Madhuranagarilo Episode 215: రుక్మిణి శ్యామ్ కి ఫోన్ చేస్తుంది. ఏంటి ఈ రాక్షసి ఫోన్ చేస్తుంది కాల్ లిఫ్ట్ చేయాలా వద్దా అని లిఫ్ట్ చేస్తాడు శ్యామ్. ఎందుకు ఫోన్ చేసావ్ అని అడుగుతాడు. ఆగు శ్యామ్ ఎందుకు అంత తొందర అని రుక్మిణి అంటుంది. రేపు మనం కలుస్తున్నాం అప్పటిదాకా ఆగలేకపోతున్నావా చూడాలనిపిస్తుందా అని అంటుంది. రేపు ఎందుకు కలుస్తున్నాం అసలు నీకేం కావాలి నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు అని శ్యామ్ అడుగుతాడు. ఎందుకు అంటే రేపు మన పెళ్లి రోజు సార్ అంతా విసుక్కుంటున్నారు ఎందుకు ఏమంటున్నానని నీ కోసం డ్రెస్ తీసుకున్నాను అని చెప్పడానికి ఫోన్ చేశాను అని రుక్మిణి అంటుంది. నాకు డ్రెస్ తీస్కున్నావా నిన్నెవడు నాకు డ్రెస్ తీసుకోమన్నాడు నా నుంచి ఏం ఆశిస్తున్నావు అని శ్యామ్ అడుగుతాడు.
పెళ్లి రోజు డ్రెస్ మాత్రమే కొన్నాను అని బాధ పడకు, ఇంకోటి గిఫ్ట్ కూడా ఉంది అది చూస్తే నువ్వు ఆశ్చర్య పోతావు,నువ్వు వెంటనే బయలుదేరి గాంధీ నగర్ కి వెళ్ళాలి, నా ఫ్రెండ్ డ్రెస్ పట్టుకొని నీ కోసం ఎదురు చూస్తువుంటుంది. నువ్వు రేపు డ్రెస్ వెస్కొని రావాలి అని రుక్మిణి అంటుంది.ఇంతలో రాధ కాఫీ తీస్కొని వస్తుంది, అది చూసి శ్యామ్ ఫోన్ కట్ చేస్తాడు. రాధ శ్యామ్ కి కాఫీ ఇస్తుంది. ఏంటి సార్ టెన్షన్ లో ఉన్నట్టు కనపడుతుంది అని అడుగుతుంది రాధ. ఏమి లేదు అని శ్యామ్ కాఫీ తాగి చాలా బాగావుంది అని చెప్తాడు, రాధ వెళ్లి పోతుంది. రుక్మిణి మళ్ళి శ్యామ్ కి ఫోన్ చేస్తుంది. నాకు ఆ డ్రెస్ వద్దు ఏమి వద్దు చీటికిమాటికి నాకు ఫోన్ చేసి చిరాకు తెప్పించకు అని శ్యామ్ చెప్తాడు.
నువ్వు ఫోన్ మాత్రమే కట్ చేయగలవు నన్ను కాదునువ్వు ఫోన్ కట్ చేస్తే డైరెక్ట్ గా ఇంటికి వచ్చి కూర్చుంటాను అప్పుడు ఏం చేస్తావో చూస్తాను అని అంటుంది రుక్మిణి. వద్దు సరే నువ్వు చెప్పినట్టే వెళ్తాను అని భయపడిపోయి పరిగెత్తుకు రావాలా ఏం చూసుకుని నీకు ఇంత తల పొగరు నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిది అని శ్యామ్ అంటాడు.నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళలేదు అనుకో నేను మీ ఇంటికి వస్తాను అని రుక్మిణి బెదిరిస్తుంది. దాంతో ఎం చేయాలో అర్ధం కాకపోవడంతోసరే నువ్వు చెప్పినట్టే వెళ్తాను కానీ అక్కడికి వచ్చాక పిచ్చి పిచ్చి వేషాలు వేసావ్ అనుకో బాగోదు అని శ్యామ్ చెప్తాడు. రాధ మళ్ళి వచ్చి కప్ ఇవ్వండి అని అడుగుతుంది. నేను తెస్తానులే రాధా నువ్వెందుకు వచ్చావు అని శ్యామ్ గాంధీ నగర్ వెళ్తాడు, రుక్మిణి వాళ్ళ ఫ్రెండ్ ని కలుస్తాడు, రుక్మిణి ఎక్కడ తనతో నేను మాట్లాడాలి అని అంటాడు, రేపు కలుస్తారు కదా ఏం మాట్లాడాలి అన్న అప్పుడు మాట్లాడండి అని అంటుంది.
ఎందుకు తను నా జీవితంతో ఆడుకుంటుంది వద్దనుకొని వదిలేసింది మళ్లీ తిరిగి వచ్చి ఫోన్లు చేసి బెదిరిస్తుంది అసలేం అనుకుంటుంది తను అని శ్యామ్ అంటాడు. తను మీతో ఆడుకుంటుందో, లేదా మీరే గతంలో తన జీవితంతో ఆడుకున్నారో నాకు తెలియదు కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది తనని మీరు వదిలించుకోవాలని అక్కడే వదిలేసి వచ్చారు మళ్లీ తను మీ జీవితంలోకి వస్తుందని మీరు ఊహించలేదు అని వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. కట్ చేస్తే, ద్రాక్షయిని చలపతి కలిసి వెండి వస్తువులు దొంగలుస్తారు, అది పండు చూసి దొంగ అని అరుస్తాడు. రాధ వచ్చి ఎక్కడ దొంగలు అని అడుగుతుంది. దొంగలు ఎవరు లేరు, మేము దొంగ పోలీస్ ఆట ఆడుతున్నాము అని ద్రాక్షయిని చెప్తుంది. అవును, నేను పోలీస్ వాళ్ళు దొంగలు అని రాధకి చెప్తాడు పండు.
కట్ చేస్తే, రాధ వంట వండుతుంది, ద్రాక్షయిని చలపతి పండు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో శ్యామ్ ఇంటికి వస్తాడు, పండు శ్యామ్ ని పిలిచి డాడీ వీళ్ళు ఎవరో తెలుసా దొంగలు అని చెప్తాడు.
బాబు పండు మేము దొంగ ఆట ఆడాము అని చలపతి చెప్తాడు.అది విని అందరు నవ్వుతారు. రాధ వండించడానికి కిచెన్ లో నుండి కూర తీస్కొని వస్తుంటే చెయ్ జారీ గిన్న కింద పడుతుంది. రాధ కాలు కాలుతుంది. శ్యామ్ తీసుకొచ్చి హాల్లో కూర్చోబెడతాడు ఆయింట్మెంట్ రాస్తాడు. ఏంటమ్మా రాదా పరధ్యానంలో ఉండి పని చేస్తున్నావా చూడు వేడివేడి కూర కాలు మీద పడడంతో నీ కాలు కాలిపోయింది చూసుకోవాలి కదా అని మధుర అంటుంది. రాధా ఇంట్లో ఇంతమంది ఉన్నారు నువ్వు ఒక్కదానివే చేయాలా సహాయం చేయమని అడగొచ్చు కదా అని ధనంజయ్ అంటాడు. అవును రాదా నాకు ఏ పని పాట లేదు కదా నేను సహాయం చేసే దాన్ని కదా అని దాక్షాయిని అంటుంది.
మమ్మీ చాలా మంటగా ఉందా బాధపడుతున్నావు అని పండు అడుగుతాడు. ఏమీ లేదు నాన్న అని రాదా అంటుంది. ఏమీ లేదంటావేంటి రాధా కాలు అంతలా కాలిపోతేను అని మధుర అంటుంది. సరే అత్తయ్య ఇప్పుడు ఏమైందని కొంచెం కాలింది అంతే మీకు వడ్డిస్తాను రండి అని అంటుంది రాధ. ఎందుకు రాధ మేము తింటాములే అని అంటుంది మధుర. పైకి వెళ్దాం పద రాధ అని శ్యామ్ అంటాడు. రాధకి నడవడానికి ఇబ్బందిగా ఉంటే శ్యామ్ ఎత్తుకొని తీసుకెళ్తాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది