Nindu Noorella Saavasam October 27 Episode 65: డాడీ మనం ఆ ఉయ్యాల ఎక్కువ దాము అని అంజు అంటుంది. అది చాలా ఎత్తుగా ఉంది అమ్మ భయపడతారు వద్దు అని అమరేంద్ర అంటాడు. ఆ మాట వినగానే పిల్లలు కోపంగా చూస్తారు. ఏంట్రా అలాగే నిలబడి చూస్తున్నారు అని అమరేంద్ర అంటాడు. నువ్వు వచ్చేటప్పుడు ఏమన్నావో ఒకసారి గుర్తుకు తెచ్చుకో డాడీ అని అంజు అంటుంది. సరే ఈరోజు మిమ్మల్ని ఆపడానికి నాకు ఏ రైట్స్ లేవు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని అమరేంద్ర అంటాడు. డాడీ ఒప్పుకున్నాడు అని పరిగెత్తుకెళ్ళి ఆ ఉయ్యాల దగ్గర నిలబడతారు పిల్లలు. భాగమతి పార్క్ అంతా తిరుగుతూ అమరేంద్ర వాళ్ళు కనిపించగానే ఏవండీ అని గట్టిగా అరుస్తుంది. పార్కులో ఉన్న వాళ్ళందరూ అలాగే నిలబడి భాగమతి వంక చూస్తారు. భాగమతి అమరేంద్ర వాళ్ళ దగ్గరికి వచ్చి ఇంతసేపు ఈ పార్క్ అంతా వెతికాను మీరు ఇక్కడ ఉన్నారా అని అంటుంది. ఏంటి అంత గట్టిగా అరుస్తున్నావు అని అమరేంద్ర అంటాడు.
అవునా మిమ్మల్ని చూడగానే అలా పిలిచేశాను సారి అని అంటుంది భాగమతి. నువ్వు తిరణాల్లో తప్పిపోయిన భర్తని చూసినప్పుడు ఎలా పిలుస్తారు అలా పిలిచావు అని అంజు పకపకా నవ్వుతుంది సారీ సార్ ఇంకెప్పుడూ అలా గట్టిగా పిలువను అని భాగమతి అంటుంది. నాలుగు టికెట్లు ఇవ్వండి అని అమరేంద్ర అంటాడు. సార్ పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా వెళ్లాలి అని అక్కడున్న అతను అంటాడు. మేమందరం కలిసి వచ్చినంత మాత్రాన పేరెంట్స్ అని ఎలా అనుకుంటారు అండి అని అమరేంద్ర అంటాడు. మేమందరం కలిసి వచ్చిన వాళ్ళు వేరు నేను వేరండి అయినా కలిసి వచ్చినంత మాత్రాన పేరెంట్స్ అని ఎలా అనుకుంటారు అండి అని భాగమతి అంటుంది. సారీ సార్ మీరు పేరెంట్స్ అనుకొని అలా అన్నాను కానీ పిల్లలతో పెద్దవాళ్లు కూడా వెళ్లాలి అని అతను అంటాడు. సరే అయితే ఆరు టికెట్లు ఇవ్వండి అని అమరేంద్ర తీసుకుంటాడు. టికెట్లు తీసుకొని వెళ్లి ఆ ఉయ్యాలలో ఎక్కి కూర్చుంటారు ఉయ్యాల స్టార్ట్ అవుతుంది అది చాలా దూరం వెళ్లి అటు ఇటు ఊగుతూ ఉంటే భాగమతి భయపడిపోయి అమరేంద్రని గట్టిగా పట్టుకుంటుంది.
దూరం నుంచి వాళ్లనే గమనిస్తున్న మనోహరి ఛాన్స్ దొరికింది కదా అని ఆయనని హగ్ చేసుకుంటుంది భాగమతి ఎంత పని చేస్తున్నావే అని మనోహరి అటు ఇటు తిరుగుతూ కోపంగా చూస్తుంది వాళ్ళ వంక. ఇంతలో అరుంధతి కూడా అక్కడికి వచ్చి వీళ్లంతా ఎక్కడున్నారు కనిపించట్లేదే అని చూస్తూ ఉండగా మనోహరి కనిపిస్తుంది మను ఇక్కడే ఉంది అంటే పిల్లలు కూడా ఇక్కడే ఉండి ఉండాలి అని అక్కడికి వచ్చి చూసేసరికి పైన ఉయ్యాలలో ఊగుతూ ఉంటారు పక్కనే అమరేంద్రను గట్టిగా పట్టుకొని బాగమతి కనిపిస్తుంది అయ్యో చెల్లి నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను అసలు అనుకోలేదు ఇప్పుడేం చేయాలి భగవంతుడా అని అరుంధతి అనుకుంటూ ఉండగా. నేను వచ్చేసాను అని గుప్తా అంటాడు. గుప్తా గారు సమయానికి వచ్చారు చూడండి చెల్లి ఏం చేస్తుందో అని అరుంధతి అంటుంది. ఏమున్నది ఆ నావ అటు ఇటు ఊగుచున్నది ఆ బాలిక అతనిని గట్టిగా పట్టుకున్నది దాంట్లో తప్పు ఏమున్నది అని గుప్త అంటాడు.
ఉయ్యాల ఆగిపోయింది వాళ్ళు దిగిపోతారు.హలో పిల్లలకు ధైర్యంగా ఉంటానని వచ్చావు కానీ నువ్వే భయపడ్డావ్ ఏంటి అని అమరేంద్ర వెళ్ళిపోతాడు. బాగి నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి ఇలా భయపడడం ఏంటి అని తనను తానే తిట్టుకుంటుంది. పిల్లలు ఆ పార్కులో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది చూస్తూ అరుంధతి సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది. ఇదే సమయము, బాలిక ఆనందంతో పొంగిపోతుంది ఎలాగైనా సరే నా అంగులికం తీసుకోవలెను అని గుప్తా అరుంధతి దగ్గరికి వచ్చి బాలిక ఏమి చేయుచున్నావు అని అంటాడు. చూడండి మిస్టర్ గుప్తా గారు నా పిల్లలు ఎంత సంతోషంతో ఆడుకుంటున్నారు అని అరుంధతి అంటుంది. చూడు బాలిక నీ మనసులో ఉన్న కోరిక తీరాలంటే నేను ఒక పని చెప్పేదను అది నువ్వు చేసేదవా అయినను నువ్వు చేయలేవులే అని గుప్తా అంటాడు. చెప్తే కదా గుప్తా గారు నేను చేస్తాను లేదో తెలిసేది అని అరుంధతి అంటుంది. అయితే నీ దగ్గర విలువైన వస్తువు ఏదైనా ఉంటే ఆ చెరువులో పడవేయుము నీ మనసులో కోరిక కచ్చితంగా నెరవేరుతుంది అని గుప్తా అంటాడు.
ఏదైనా పుణ్యక్షేత్రాలలో వేస్తే మంచి జరుగుతుందని విన్నాను కానీ ఈ పార్కులో వేస్తే ఏం పుణ్యం వస్తుంది అని అరుంధతి అంటుంది. మంచి మనసుతో కోరుకొని ఎక్కడ వేసిన అది నెరవేరుతుంది బాలిక అది నీకు అత్యంత విలువైనది అని గుప్త అంటాడు. గుప్తా గారు నాకు అర్థమైంది నేను నీ ఉంగరమును నీళ్లలో వేస్తే నువ్వు వెళ్లి తెచ్చుకోవాలని అనుకుంటున్నారా అని అరుంధతి తన మనసులో అనుకుంటుంది.అలాగే గుప్తా గారు మీరు కళ్ళు మూసుకోండి అని అరుంధతి గుప్తాని తీసుకువెళ్లి నీళ్లలో తో చేస్తుంది. ఇదేంటి బాలిక ఏదైనా విలువైనది వేయమంటే నన్ను తోస్తున్నావు అని గుప్తా అంటాడు. నాకు విలువైనది ఏదైనా ఉంది అంటే అది మీరే కదా గుప్తా గారు అందుకే మిమ్మల్ని వేస్తున్నాను అని అరుంధతి అంటుంది. ఊరికే హాస్యమునుకు అంటిని బాలిక దానిని నువ్వు నిజమనుకుంటివి అని గుప్తా అంటాడు.
కట్ చేస్తే కోపంగా మనోహరి నీలా దగ్గరికి వచ్చి ఇదంతా నీవల్లే జరిగింది అది అక్కడ అమర్ కు దగ్గర అయిపోతుంటే నువ్వు ఇక్కడ ఆపిల్ కట్ చేస్తూ తింటూ కూర్చుంటావా అని నీలా ని కొడుతుంది మనోహరి. దానికి నన్ను ఎందుకు కొడుతున్నారమ్మ గారు నేనేం చేశాను అని నీలా అంటుంది. మన ప్లాను మొదలు పెట్టే సమయం ఆసన్నమైంది వెళ్దాం పద అని మనోహరి నీలని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంతలో రాథోడ్ కి గుప్తా కనిపిస్తాడు ఏంట్రా ఏం చేస్తున్నావు అని అంటాడు. జగన్నాథ ఈ నిండుకుండ రాథోడ్ కంట్లోనే పడాలా అని గుప్తా అనుకుంటాడు.ఏంట్రా నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వు వంగి చూస్తున్నావ్ చిల్లర కానీ అని రాథోడ్ అంటాడు. ఆ మాటకి గుప్తాకి కోపం వచ్చి రాథోడ్ చంప మీద ఒకటి ఇస్తాడు. ఏంట్రా నన్నే అని రాథోడ్ అంటాడు.ఏంటి డౌటా అని మళ్లీ గుప్త రాథోడ్ ని కొడుతూ ఉంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!