Malli Nindu Jabili October 28 Episode 479: ఆగండి ఒక్క నిమిషం అని మల్లి టవల్ తీసి గౌతమ్ మెడలో వేసి ఇప్పుడు సూపర్ గా ఉన్నారు అని అంటుంది. కట్ చేస్తే అరవింద్ మాలిని దగ్గరికి వచ్చి అలాగే చూస్తూ నిలబడిపోతాడు. ఎందుకు అలా చూస్తున్నారు అని మాలిని అంటుంది. నిన్న రాత్రి నువ్వు మాట్లాడిన మాటలు ఈరోజు మీరా గారితో మాట్లాడిన మాటలు వింటుంటే నువ్వేనా ఇంత సౌమ్యంగా మాట్లాడావు అనిపిస్తుంది నీలో ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది అని అరవింద్ అంటాడు. నాలో ఎప్పుడూ మెచ్యూరిటీ ఉంది అది నీకే కనిపించట్లేదు అని మాలిని అంటుంది.నేను మాట్లాడే మాటల్లో తేడా ఉంటుందేమో కానీ ఎప్పుడూ నిన్ను అవమానిస్తూ మాట్లాడను మాలిని అని అరవింద్ అంటాడు.
భార్య ఎప్పుడూ ఎక్కువగా బాధపడుతుందో తెలుసా భర్త ఇంకో ఆడదాని గురించి ఆలోచించినప్పుడు భార్యని చిన్నపిల్లల చూసుకుంటే భర్తని తల్లిలా చూసుకుంటుంది నిన్ను నేను ఏమి అడుగుతున్నానా అరవింద్ నీ గుండెల్లో నేను మాత్రమే ఉండాలని అడుగుతున్నాను అంతే కదా అని మాలిని అంటుంది. ఈ గుండెల్లో నా భార్య దేవతగా ఉంటుంది అని అరవింద్ అంటాడు. కట్ చేస్తే పంతులుగారు వచ్చేసారు అన్ని అయిపోయినట్టేనా అని మల్లి వాళ్ళ అమ్మని అడుగుతుంది. అయిపోయినట్టే మల్లి అని వాళ్ళ అమ్మ అంటుంది. ఇంతలో అక్కడికి ఒక ఆవిడ వచ్చి ఏంటమ్మా మొహానికి బొట్టు లేకుండా పనులు చేస్తున్నావు శుభం కాదు అని అంటుంది. అయ్యో పొద్దున పెట్టుకున్నానండి పోయిందేమో అని మిరా అంటుంది.
నేను పెడతాను ఉండమ్మ అని మల్లి బొట్టు పెట్టబోతుండగా నువ్వు ఆగమ్మా మీ నాన్న పెడతాడు అని ఆవీడ అంటుంది. మీరు అత్తకి బొట్టు పెట్టండి అని గౌతమ్ అంటాడు. సరే అని శరత్ మీరాకి బొట్టు పెడుతూ ఉండగా అరవింద్ మాలిని వచ్చి చూస్తూ నిలబడిపోతారు. వాళ్ళిద్దర్నీ చూసి మల్లి ఏం జరుగుతుందో అని భయపడుతది మల్లి పెళ్లయిన కానుంచి కన్యదానం చేసే వరకు డాడీ నీతోనే ఉన్నాడు కదా ఇప్పుడు బొట్టు పెట్టించుకోవడంలో తప్పేముంది అని మాలిని అంటుంది. గ్రేట్ మాలిని ఎంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నావు అంటే గ్రేట్ నీ గౌతమ్ అంటాడు. గౌతమ్ ఏంటి ఏమి చెప్పకుండా సైలెంట్ గా ఫంక్షన్ అయిపోయిన తర్వాత అంకుల్ ని పంపిస్తాను అన్నాడు ఏం చేయాలనుకుంటున్నాడు గౌతమ్ తెలియట్లేదు అని అరవింద్ తన మనసులో అనుకుంటాడు.
థాంక్స్ అక్క నువ్వు అమ్మని ఇంతలా అర్థం చేసుకున్నందుకు అని మల్లి అంటుంది. అందరూ ఆనందంగానే ఉన్నారు కానీ మా అమ్మ మాత్రమే ఎక్కడికొ వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటుంది తొందరగా డాడీ ని తీసుకొని వెళ్ళిపోవాలి అని తన మనసులో అనుకుంటుంది మాలిని. కట్ చేస్తే గౌతమ్ లాయర్ కి ఫోన్ చేసి లాయర్ గారు డివర్స్ పేపర్ నా దగ్గరే ఉన్నాయి ఇంకా లేట్ చేయకుండా విడాకుల ప్రొసీజర్ మొదలు పెట్టండి వసుంధర గారికి శరత్ అంకుల్ కి తొందరగా విడాకులు వచ్చేసేయాలి దీన్ని ఎక్కువగా లాగోదు అని గౌతమ్ అంటాడు. అలాగేనండి కొద్దిగా ఎక్కువ కేసులు ఉండటం వల్ల దాన్ని పట్టించుకోవట్లేదు కానీ ఈ రెండు రోజుల్లో అయిపోతుంది అని లాయర్ అంటాడు. ఫోన్ కట్ చేశాక గౌతమ్ వసుంధర గారు మల్లి ని వాళ్ళ అమ్మని మా అమ్మని చాలా కష్టపెట్టింది బాధ పెట్టింది అన్నింటికీ కలిపి ఒకేసారి సమాధానం చెప్తాను ఈ విడాకులు వస్తే శరత్ అంకుల్ వసుంధర గారు నుండి విముక్తి పొందినట్టే అత్తయ్య కూడా తన దగ్గర నుంచి ఇబ్బంది పడకుండా ఉంటుంది అని గౌతమ్ అనుకుంటాడు.
లాయర్ కి ఫోన్ చేసి మాట్లాడుతుండగా అరవింద్ వింటాడు అంటే గౌతమ్ అత్తయ్యకి మామయ్యకి విడాకులు ఇప్పించాలనుకుంటున్నాడా అందుకే ఇంత ప్రశాంతంగా ఉంటున్నా ఏదో తను మంచిగా మారిపోయి ఇలా చేస్తున్నాడు అనుకున్నాను కానీ తన వెనకాల ఎంత కుట్ర నడుస్తుందని మాలినికి తెలిస్తే పెద్ద గొడవ చేస్తుంది కాబట్టి ముందే లాయర్ దగ్గరికి పేపర్లు వెళ్లక ముందే అవి ఎక్కడ ఉన్నాయో వెతకాలి లేదంటే అత్తయ్యకి అన్యాయం జరిగిపోతుంది జీవితాలే తార్మారైపోతాయి అని అరవింద్ గౌతమ్ వాళ్ళ బెడ్ రూమ్ అంతా చెక్ చేస్తూ ఉంటాడు. మల్లి తన రూమ్ లోకి వెళ్దామని వస్తూ ఉంటుంది. తనని గమనించుకోని అరవింద్ అలాగే వాళ్ళ రూంలో కబోర్డ్ లోనే చెక్ చేస్తూ ఉండగా పేపర్లు దొరుకుతాయి అది ఇదేనా అని చూస్తూ ఉంటాడు అరవింద్ . ఇంతలో మల్లి వచ్చి బాబు గారు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటుంది.
కట్ చేస్తే పంతులుగారు బాబు వెండి ప్రతిమలు ఇంకా తీసుకురాలేదు అని అంటాడు. అవునా అవి ఎక్కడ ఉన్నాయో కన్ఫ్యూజ్ అయినట్టుంది నేను వెళ్లి తీసుకు వస్తాను పంతులుగారు అని గౌతమ్ వెళ్తాడు. చూడండి బాబు గారు గౌతమ్ గారి ఆఫీస్ ఫైల్ తీసి చూడాల్సిన పని నీకేంటి ఉన్న గొడవలు చాలావానట్టు ఇంకా కొత్త గొడవలు సృష్టిస్తున్నారా మీరు ముందు బయటికి నడవండి గౌతమ్ చూస్తే పెద్ద గొడవ చేస్తాడు. అని మల్లి అంటుంది ఇది ఏం పేపర్లో తెలుసా గౌతమ్ ఆఫీస్ ఫైల్ కాదు వసుంధర అత్తయ్య గారి జీవితని కి సంబంధించిన విడాకుల పేపర్లు అని అరవింద్ అంటాడు. అవునా అని మల్లి షాక్ అవుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!