి వాడికి పెట్టాలనుకుంది కన్నతల్లి దగ్గర డబ్బు ఉంది అన్నీ కొనియగలుగుతుందని వాడి మనసు మారి మా అక్క దగ్గరికి వెళ్తే నేను చచ్చిపోతానండి అందుకే వాడి మనసు మారకూడదని వాడు అడిగిన వన్ని కొనిస్తున్నాను వాడు లేకపోతే నేను చచ్చిపోతానండి అని రాదా అంటుంది.
రాధా నీలాంటి తల్లి దొరకడం పండు అదృష్టం అయితే నువ్వు నాకు భార్యగా దొరకడం నా అదృష్టం రాదా అని శ్యామ్ అంటాడు. కట్ చేస్తే, రే శ్యామ్ ఎందుకురా మందు తాగుతున్నావ్ అని కిరణ్ అంటాడు.ఏంచెయ్యను రా రాధా రక్తం అమ్ముకొని పండుకి బొమ్మ కొనిచ్చే పరిస్థితి వచ్చింది అని శ్యామ్ బాధపడతాడు. రక్త అమ్ముకోవడమేంట్రా అని కిరణ్ అంటాడు. అవున్రా పండు రాదని ఎక్కడ రుక్మిణి దగ్గరికి వెళ్తాడు అని భయపడి రాదా రక్త మమ్మీ పండు కి బొమ్మ కొనిచ్చింది తనని ఆ పరిస్థితులు చూసి తట్టుకోలేకపోయాను రా దీనికంతటికి కారణం నేనే రుక్మిణిని పెళ్లి చేసుకొని తప్పు చేశాను అని శ్యామ్ బాధపడతాడు. రేయ్ జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం మానేసి రాదని ఎలా సంతోషంగా ఉంచాలో ఆలోచించు నువ్విలా మందు తాగుతూ ఉంటే రాదా బాధ ఎక్కువ అవుతుంది దీనికి నువ్వే ఏదో ఒక పరిష్కారం ఆలోచించరా అని కిరణ్ అంటాడు.
ఆలోచిస్తా ఆ రుక్మిణికి ఎలా బుద్ధి చెప్పాలో ఆలోచిస్తా ఇకమీదట మందు తాగ నురా రాదని బాగా చూసుకుంటాను అని శ్యామ్ అంటాడు. రేయ్ నిన్ను డ్రాప్ చేస్తాను అని కిరణ్ అనగా వద్దులేరా నేనే వెళ్ళిపోతాను అని శ్యామ్ ఆటో వేసుకొని వెళ్లిపోతాడు. కట్ చేస్తే, అత్తయ్య ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్లారు అని రాదా అడుగుతుంది.గుళ్లో హరికథ చెప్తుంటే అక్కడే ఉండిపోయాను అని మధుర చెబుతుంది.
పగటిపుట హరికథ చెప్పడం ఏంటి అత్తయ్య అని రాదా అంటుంది. రాధా ఏదో పూజ చేస్తున్నారంట హరికథ చెప్పించి వంట చేయించారు వంట మనుషులు రాకపోవడంతో నేను అక్కడ వంట చేశాను వంట చేసినందుకు 700 ఇచ్చారు ఈ 500 నీకేమైనా ఉపయోగపడతాయేమో ఉంచుకో అమ్మ అని మధుర అంటుంది. ఇంతలో ధనంజయ్ అక్కడికి వస్తాడు. మావయ్య ఎంతసేపు అయింది నువ్వు వచ్చి అని రాదా అడుగుతుంది. ఇప్పుడే వచ్చాను అమ్మ అని ధనంజయ్ వెయ్యి రూపాయలు తీసి రాదకి ఇచ్చి నాకు జాబ్ దొరికింది రాదా? ఖర్చులకు పనికొస్తాయి ఉంచు అని చెబుతాడు. మీరు పని చేస్తున్నారా మావయ్య అని రాదా అంటుంది. ఎ వాచ్మెన్ జాబ్ చేయట్లేదు అమ్మ కూర్చొని రాసే పని చేస్తున్నాను అయినా ఉద్యోగం పురుష లక్షణం శ్యాము ఒక్కడు కష్టపడుతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అని ధనంజయ్ అంటాడు. సరే మావయ్య మీరు వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి రండి పది నిమిషాల్లో వంట అయిపోతుంది తిందాం అని రాదా వెళ్లిపోతుంది. కట్ చేస్తే, మధుర నువ్వెక్కడ పని చేశావు అని ధనంజయ్ అంటాడు.
రామాలయంలో నుండి అని మధర చెబుతుంది. ఏ రామాలయంలో దానికి ఎదురుగా ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది అక్కడ పని జరుగుతుంది ఆ రామాలయంలో నా నువ్వు చేసింది పని అని ధనంజయ్ అంటాడు. అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉందా అక్కడ పని నడుస్తుంది నాకు తెలియదండి అని మధుర అంటుంది. ఎందుకు మధురా అబద్ధం చెప్తున్నావ్ నువ్వు అక్కడ పని చేయడం నేను చూశాను నిన్న పరిస్థితుల్లో చూసి తట్టుకోలేక పోయాను మధుర నగర్ కాలనీలో మహారాణిలా ఉండే నువ్వు కూలి పని చేయడం ఏంటి మధుర పనిచేయదని అనడం లేదు కానీ ఇప్పుడు వంట చేశానని చెప్పావు కదా అదే పనిని నిజం చేయి అంతేకానీ ఎండలో పడి డబ్బులు సంపాదించాలి అనుకోకు నేను చూస్తూ తట్టుకోలేను అని ధనంజయ్ అంటాడు. సరేనండి ఇంకా శ్యామ్ రాలేదేంటి అని మధుర ఉంటుంది. ఇంకా రాలేదా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఈపాటికి రావాలి కదా అని ధనంజయ్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!