Malli Nindu Jabili January 31 2024 Episode 560: మాలిని అరవింద్ ని తీసుకు రావడం ఎవరి తరం కాదు కానీ అరవింద్ ను చంపిన వారిని మాత్రం పట్టుకుంటాను ప్రామిస్ అని గౌతమ్ అంటాడు. కచ్చితంగా తెలుసుకోవాలి బాబు గారు లేదంటే నింద నీ మీద ఉండిపోతుంది ఆ మచ్చ మీరు తుడుచుకోవాలి అని మీరా అంటుంది. అక్క బాబు గారు నిన్ను వదిలేసి వెళ్లిపోయారని అనుకోకు నాకు ఎందుకో నిన్ను నీ కడుపులో బిడ్డను వదిలేసి అరవింద్ సార్ వదిలేసి వెళ్లిపోలేదనిపిస్తుంది అని మల్లి బాధపడుతుంది. అమ్మ నీకు ఒక్క కూతురు కాదు ఇద్దరు కూతుర్లు మాలిని ఆక్క ను కూడా జాగ్రత్తగా చూసుకో అని మల్లి మీరాకి చెబుతుంది. నాకు నువ్వేంతో మాలిని అమ్మ కూడా అంతే అమ్మ నేను తనని జాగ్రత్తగా చూసుకుంటాను నువ్వేం టెన్షన్ పెట్టుకోకు అని మీరా అంటుంది. మీ భార్యకు ఒకటి చెప్పండి అన్నయ్య గారు పాత కక్షలు మనసులో పెట్టుకొని నా కొడుకు మీద నిందలు వేయవద్దని అని కౌసల్య అంటుంది. ఇది సమయం కాదని ఊరుకుంటున్నాను అందుకే అందరూ తప్పించుకుంటున్నారు అని వసుంధర అంటుంది.
లేదంటే ఏం చేసేవారు ఇది మా అఖిలు మా అమ్మ ఇల్లు ఇలాగే వస్తాం అని మల్లి అంటుంది. మల్లి మీరు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు వెళ్ళండి అని శరత్ అంటాడు. మల్లి వెళ్దాం పద అని గౌతమ్ మల్లి నీ తీసుకొని వెళుతూ ఉంటే మల్లి వెళ్లలేక వెనక్కి ముందుకి చూస్తూ బాధపడుతూ వెళ్తుంది. మాలిని అరవింద్ ఫోటో దగ్గర కూర్చొని ఏడుస్తుంది వసుంధర వచ్చి తనను గుండెలకు హత్తుకుని ఓదారుస్తుంది. కట్ చేస్తే, చూడమ్మా మనం ఎంత బాధపడినా పోయిన వాళ్ళని తీసుకురాలేము నువ్వు బాధపడి కడుపులో బిడ్డకి అన్యాయం చేయకమ్మా అని శంకరమ్మ అంటుంది. వసుంధర శంకరమ్మని పిలుస్తుంది. ఏమైందమ్మా అని శంకరమ్మ అంటుంది. నిన్న నువ్వు రెండు మూడు గంటలు కనిపించలేదు ఎక్కడికి వెళ్లావు అని వసుంధర అడుగుతుంది. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో నీకు తెలుసు కదా మా నువ్వు ఎక్కడికి వెళ్ళినా రకరకాల అనుమానాలు వస్తాయి అని శరత్ అంటాడు.
నా భర్తను చంపింది ఎవరో తెలిసేదాకా నువ్వు ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు అని మాలిని అంటుంది. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి చెప్పు అని వసుంధర గట్టిగా బెదిరిస్తుంది. నిన్న నేను మల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అమ్మ అని అంటుంది శంకరమ్మ. దాని ఇంటికి నీకేం అవసరం వచ్చిందిని వెళ్లావు అని వసుంధర అంటుంది. ఇప్పటికే మల్లి మీద గౌతమ్ మీద నిందలు పడ్డాయి ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే ఇంకా పెద్ద గొడవ అవుతుంది నిజం చెప్పమ్మా అని శరత్ అంటాడు. మల్లమ్మ కి నాతో అవసరం ఉండి వెళ్లాల్సి వచ్చింది అని శంకరమ్మ అంటుంది. దానికి నీ అవసరమా ఏంటది అని వసుంధర అంటుంది. మల్లి మీరా అమ్మకి ఫోన్ చేసి చెప్తే నన్ను వెళ్ళమని చెప్పింది అమ్మ మీరా చెప్తే వెళ్లాను అని శంకరమ్మ అంటుంది. నా అల్లుని చంపుతుండగా చూసిన సాక్షి ఆవిడ ఎందుకు మల్లి ఇంటికి పంపించావు ఇందులో నీ కుట్రెంటీ అని వసుంధర అంటుంది.
అరవింద్ బాబుని చంపింది ఎవరో తెలుసుకుంటానని అంటే పంపించాను బాబు గారు అని మీరా అంటుంది. గౌతమ్ నువ్వు మల్లి కలిసి నా అల్లుని నీ తల్లి కూతుర్ల పాత్ర కూడా ఉంది కదూ ఉన్న ఒక్క సాక్షిని మీ వైపు తిప్పుకుంటున్నారా అని వసుంధర అంటుంది. సాక్ష్యాన్ని తారుమారు చేయడానికి పిలిపియ్యలేదమ్మా హత్య చేసింది ఎవరో తెలుసుకోవడానికి పిలిపించింది అని శంకరమ్మ అంటుంది. అంతా అబద్ధం శంకరమ్మ మల్లి మీరా మెత్తటి వెన్న పూసిన కత్తులు వీళ్ళని ఎప్పటికీ నమ్మకు అని వసుంధర అంటుంది. వెళ్లొచ్చినా ఆవిడే చెప్తుంటే నమ్మవేంటి వసుంధర అని శరత్ అంటాడు. నేరం చేసిన వాడిని పట్టుకొని అక్క బాధని తీర్చాలని ప్రయత్నం చేసింది అని మీరా అంటుంది. మల్లి తన భర్తని నేరం నుంచి కాపాడడం కోసమే తన బుద్ధి చూపిస్తుంది అని వసుంధర అంటుంది.
మల్లి అట్టాంటి కాదని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అమ్మ అని మీరా అంటుంది. వదిలిపెట్టను ఎవ్వరిని వదిలిపెట్టను అంటూ వసుంధర కోపంగా వెళుతుంది.వసుంధర అమ్మగారికి రోజు రోజుకు అనుమానం ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవడం లేదు నీ చెల్లెలెట్టంటిదో నీకు తెలుసు కదా అమ్మ నువ్వైనా అమ్మకు చెప్పమ్మా అని మీరా అడుగుతుంది. శంకరమ్మ వాళ్ళు నేనెందుకు పిలిచారు నిజం చెప్పు అని మాలిని అంటుంది. నేను నిజమే చెప్తున్నాను అమ్మ మీరు నన్ను కూడా అనుమానిస్తున్నారా అని శంకరమ్మ అంటుంది. నా తల్లి న్యాయం కోసం పోరాడుతుంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు అర్థం కావట్లేదు అని మాలిని బాధపడుతూ వెళ్ళిపోతుంది.
కట్ చేస్తే, మన కుటుంబాన్ని పోషించుకోవాలంటే మనిద్దరం కష్టపడాలి నువ్వు నేను ఇద్దరం జాబ్ చేద్దాం అని మల్లి అంటుంది. వద్దు నేనే జాబ్ చేస్తాను అని గౌతమ్ అంటాడు. మనకు సేవ చేసుకుంటానని ఊరంతా చెప్పుకుంది కదా తనను చేయనివ్వు నువ్వు రెస్ట్ తీసుకో అని కౌసల్య అంటుంది. వదిన ఒక్కతే జాబ్ చేస్తే ఎక్కడ సరిపోతుంది నేను కూడా జాబ్ చేస్తాను అని నీలిమా అంటుంది. ఇకమీదట మీరెవరు జాబ్ చేయాల్సిన అవసరం లేదు నేనే చేస్తాను అని గౌతమ్ అంటాడు. ఇంతలో వసుంధర వచ్చి రేయ్ గౌతమ్ అని అంటుంది. రేయ్ అని పిలుస్తున్నావ్ బొడ్డు కోసవ పేరు పెట్టావా అని కౌసల్య అంటుంది. నా భర్తని ఆ గౌరవంగా పిలవకండి అని మల్లి అంటుంది. నా అల్లుని ఎందుకురా చంపావు అని వసుంధర గౌతమ్ గల పట్టుకుంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!