Nindu Noorella Saavasam April 1 2024 Episode 199: పిల్లలు త్వరగా రండి లేట్ అయిపోతుందని అమరేంద్ర పిలవడంతో పిల్లలు కిందికి వస్తారు.మిస్సమ్మ నువ్వు మమ్మల్ని క్యాంపుకు వెళ్లకుండా అపుతను అన్నావు కదా ఆ ప్లాన్ మిస్ అయిపోయింది నువ్వేం బాధపడకు మీ స్సమ్మ అని అంజలి అంటుంది. భాగమతి పిల్లల ని హత్తుకునే బాధపడుతుంది. పిల్లలు అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. పిల్లలు మనోహరి గారు మీ కోసం చేసిన స్వీట్ మర్చిపోతున్నారు ఉండని తీసుకొస్తున్నాను అని పరిగెత్తుకొస్తూ ఉండగా భాగమతి కాలికి అక్కడ ఉన్న గోడ తాకి కింద పడిపోతుంది. తన బొటనవేలికి దెబ్బ తగులుతుంది పరిగెత్తుకొచ్చి మిస్సమ్మ ఏం కాదు అంటూ అమరేంద్ర తన కాళ్లు ముట్టుకొని క్లాత్ తో రక్తం తుడిచి కట్టు కడతాడు. పిల్లలు అది చూసి బాధపడుతూ ఉంటారు.
మనోహరి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మిస్సమ్మ ఇప్పుడు ఓకేనా అని అమరేంద్ర అంటాడు. పిల్లలు శుభమాని క్యాంపుకు వెళుతుంటే ఇలా జరిగిందేంటి పిల్లలకి అశుభమేమో అని భాగమతి అంటుంది. పిల్లల్ని క్యాంపుకు పంపించకుండా ఆపడానికి నువ్వు ఎంత దూరమైనా వెళ్తావు అనుకున్నాను కానీ ఇలా చేస్తావని అనుకోలేదు కానీ నేను ఎలాగైనా సరే వాళ్ళని క్యాంపుకు పంపిస్తాను అని మనోహరి అనుకుంటుంది. ఇప్పుడు నా వల్ల పిల్లల క్యాంపుకు వెళ్ళలేరుగా అని భాగమతి అంటుంది. ఎందుకు వెళ్ళరు అని మనోహరి అంటుంది. సుభామని పిల్లలు వెళుతూ ఉంటే ఇలా జరిగింది ఇంత జరిగాక కూడా క్యాంపుకు ఎలా పంపిస్తాం అని నిర్మల అంటుంది. మీ అమ్మ చెప్పింది నిజమే కదా అని శివరామ్ అంటాడు. అయినా మిస్సమ్మ నిర్లక్ష్యం వల్ల జరిగిందా నికి క్యాంప్ కి సంబంధం ఏంటి అని మనోహరి అంటుంది.
మనకి మన ఇంట్లో వాళ్లకి ఇలా జరిగితే ఆలోచించొచ్చు అంతే కదా అమర్ పిల్లలు పదండి లేట్ అయిపోతుంది అని మనోహరి పిల్లల్ని తీసుకొని వెళుతుంది. అది చూసి ఏమీ చేయలేక నిలబడి చూస్తూ ఉంటాడు అమరేంద్ర. ఏ సంబంధం ఉంది ని మిస్సమ్మ నా పిల్లల్ని క్యాంపుకు వెళ్లకుండా ఆపాడానికి తనకు గాయం చేస్తుంది కానీ కన్నతల్లిని పక్కనే ఉండి ఏమీ చేయలేకపోతున్నాను చెడు మీద మంచి గెలుస్తుంది అన్నావు కదా నా పిల్లల్ని ఆపే శక్తి నాకు ఇవ్వు లేదంటే నువ్వే ఆపు అని అరుంధతి గట్టిగా అంటుంది. ఆకాశంలో ఉరుములు మెరుపులు వస్తాయి బాలికకు శక్తులు వచ్చే టైం ఆసన్నమైంది ఈరోజు పౌర్ణమి కథ అని గుప్తా అనుకుంటాడు. పిల్లలని కారులో ఎక్కించి పంపిస్తుంది మనోహరి.
నువ్వే కనుక ఉంటే నా పిల్లలు ఈ గేటు కూడా దాటకూడదు నువ్వే ఏదో ఒకటి చేసి తనకి దూరం కాకుండా చూడు అని అరుంధతి అంటుంది. నిజంగానే కారు వెనుకకు వస్తుంది. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. ప్రిన్సిపల్ మేడం కారు నుంచి వచ్చి పిల్లలందరిని దింపి తీసుకువస్తుంది. ఏమైంది మేడమ్ ఎందుకు పిల్లల్ని దించేశారు అని అమరేంద్ర అడుగుతాడు. క్యాంపు ఆగిపోయింది సార్ ఇప్పుడే మెసేజ్ వచ్చింది అని మేడం చెబుతుంది. క్యాంప్ ఆగిపోవడం ఏంటి మేడం ఒకసారి చూసుకోండి అని మనోహరి అంటుంది. నేను ప్రిన్సిపాల్ మేడంని క్యాంపు ఉంది లేదనేది నాకు తెలియదా అని గట్టిగా అరిచి మేడం వెళ్ళిపోతుంది. పిల్లలు నలుగురు పరిగెత్తుకొచ్చి మిస్సమ్మ హాగ్ చేసుకుంటారు. మిస్సమ్మ మా కోసమే కదా నువ్వు కాలికి దెబ్బ తాకించుకున్నవు అని అంజలి అడుగుతుంది.నా బంగారాల కోసం ఏంచేయడానికి అయినా సిద్ధం అని భాగమతి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. మనోహరి టెన్షన్ పడుతుంది.
నేను అనుకున్నది జరిగింది అని అరుంధతి గుప్తా దగ్గరికి వచ్చి గుప్తా గారు నేను అనుకున్నది ఎలా జరిగింది అని అడుగుతుంది. పౌర్ణమి ఘడియలు వచ్చాయి కాబట్టి తన శక్తి వచ్చింది అని గుప్తా మనసులో అనుకుంటాడు. నాకు తెలియట్లేదు బాలిక నేను ఆశ్చర్యంగానే చూచుచుంటిని అని గుప్తా వెళ్ళిపోతాడు. అసలు నాకు రాబోతున్న శక్తులు ఏంటి ఎందుకు గుప్తా గారు నాకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు ఆ శక్తులు ఏంటి అని ఆలోచిస్తుంది అరుంధతి. కట్ చేస్తే, మిస్సమ్మ అసలు మేడమ్ ఉన్నట్టుండి క్యాంప్ క్యాన్సిల్ అయింది అని ఎందుకు చెప్పింది నాకేమీ అర్థం కావట్లేదు అని రాథోడ్ అంటాడు. మనోహరి తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటే పైన ఉన్న మహాతల్లి ఊరుకుంటుందా తన పిల్లని తనే కాపాడుకుంటుంది అని రామ్మూర్తి అంటాడు. మిస్సమ్మ ఆ మనోహర్ని తలుచుకుంటేనే భయం వేస్తుంది రేపు ఒక్కరోజు తాగితే ఎల్లుండి పెళ్లి ఆ పెళ్లి ఆపకపోతే ఆ ఇల్లు అల్లా కల్లోలం అయిపోతుంది అని రాథోడ్ అంటాడు. ఆ పెళ్లి జరగకుండా మనం ఏదో ఒకటి చేయాలి అని భాగమతి అంటుంది. ఆ మనోహరి రాక్షసమ్మ తనని ఎలా ఆపగలం అని రామ్మూర్తి అంటాడు. నేను చెప్పినట్టు చేయండి అని భాగమతి తన ప్లాన్ చెబుతుంది. రాథోడ్ మనం అందరి ముందు మనోహర్ని లాక్ చేస్తే అప్పుడే మనం ఈ పెళ్లి ఆపగలం మనం ఈ కుటుంబాన్ని కాపాడగలం అని భాగమతి అంటుంది.
నాన్న నేను చెప్పినట్టు నువ్వు చెప్పు మిగతాదంతా నేను రాథోడ్ చూసుకుంటం అని భాగమతి అంటుంది. నాకు ప్రాణం బిక్ష పెట్టి అ కుటుంబం కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనమ్మా అని రామ్మూర్తి అంటాడు. రేపు పొద్దున్నే ఇంటికి వచ్చేయండి నాన్న ఆ మనోహరి కి షాకిద్దం అని భాగమతి అంటుంది. రేపు మనోహరి కి జింతాత జిత జిత అని రాథోడ్ సంతోషపడతాడు. కట్ చేస్తే, నేను అనుకున్నది ఎలా జరిగింది? పౌర్ణమికి ఆ దేవుడు నాకు శక్తిని ఇస్తాడా నేను ఏది అనుకుంటే అది జరిగిపోతుందా అని అరుంధతి వర్షం రావాలి అని గట్టిగా అంటుంది. వర్షం రాలేదని డిసప్పాయింట్ అవుతుంది అరుంధతి. ఈ బాలికకు పౌర్ణమి నాడు శక్తులు వస్తాయని కనిపెట్టి ఉంటుందా అని గుప్తా అరుంధతి వంక చూస్తూ ఉంటాడు. గుప్తా గారు ఏం చేస్తున్నారు నాలో ఏది శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది నేను ఏదైనా చేస్తాను అనిపిస్తుంది మా ఆయన పెళ్లి ఆపడానికి నాకు శక్తి ఉందని పిస్తుంది అని అరుంధతి అంటుంది. నీకు శక్తులు ఉన్నాయా అయితే ఆ వాహనములు గాలిలోకి ఎగిరాల చెయ్యి అని గుప్తా అంటాడు. అలా ఎలా చేయగలం గుప్తా గారు అని అరుంధతి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!