Naga Panchami: నీలాంబరి మోక్ష వాళ్ళ ఇంటికి వచ్చి తన చేతిని చెట్టుకు కొట్టి రక్తం తీసి చెట్టుకి క్రీం కారా అక్షరాన్ని రాస్తుంది. ఈ ఇల్లు నా రక్తంతో మంటలు చెలరేగి అగ్నికి ఆహుతి అయిపోవాలి ఇంట్లో వాళ్ళు సుఖంగా ఉండకూడదు ఇదే నా రక్త తర్పణం అని నీలాంబరి అంటుంది. సుబ్బు తన మాయ చేత నీలాంబరి రక్తంతో రాసిన క్రీo కారాన్ని తీసివేసి నీలాంబరి అడుగు తీసి అడుగు వేయకుండా చేస్తాడు. ఇదేంటి నా ఒళ్ళు అంతా స్తంభించి పోయింది నేను కదలలేకపోతున్నానేంటి అని నీలాంబరి జగన్మాత నన్ను మోక్ష వాళ్ళ ఇంట్లోకి వెళ్లేలా చూడు అని ప్రార్థిస్తుంది. జగన్మాత అనుగ్రహంతో నీలాంబరి మోక్ష వాళ్ళ ఇంట్లోకి వెళుతుంది. ఇంతలో వైదేహి వచ్చి ఎవరమ్మా నువ్వు అని అడుగుతుంది. వైదేహి అంటే మీరేనా అని నీలాంబరి అడుగుతుంది.
నా పేరు నీకెలా తెలుసు అని వైదేహి అంటుంది. మా అన్నయ్య నంబూద్రి చెప్పాడు ఆ ఇంట్లో లక్ష్మీదేవిలా ఉంటుంది ఆవిడే వైదేహి గారు అని నీలాంబరి అంటుంది. మీ అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు అమ్మ ఫోన్ చేస్తే కలవట్లేదు అని వైదేహి అంటుంది. తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళాడు ఆరు నెలల దాకా రాడు అప్పటిదాకా మీ ఇంట్లోనే ఉంటాను అని నీలాంబరి అంటుంది. మోక్షాకి నంబూద్రి అంటే పడదమ్మా నేను మా ఫ్రెండ్ వాళ్ళ కూతురని చెప్తాను రామా అని వైదేహి ఇంట్లోకి తీసుకువెళుతుంది. నీలాంబరి ఇంట్లోకి వెళుతూ ఉండగా గుమ్మానికి కట్టిన గుమ్మడికాయ కింద పడిపోతుంది. గుమ్మడికాయ కింద పడి పగిలిపోయింది చూడక్క విత్తనాలను నల్లగా అయిపోయాయి పంతులుగారు మాత్రం కట్టలు తీసుకువెళ్లాడు ఖరాబైన గుమ్మడికాయ కట్టి అని చిత్ర అంటుంది. గుమ్మడికాయ నల్లగా అయిందంటే మన ఇంట్లో దిష్టి చాలా ఉంది అని శబరి అంటుంది. కట్ చేస్తే,
ఇంట్లో వాళ్ళందరూ హాల్లోకి వస్తారు. ఎవరు ఈ అమ్మాయి అని రఘు అడుగుతాడు.మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు అండి అని వైదేహి అంటుంది. మీరు ఉండండి అంటీ నేను పరిచయం చేసుకుంటాను అని నీలాంబరి అంటుంది.నా పేరు మోహిని అండి నేను పాముల మీద రిసెప్ట్ చేస్తూ ఉంటాను అని అంటుంది. నువ్వు రావాల్సిన చోటికి వచ్చావా అమ్మాయి ఒకరిదేమో పుట్టినిల్లు పాముల పుట్ట ఇంకొకరేమో పాములను రిసెప్ట్ చేస్తూ ఉంటారు ఇక మీ ముగ్గురికి పండగే పండగ అని చిత్రం ఉంటుంది. నీలాంబరిని చూసినా పంచమి చాక్ అయిపోతుంది.మీరు ఏ ఏ పాముల మీద రిసెప్ట్ చేశారండీ అని మోక్ష అడుగుతాడు. అన్ని పాముల మీద చేశాను అని మోహిని అంటుంది. ఇకనుంచి ఇంట్లోనే ఉంటుంది కదా మోక్ష మీరు ఆ విషయాలు తర్వాత మాట్లాడుకోవచ్చు వెళ్లి రూమ్ చూపించండి అని వైదేహి అంటుంది.
కట్ చేస్తే, పంచమి వాళ్ళ అమ్మ ఘోర దగ్గరికి వెళ్లి నా కూతుర్ని కాపాడుకోవాలి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని అంటుంది. ఎవరికైనా ప్రాణగండం ఉంటే మృత్యుంజయ మహా యాగం చేస్తే ఆ గండం నుంచి ఆరోజు తప్పించుకోవచ్చు అమ్మా అని స్వామీజీ అంటాడు. అలాగే స్వామీజీ నా కూతురు పసుపు కుంకుమలు కాపాడడానికి నేను చేయిస్తాను అని వాళ్ళ అమ్మ అంటుంది. నీ కూతురు అల్లుడు ఒప్పుకుంటే చేద్దామమ్మా ఇక్కడ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అని స్వామీజీ అంటాడు. అలాగే స్వామి నా కూతుర్ని అల్లుడ్ని ఒప్పించి మళ్ళీ వస్తాను అంటూ పంచమి వాళ్ల అమ్మ వెళ్ళిపోతుంది.
కట్ చేస్తే, పంచమి దీపాలన్నీ వెలిగిస్తుంది. ఏం ఆలోచిస్తున్నావ్ పంచమి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకొని దీపాలను వెలిగించు అని సుబ్బు అంటాడు. కార్తీక సోమవారం నాడు పెట్టే దీపాలతో క్రిమి కీటకాలకు చెట్లకు పాములకు జీవకోటి మొత్తానికి వెలుగునిస్తుంది ఆ వెలుగు పడిన జీవుడు ధన్యుడు పంచమి అని సుబ్బు అంటాడు. నేను వెలిగిస్తున్నది నా కోసం కాదు సుబ్బు నా భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి అని పంచమి అంటుంది. నువ్వు నీ భర్త కోసం దీపాలు పెట్టిన జగమెల్ల వెలుగులని ఇస్తాయి దీపాలు అని సుబ్బు అంటాడు. దీపాలు పెట్టడం అయిపోయింది సుబ్బు ఇక వెళ్దాం పద అని పంచమి అంటుంది. సుబ్బు పంచమి ఇంట్లోకి వెళ్తారు. కట్ చేస్తే,
మీరు ఏ పాముల మీద రిసెప్ట్ చేశారండీ అని మోక్ష అడుగుతాడు. మోక్ష అలా మాట్లాడుతూ ఉండగా తన కళ్ళలో నుంచి ఏదో మ్యాజిక్ చేసి మోక్షని తన వశo చేసుకుంటుంది.అన్ని పాముల మీద రిసెప్ట్ చేశాను మోక్ష కానీ అందులో ఇష్ట రూపా నాగిని పాముల విషం చాలా భయంకరమైనది దానిని బంధించి ఆ విషయం మీద రిసెప్ట్ చేయాలి అని నీలాంబరి అంటుంది. తన మాయలో ఉన్న మోక్ష అటు ఇటు కదలకుండా తన కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడుతాడు, ఇష్ట రూప నాగినీలను నేను చూశాను నా భార్య ఇష్టరూప నాగిని ప్రతి పౌర్ణమికి నన్ను కాటు వేసి చంపాలని శతవిధాల ప్రయత్నిస్తూ ఉంటుంది అని మోక్ష అంటాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు మోక్ష నిన్ను పాము కాటుకి చావనివ్వను అని నీలంబరి అంటుంది..
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!