Malli Nindu Jabili: గౌతమ్ వాళ్ళతో కలిసి ఉండాలని మా అమ్మ అనుకోవట్లేదు జాబ్ మానేయొచ్చు కదా అని మాలిని అంటుంది. ఒకప్పుడు గౌతమ్ అరవింద్ బాస్ ఎంప్లాయ్ ఇప్పుడు బంధువులు ఇప్పుడు జాబ్ మానేస్తే ఎస్కేప్ అయ్యాడు అని అంటారు నా తప్పు లేదని నిరూపించుకున్నాకే మానేస్తాను అప్పటిదాకా మానేసి ప్రసక్తే లేదు అని అరవింద్ వెళ్లిపోతాడు. కట్ చేస్తే అమ్మ ఇవి వదినకు తప్పకుండా నచ్చుతాయి అని నీలిమ అంటుంది. మల్లి కి ఏది నచ్చితే నీకు తెలుసా నీలిమా అని కౌసల్య అంటుంది. ఇంతలో పూజారి గారు వచ్చి రేపు వినాయక చవితి కదా అమ్మ కొత్త జంటను కూడా ఆహ్వానిద్దామని వచ్చాను అని పూజారి అంటాడు. మల్లి గౌతమ్ వచ్చి పూజారి గారికి నమస్కారం పెడతారు.
మీ జంట అచ్చం శివుడు పార్వతి లా ఉంది అని పూజారి అంటాడు. థాంక్యూ పంతులుగారు అని గౌతమ్ అంటాడు. అయ్యా రేపు వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి మీరు తప్పకుండా రావాలి అను పూజారి అంటాడు. మా పెళ్లయిన సంవత్సరం వచ్చిన మొదటి వినాయక చవితి తప్పకుండా వస్తాం పంతులుగారు అని గౌతమ్ అంటాడు. ఇక నేను వెళ్లి వస్తాను బాబు అని పూజారి గారు వెళ్ళిపోతాడు. పూజారి గారు అన్నట్టు మీరిద్దరూ పార్వతీ పరమేశ్వర్ లాగా ఉన్నారు రేపు గుడిలో చక్కగా పూజ చేసుకుందాం అని కౌసల్య అంటుంది. కట్ చేస్తే షాపింగ్ కి తీసుకెళ్లమని నేను అడగలేదు కదండీ అని మల్లి అంటుంది. భార్య అడిగితే ఏ మోగుడైనా కొనిస్తాడు అడగక ముందు కొనిస్తేనే వాడు మగాడు అని గౌతమ్ అంటాడు.
నాకు మంచి భర్త దొరికాడు ఇక నాకు ఏ ఆడంబరాలు వద్దండి అని మల్లి అంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా నువ్వు షాపింగ్ చేయాల్సిందే అని గౌతమ్ అంటాడు. మొండివారు మాట వినరు కదా అని మల్లి అంటుంది. టక్కన కార్ ఆపి మల్లి కారు దిగు అని గౌతమ్ అంటాడు. ఎందుకండీ మీకు కోపం వచ్చిందా అని మల్లి అంటుంది. ఇందాక దాహం వేస్తుందని అన్నావు కదా కోకోనట్ వాటర్ తాగుదువు గాని అని గౌతమ్ అంటాడు. మో ఎంత భయపడిపోయాను అని మల్లి అంటుంది. గౌతమ్ రెండు కొబ్బరి బోండాలు తెచ్చుకొని మల్లి గౌతమ్ తాగుతారు. వాళ్లనే చూస్తున్నా రాజు స్వప్న చనిపోగానే మరో పెళ్లి చేసుకుని గౌతమ్ చాలా ఆనందంగా ఉన్నాడు అరవింద్ ని ఏమి చెయ్యట్లేదు నేనే అతని ఏదో ఒకటి చేయాలి అని గన్ను కొనుక్కొని రాజు వాళ్ళ ఇంటికి వెళ్లి పోతాడు.
కట్ చేస్తే అందరూ వినాయకుడి గుడి దగ్గరికి వస్తారు మల్లి మీ అమ్మని మాత్రమే పిలవమన్నాను అందర్నీ పిలువమని నేను చెప్పలేదుగా అని గౌతమ్ అంటాడు. నేను అమ్మను మాత్రమే పిలిచానండి అని మల్లి అంటుంది. ఇది దేవుని గుడి ఇది ఎవ్వరు సొత్తు కాదు ఇక్కడికి ఎవరైనా వస్తారు అని వసుంధర అంటుంది. కల్మషం లేని మనుషులు మాత్రమే ఇక్కడికి వస్తారు అని గౌతమ్ అంటాడు. అలాగైతే ముందు మల్లి రాకూడదు అని అనుపమ అటుంది. నా కోడలు గంగ కంటే పవిత్రమైనది అని కౌసల్య అంటుంది. అయితే నెత్తిన చల్లుకో మా మీద చల్లకు అని అనుపమ అంటుంది.
అమ్మ వినాయకుడి పూజ మొదలవుతుంది అందరూ కుంకుమ బొట్టు పెట్టుకోండి అని పూజారి అంటాడు. కట్ చేస్తే ఒరేయ్ రాజు ఎక్కడికి రా వెళ్తున్నావ్ అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. నా చెల్లెల్ని చంపిన అరవింద్ ని చంపి నా చెల్లెలికి న్యాయం చేస్తాను అని రాజు అంటాడు. ఒరేయ్ అరవింద్ ని చంపి నువ్వు అంత గుడివి కావడం కంటే లీగల్ గా వెళ్లొచ్చు కదా అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. లీగల్ గా వెళితే వాడు బెల్ మీద బయటకు వస్తున్నాడు రా నా చెల్లిని మరిచిపోయి ఆ గౌతమ్ సంతోషంగా ఉన్నాడు నా చెల్లి చావుకి కారణమైన అరవింద్ కూడా సంతోషంగానే ఉన్నాడు కానీ నా చెల్లి ఆత్మకు శాంతి మాత్రం జరగట్లేదు వాడిని చంపిన చెల్లిలి ఆత్మకు శాంతిని కలిగిస్తాను అని రాజు గుడి దగ్గరికి బయలుదేరుతాడు. కట్ చేస్తే అందరూ కుంకుమ బొట్టు పెట్టుకుంటారు వినాయకుడి పూజ జరుగుతుంది..దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!