Naga Panchami January 15 2024 Episode 253: దానికి బదులు నాగచంద్ర కాంత మొక్క తీసుకురావడమే శ్రేయస్కరం అనిపిస్తుంది అని నాకు సాధువు అంటాడు. నాగ చంద్రకాంతం ఒక తీసుకురావడానికి నాకు ఏ అభ్యంతరము లేదు నేను యువరాణి వెళ్లి ఆ మొక్కను తీసుకువస్తాం అని ఫణీంద్ర అంటాడు. ఆ మొక్క కోసమైతే నేను రానవసరం లేదు కదా ఫణీంద్ర నాగమణి కోసము అయితే యువరాణి తప్ప ఇంకెవరు అవసరం లేదు అన్నావ్ మొక్కని తీసుకురావచ్చు కదా అని పంచమి అంటుంది. ఇంకా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అని ఫణీంద్ర అంటాడు. అదేమీ లేదు ఫణీంద్ర నిన్ను పూర్తిగా నమ్ముతున్నాం అని పంచమి అంటుంది.అయితే ఒక పని చెయ్యి యువరాణి నువ్వు ఒక్కదానివే వెళ్లి మొక్కను తీసుకువచ్చేయ్ నేను మోక్ష దగ్గర ఉండి నాగసాధులతో మోక్షకి సహాయం చేస్తానుఅవసరమైతే ఆ విషయాన్ని కొంచెం లాగే ప్రయత్నం చేస్తాను అని ఫణింద్ర అంటాడు.అ మొక్కని నేను తీసుకురాగలనంటావా ఫణీంద్ర అని పంచమి అంటుంది.
ఒక మంత్రం మనకు ఉంటుంది ఆ మంత్రాన్ని చదివితే నేరుగా నాగులోకానికి వెళ్లిపోవచ్చు అయితే ఎవరికైనా ఒక్కసారే ఆ మంత్రం పని చేస్తుంది నీకోసం ఆ మంత్ర శక్తిని ఉపయోగపడేలా చేస్తాను అని ఫణీంద్ర అంటాడు.చాలా మంచి పని చేస్తున్నావ్ ఫణీంద్ర నువ్వు ఇక్కడ ఉండడం మోక్షకి శ్రేయస్కరం అని నాగసాధు అంటాడు. అయితే నేను మొక్కను తీసుకురాగలనంటావా అని పంచమి అంటుంది. సాలా సులువు యువరాణి నాగులోకం వెళ్ళగానే నీటి అడుగున చాలా మొక్కలు పెరుగుతాయి నీళ్లలో ఆ మొక్కలు తల తల మెరుస్తూ ఉంటాయి నేను చెప్పే మంత్రాన్ని జపిస్తే నువ్వు నీటు అడుగునకు వెళ్లగలవు చాలా సునాయాసంగా ఆ మొక్కను తీసుకు రాగలవు యువరాణి అని ఫణీంద్ర అంటాడు. సరే యువరాజా నేను వెళ్తాను అని పంచమి అంటుంది. ఇందుకు అందరూ సమతమే కదా అని ఫణీంద్ర అంటాడు. నీ ఇష్టం ఇవన్నీ జరుగుతయో లేదో నాకు తెలియదు అని మోక్ష నిరాశతో అంటాడు. ఇది చాలా సమ్మతమైన విషయం అని నాగ సాధువు అంటాడు. కట్ చేస్తే,
మేఘన మాయజాలంతో తన అరిచేతులు అంజనము వేసుకొని వీళ్ళు మాట్లాడుకునేదంతా అవిని వీళ్ల వల్ల నాకు నాగమణి దక్కేలా లేదు అని జపం చేస్తుంది. అయితే నేను అడవిలోకి వెళ్లి కొన్ని మొక్కలను సేకరిస్తాను పంచమి రావడానికి లేట్ అయితే ఆ విషన్ని ఒళ్లంతా పాకకుండా చేయొచ్చు అని నాగ సాధువు అంటాడు. నేను కొంత విషన్ని లాగ గలను అని ఫణీంద్ర అంటాడు. ఏది ఏమైనా ప్రాణాలను పణంగా పెట్టే వ్యవహారం అందుకే నేను వెళ్లి కొన్ని మూలికలు సంపాదించుకొస్తాను అని నాగసాధు అంటాడు. భూలోకంలో దొరికే ఏ మూలిక అయినా అ విష పరిమితిని తగ్గించగలవు కానీ ఇష్ట రూపా నాగిని విషయాన్ని నాగచంద్ర కాంతమోక్క ఒకటే తగ్గించగలదు అని ఫణీంద్ర అంటాడు.మొక్క నీ పంచమి తీసుకువస్తుంది నేను త్వరగా వచ్చేస్తాను అని నాగ సాధువు వెళ్ళిపోతాడు.
నేను చీకటి పడగానే వస్తాను అని ఫణీంద్ర వెళ్ళిపోతాడు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను ధైర్యం చేయగలుగుతున్నాను అని పంచమి అంటుంది. ఫణీంద్ర చేతుల్లో చావడం కన్నా నీ చేతుల్లో నేను ఈరోజు హాయిగా చనిపోతాను అని మోక్ష అంటాడు.మీరు బ్రతుకుతానని ఆశ లేదా మోక్ష బాబు అని పంచమి అంటుంది. నువ్వు కాటేస్తే నేను చనిపోవడం ఖాయం నన్ను బ్రతికించడం అంటే అద్భుతం అలాంటివి జరగడం ఒక అద్భుతం అవి జరుగవచ్చు జరగకపోవచ్చు అని మోక్ష అంటాడు. ఎటు మొగ్గు చూపాలో అర్థం కాక సతమతమైపోతున్నాను భయపడితే మీ ప్రాణాలను కాపాడుకోలేను ధైర్యం చేస్తే బ్రతికించుకోగలనా అని సందేహం అని పంచమి అంటుంది.ఇంకేమీ ఆలోచించకు పంచమి సమయానికి ఆ మొక్కను తేగలిగితే నేను బ్రతుకుతాను అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు ఒకవేళ ఆలస్య మైయితే నేను చనిపోతే అని మోక్ష అంటాడు.అలా అనకండి మోక్ష బాబు నాకు భయం వేస్తుంది అని పంచమి అంటుంది. నన్ను బ్రతికించడం నీ చేతులే లేదు కానీ నీ జీవితం నీ చేతిలో ఉంది పంచమి నన్ను బ్రతికించలేకపోతే నువ్వు మాత్రం ఈ లోకంలో ఉండొద్దు పంచమి అప్పుడు నన్ను పూర్తిగా మర్చిపోయి ఆలోకం వెళ్ళిపో జీవితాన్ని ఆనందంగా అనుభవించు అని మోక్ష అంటాడు.ఆ మాటలు విని పంచమి మోక్షని గుండెలకు హత్తుకుని ఏడుస్తుంది. కట్ చేస్తే,
మేఘన జపం చేసి మహాకాళిని ప్రసన్నం చేసుకుంటుంది. చాలా అత్యవసర పరిస్థితుల్లో నిన్ను ఆవాహన చేసుకున్నాను చివరి నిమిషంలో నా ఆశలని అడియాశలైపోయాయి ఇప్పుడు మీరే నాకు మార్గం చూపించాలి అని మేఘన అంటుంది.నీ కోరిక ఏంటివో చెప్పు కరాలి అని మహాకాళి అంటుంది.ఆ నాగమణి సొంతం చేసుకోవడమే అని మేఘన అంటుంది.అంత సులభంగా ని ఆశ నెరవేరదు అని మహాకాళి అంటుంది.నేను ఆశపడింది చేతులు దాకా వచ్చింది మహాకాళి కానీ అమోక్ష ఫణీంద్ర వల్ల నాకు అవకాశం లేకుండా పోయింది అని మేఘన అంటుంది.ఒకటి ఉంది మహాకాళ్ళి మీరు తలుచుకుంటే నాకు నాగమణి సొంతమవుతుంది అని మేఘన అంటుంది. నేను నాగమణిని తెచ్చి ఇవ్వలేను కరాలి దానిమీద ఆశ వదులుకోవాల్సిందే అని మహాకాళి చెప్తుంది. నేనే నాగులోకానికి వెళ్లడానికి ఒక అవకాశం దొరికింది నన్ను పంచమిగా మారిస్తే చాలు మహాకాళి అని మేఘన అంటుంది.ప్రతిసారి ఇలా రూపం మార్చుకోవడం విరుద్ధం అని మహాకాళి అంటుంది. నాకు వేరే మార్గం లేదు మహాకాళి పంచమికి ఫణీంద్ర ఒక మంత్రాన్ని చెప్తాను అన్నాడు దానితో నాగులోకానికి వెళ్లొచ్చు అని మేఘన అంటుంది. మోసం చేసి మంత్రాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నావా అని మహాకాళి అంటుంది. ఈ అవకాశం పోతే నా ప్రాణాలు మీ కాళ్ళ దగ్గర పోగొట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదు అని మేఘన అంటుంది. ఇదే చిట్టచివరి కోరిక ఇకమీదట నా దగ్గర నుంచి ఏమీ ఆశించకు అని మహాకాళి అంటుంది. అది చాలు మాత అని మేఘన అంటుంది. నువ్వు నాగులోకానికి వెళ్లిన తర్వాత నేను ఇచ్చిన శక్తులన్నీ పోతే మళ్ళీ తిరిగి రావు అని మహాకాళి చెప్తుంది. పర్వాలేదు మాత నేను పంచమిగా మారితే చాలు ఆ నాగమణి సాధించి భూలోకానికి వచ్చి నాలాగా మారిపోతాను అని మేఘన అంటుంది. సరే కరాలి అని మహాకాళి మేఘన ని పంచమి గా మారుస్తుంది. పూర్తిగా పంచనిగా మారిపోయిన మేఘన ధన్యురాలిని మాత అని అంటుంది. ధర్మకార్య సిద్ధిరస్తు ధర్మము ఉంటే ఏ ఆటంకాలు జరగవు అని మహాకాళి వెళ్ళిపోతుంది. రూపం మార్చుకోగలిగాను కానీ ఫణీంద్ర నుంచి మంత్రాన్ని సంపాదించగలిగితే చాలు నాగమణి నా సొంతమైనట్టే అని మేఘన సంతోషపడుతుంది. కట్ చేస్తే,
మోక్ష జ్ఞాపకాలని గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. మోక్ష బాబు నీ మనో వేదన అర్థమవుతుంది అనుకోకుండా చనిపోతే ఏ బాధ ఉండదు కానీ చావు తప్పదని ముందే తెలిసినా తరువాత ఆ బాధ వర్ణనాతీతం అని పంచమి అంటుంది. చావు నుంచి తప్పించుకునే మార్గం లేనప్పుడు అలాంటి మొండి ధైర్యం వచ్చేస్తుంది నా వాళ్లు నా మీద ఎన్నో ఆశలు పెట్టించుకున్నారు కానీ వాళ్లకు నేను ఎప్పుడు కనిపించను అని బాధపడతాడు. అలా జరగకూడదనే కదా మోక్ష బాబు ఈ ప్రయత్నం అంతా అని పంచమి అంటుంది. మనిషి చనిపోయిన తర్వాత బ్రతికించడం కష్టం కానీ నిన్ను నిరాశ పరచడం నాకు ఇష్టం లేదు అని మోక్ష అంటాడు..
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!